Publish Date:Jun 30, 2022
2న హైదరాబాద్ కు యశ్వంత్ సిన్హా.. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సమావేశం.. కాంగ్రెస్ హాజరయ్యేనా?
హైదరాబాద్ నగరంలో హెక్టిక్ పొలిటికల్ యాక్టివిటీ జరుగుతోంది. ఒక వైపు హైదరాబాద్ లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. మరో వైపు అదే సమయంలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను అధికార టీఆర్ఎస్ నగరానికి ఆహ్వానించింది. ఈ నెల 2న అంటే బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే యశ్వంత్ సిన్మా హైదరాబాద్ రానున్నారు.
అదే రోజు టీఆర్ఎస్ జల విహార్ లో టీఆర్ఎస్ ఆయనతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అలాగే జలవిహార్ లో ర్యాలీ కూడా తీయనున్నది. మోడీ హైదరాబాద్ లో బస చేసిన నేపథ్యంలో నగరంలో ఆంక్షలు అమలులో ఉంటాయి. అయితే ఆ ఆంక్షలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్ కే పరిమితం కావడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే జలవిహార్ లో ర్యాలీ నిర్వహించేందుకు టీఆర్ఎస్ నిర్ణయించింది. కాగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న యశ్వంత్ సిన్హా సమావేశానికి కాంగ్రెస్ హాజరౌతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అసలు ఈ సమావేశానికి టీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఆహ్వానించిందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి పోటీగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి అయిన యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్, టీఆర్ఎస్ లు రెండూ హాజరయ్యాయి. ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తామనీ ప్రకటించాయి. జాతీయ స్థాయిలో పరిస్థితి వేరు. తెలంగాణలో క్షేత్ర స్థాయిలో పరిస్థితి వేరు. తెలంగాణలో టీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికలలో బీజేపీ కాదు కాంగ్రెస్సే ప్రధాన పోటీదారని ఇటీవల కేసీఆర్ లీక్ చేసిన పీకే సర్వే నివేదికలలో తేలింది.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యశ్వంత్ సిన్హా సమావేశానికి కాంగ్రెస్ ను ఆహ్వానిస్తుందా అన్న సందేహాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఆహ్వానించినా కాంగ్రెస్ హాజరౌతుందా అన్న సందేహాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు మద్దతు విషయంలో ఏకతాటిపైకి వచ్చిన విధంగానే.. యశ్వంత్ సిన్హాకు మద్దతు గా టీఆర్ఎస్ నిర్వహిస్తున్న సమావేశానికి కాంగ్రెస్ హాజరయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఇలా ఉండగా నగరంలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే యశ్వంత్ సిన్హాను కేసీఆర్ ఆహ్వానించడం వ్యూహాత్మక ఎత్తుగడగా చెబుతున్నారు. యశ్వంత్ సిన్హాకు బీజేపీ నేతలతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆ పార్టీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయంలో యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ కు ఆహ్వానించడం ద్వారా ఆ పార్టీకి చెందిన కొందరు మిత్రులు ఆయనతో టచ్ లోకి వచ్చే అవకాశం ఉంటుందన్నది కేసీఆర్ వ్యూహంగా భావిస్తున్నారు. ఏది ఏమైనా బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే యశ్వంత్ సిన్హాను టీఆర్ఎస్ హైదరాబాద్ కు ఆహ్వానించడం రాజకీయంగా ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/yashwanth-meeting-in-jalavihar-on-2nd-will-congress-attend-39-138787.html
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.