ఇకపై దాడులు చేస్తే.. వాళ్లింటి కెళ్లి కొడతాం.. చంద్రబాబు

Publish Date:Aug 25, 2022

Advertisement

దాడులకు ప్రతి దాడులు తప్పవని వైసీపీకి చంద్రబాబు స్పష్టమైన హెచ్చరిక చేశారు. పోలీసుల అండతో దాడులు చేస్తుంటూ చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తన పర్యటనలను అడ్డుకోవడం తప్ప జగన్ కు ఇంకే పని లేదని విమర్శించారు. పరిపాలన అంటే విపక్షాలపై దాడులు చేయడమేననుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు స్వరంలో స్పష్టమైన మార్పు కనిపించింది. గతానికి భిన్నంగా ఆయన పరుష పదజాలంతో వైసీపీపై విరుచుకు పడ్డారు. ఆయన స్వరం పెంచారు. విమర్శల్లో వాడి పెంచారు. కుప్పంలో వైసీపీ శ్రేణుల ఆరాచకత్వంపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటిన్ ను ధ్వంసం చేస్తారా అంటూ రెచ్చిపోయారు. అన్న క్యాంటిన్ ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ కుప్పంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి బస్టాండ్ వద్ద ఉన్న అన్న క్వాంటిన్ వరకూ పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో వైసీపీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  అన్న క్యాంటిన్ ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన ఈ రోజు కుప్పం చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు.

అన్నం పెట్టే అన్న క్యాంటిన్ ను ధ్వంసం చేయడాన్ని నీచమైన చర్యగా అభివర్ణించారు. వైసీపీ హయాంలో వీధికో రౌడీని తయారు చేసి ప్రజలపైకి ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. పోలీసులు తిన్నగా వారి విధులు నిర్వర్తిస్తే ఈ రోజు కుప్పంలో అన్న క్యాంటిన్ ధ్వంసమయ్యేదా అని ప్రశ్నించారు. పోలీసు స్టేషన్ పక్కనే ఉన్నా నిర్భయంగా దాడి చేసి క్యాంటిన్ ను ధ్వంసం చేశారంటే అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పని చేస్తోందా అన్న అనుమానం వస్తోందని అన్నారు. కుప్పం నడిబొడ్డున ఇంత  జరుగుతుంటే ఎస్పీ ఏం చేస్తున్నాడు? ఎక్కడ ఉన్నాడని నిలదీశారు. మా వాళ్లూ దాడులకు దిగితే ఏం చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ 60 వేల మంది పోలీసుల అండతో  రెచ్చిపోతోందనీ, అదే మాకు (తెలుగుదేశం)కు 60 లక్షల కార్యకర్తల సైన్యం ఉంది జాగ్రత్త అని హెచ్చరించారు. అన్న క్యాంటిన్ ను ధ్వంసం చేసిన వారిని పోలీసు స్టేషన్ కు కాకుండా వాళ్ల ఇళ్లకు తీసుకెళ్లి దిగబెట్టి వస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇకపై మాపై దాడులు చేస్తే వారి ఇళ్ల కెళ్లి కొట్టి వస్తామని హెచ్చరించారు.

వైసీపీ మూడేళ్ల పాలనలో పలు చోట్ల తన పర్యటనలను అడ్డుకోవడం తప్ప జగన్ ప్రభుత్వం ఏం చేసింది లేదని విమర్శించారు. దాడులు చేసి భయపెట్టి గెలవాలనుకుంటున్న వైసీపీ పన్నాగాలు పారవని హెచ్చరించారు. దాడులకు బయపడేది లేదన్నారు. వైసీపీపై, పోలీసులపై న్యాయపోరాటం చేస్తామన్నారు. అలాగే వైసీపీ అరాచకాలపూ రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. వైసీపీ ఆగడాలపై జనం గళమెత్తాలని పిలుపునిచ్చారు. జనం మౌనంగా ఉంటే వైసీపీ రౌడీలు వారి ఇళ్లపైకి వస్తారని అన్నారు. తన తీరు ఇప్పటి వరకూ ఒక లెక్క..ఇకపై ఒక లెక్కగా ఉండబోతోందని చంద్రబాబు అన్నారు. తన శైలికి భిన్నంగా ఇకపై కఠినంగా ఉండక తప్పని పరిస్థితి వచ్చిందన్నారు.

తాను సొంత నియోజకవర్గంలో పర్యటనకు వస్తే సిగ్గులేని ప్రభుత్వం బస్సులను నిలిపివేసింది. పాఠశాలలకు సెలవు ఇచ్చేసింది. ఏమిటి.. ఈ సర్కార్ ఏం చేస్తోంది అని ప్రశ్నించారు. వైసీపీ దాడులు, అరాచకాలపై ఇంకా తెలుగుదేశం కార్యకర్తలను కట్టడి చేయడం సాధ్యం కాదని చంద్రబాబు అన్నారు. వైసీపీ వాళ్లు కూల్చిసిన దగ్గరే అన్న క్యాంటిన్ లో బోజనం పెడుతున్నానని అన్నారు. అన్న క్యాంటిన్ ఇక్కడే కొనసాగుతుందని స్పష్టం చేశారు.  వైసీపీ శ్రేణులు కూల్చివేసిన అన్న క్యాంటిన్ ను అక్కడే ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించిన చంద్రబాబు అక్కడ నుంచి వెళ్లిన కొద్దివ్యవధిలోనే ఆ క్యాంటిన్ వద్దకే భోజనాలు చేయడానికి వైసీపీ కార్యకర్తలు వచ్చారు.

పుంగనూరు నుంచి తమను బస్సుల్లో తీసుకు వచ్చి కనీస ఏర్పాట్లూ కూడా చేయలేదని కుప్పం వైసీపీ నేతలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకలితో ఉన్న వైసీపీ కార్యకర్తల బాధను చూసి తెలుగుదేశం శ్రేణులు వారికి అన్న క్యాంటిన్ లో భోజనాలు పెట్టారు. తాము కూల్చేసిన అన్న క్యాంటిన్ లోనే వైసీపీ కార్యకర్తలు భోజనాలు చేశారు.
 

By
en-us Political News

  
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
తెలంగాణ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ లో 13 వేల 679 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక పోతే మల్లు భట్టి విక్రమార్క మొత్తం 3 లక్షల24 వేల234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
టి.సి. రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయన తన సుదీర్ఘ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ విప్‌లుగా నియమితులయ్యారు. అలాగే శాసనమండలిలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా నియమించింది.
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు.
ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ, వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.