హవ్వ.. రాష్ట్రానికి గూగుల్ జగన్ క్రెడిటేనంట?

Publish Date:Oct 15, 2025

Advertisement

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. అన్న చందంగా ఉంది వైసీపీ తీరు. కింద పడినా మాదే పై చేయి అని చాటుకోవడానికి ఆ పార్టీ చేస్తున్న విన్యాసాలు నవ్వుల పాలౌతున్నాయి. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్ ఆ ఐదేళ్ల కాలంలోనూ రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అధ: పాతాళానికి దిగజారిపోయేలా చేశారు. ఉన్న పరిశ్రమలను తరిమేశారు. కొత్తవి రాకుండా అడ్డగోలు విధానాలతో  అడ్డుకున్నారు. ఒక్క పారిశ్రామిక రంగం అనేమిటి? జగన్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాలలోనూ వెనుకబడిపోయింది. అభివృద్ధి ఆనవాలే లేకుండా పోయింది. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి గురించి పోరుగు రాష్ట్రం మంత్రులే జోకులేసేలా అప్పట్లో రాష్ట్ర పరిస్థితి ఉండేది.

అయినా సరే జగన్  మాత్రం అభివృద్ధి, సంక్షేమాలలో తామే మేటి అని నిస్సిగ్గుగా చాటుకునే వారు. అంతే కాదు.. జగన్ హయాంలో వీసమెత్తు అభివృద్ధి లేకపోయినా.. కొత్తగా రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి రాకపోయినా పట్టించుకునే వారు  కాదు కానీ, అంతకు ముందు చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల గురించి మాత్రం అదంతా తమ క్రెడిటేనని చాటుకోవడానికి  వైసీపీయులుఇసుమంతైనా వెనుకాడే వారు కాదు. అనంతపురంలో కియా మోటార్స్ రావడానికి చంద్రబాబు చేసిన కృషి అందరికీ తెలిసిందే. అయితే వైసీపీ మాత్రం అసెంబ్లీ వేదికగా నిస్సిగ్గుగా కియా రాష్ట్రానికి రావడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమని చెప్పుకున్నారు. ఒక్క కియా అనేమిటి, తమ ప్రమేయం లేకుండా రాష్ట్రంలో అంతకు ముందు ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి అంతా తమ ఖాతాలోకి వేసుకోవడానికి ఇసుమంతైనా సంకోచించేవారు కాదు. 

ఇప్పుడు విశాఖలో గూగుల్ తన అతి పెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడానికి చంద్రబాబు సర్కార్ తో ఒప్పందం చేసుకున్న తరువాత వైసీపీ మళ్లీ ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి తాపత్రేయపడుతోంది. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడానికి జగనే కారకుడని ఏ మాత్రం సిగ్గు లేకుండా చెప్పుకుంటోంది.    

 వైజాగ్‌లోని తన ఏఐ  హబ్ ద్వారా రాబోయే ఐదేళ్లలో   15 బిలియన్ల డాలర్ల పెట్టుబడిని గూగుల్ మంగళవారం  అధికారికంగా ప్రకటించిన విషయం  తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం, గూగుల్ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి  అశ్విని వైష్ణవ్, రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ సమక్షంలో సంతకాలు జరిగాయి.  ఇంతటి స్థయిలో ప్రపంచ మేటి సంస్థ గూగుల్ నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ లపై దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వైసీపీ మాత్రం ఈ ఘనతను అంగీకరించలేక.. తనదైన శైలిలో ఫేక్ ప్రచారానికి తెగబడుతోంది.  

చంద్రబాబు నాయుడు దార్శనికతకు, అభివృద్ధి సంక్షేమం విషయంలో ఆయన ఆచరణాత్మక విధానాలను రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన ప్రత్యర్థులు సైతం అభినందిస్తారు, ప్రశంసిస్తారు. అయితే వైసీపీ మాత్రం ఈ వాస్తవాన్ని అంగీకరించలేక ఫేక్ ప్రచారానికి దిగి నవ్వుల పాలౌతోంది.  గూగుల్ డేటాసెంటర్ విశాఖకు రాబోతోందనగానే.. వైసీపీ డేటా సెంటర్ల వల్ల రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేదన్న వాదనను తలకెత్తుకుంది. అయితే, ఆ ప్రచారం ఎందుకూ పనికిరాకుండా పోవడం.. చంద్రబాబు, లోకేష్ ల బ్రాండ్ ఇమేజ్ అమాంతంగా పెరిగిపోవడంతో.. వైసీపీ ఇక కొత్త ప్రచారానికి తెరతీసింది. అదేమిటంటే.. రాష్ట్రానికి గూగుల్ తరలిరావడానికి జగనే కారణమనీ, ఇందులో చంద్రబాబు ఘనతేమీ లేదనీ తన భుజాలను తానే చరిచేసుకోవడం మొదలెట్టిది. ఇంతకీ వైసీపీ వాదనేంటంటే.. కొన్నేళ్ల కిందట జగన్ అదానీని కలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ..  ఆ భేటీలోనే గూగుల్ డేటా సెంటర్  ఏపీకి తీసుకురావాలని జగన్ ప్రయత్నించారు. ఆ ప్రయత్నమే ఫలించి ఇప్పుడు గూగుల్ వైజాగ్ కువచ్చింది.

అయితే ఈ వాదన వైసీపీ నవ్వుల పాలు కావడానికి తప్ప మరొకందుకు ఉపయోగపడలేదని పరిశీల కులు విశ్లేషిస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నసమయంలో  రాష్ట్రంలో ఒక్కకంటే ఒక్క ప్రధాన ఐటీ కంపెనీ వచ్చిదా?  అసలు ఏ కంపెనీ అయినా ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తైనా చూసిందా? అంటూ జనమే వైసీపీ వాదనను పూర్వపక్షం చేస్తున్నారు.  నెటిజనులు వైసీపీ వాదనను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇక రాజకీయ పరిశీలకులైతే.. వైజాగ్ కు గూగుల్ తరలిరావడం చంద్రబాబు ఘనతే అని వైసీపీ అంగీకరించలేకపోవడాన్ని అర్ధం చేసుకోవచ్చునని అంటూనే.. ఈ సమయంలో వైసీపీ ఫేక్ ప్రచారానికి దిగకుండా మౌనం వహిస్తే ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేతకూ మంచిదని సలహా ఇస్తున్నారు.  

By
en-us Political News

  
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.