ఇటు చూస్తే స్టాలిన్.. అటు చూస్తే మోడీ .. కేసీఆర్ కు కింకర్తవ్యం!

Publish Date:Jul 26, 2022

Advertisement

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే, ఈ పోలిక అంత ఆప్ట్ కాదేమో కానీ,  ఒక దానితో ఒకటి ముడి వేసి, అటూ ఇటూ అవడం కంటే  దేనికదే అన్నట్లుగా నడచు కుంటే, ఇదిగో ఇలాంటి గిల్లికజ్జాలు, చిల్లర తగవులు  రావంటారు. ఒకరేమో దేశ ప్రధానమంత్రి, ఇంకొకరేమో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ ఇద్దరు ఎడ ముఖం పెడ ముఖంగా ఒకరి ముఖం ఒకరు చూసుకోలేక పోవడం వారికేమో గానీ, చూసే వాళ్ళకు , అస్సలు బాగోదు. బాగుండడం బాగోకపోవడం విషయం పక్కన పెట్టినా, ఆ కారణంగా  అసలే అంతంత మాత్రంగా ఉన్న కేంద్ర రాష్ట్ర సంబధాలు మరింతగా బిగుసుకు పోయే ప్రమాదం ఉందని, నిజానికి అదే జరుగుతోందని అంటున్నారు.

ఫలితంగా పరస్పర ప్రయోజనాలే కాదు, పరిపాలనా పరంగా సమస్యలు వస్తాయని అధికారులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వ సంబంధాల విషయాన్నే తీసుకుంటే రెండు ప్రభుత్వాల మధ్య ప్రతి రోజు ఏదో ఒక వివాదం రగులుతూనే వుంది. రోజులు వారాలు కాదు, ఏకంగా నెలల తరబడి తగవులు సాగినా చివరకు ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదు. హళ్లికి హళ్లి  సున్నకు సున్నా.  వరి వివాదమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

తెలంగాణకు ఇరుగు పొరుగున ఉన్న రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలోనూ రాజకీయంగా కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీని రాజకీయంగా వ్యతిరేకించే ప్రభుత్వాలే ఉన్నాయి. నిజానికి ఈ రెండు రాష్ట్రాలు మాత్రమే కాదు, దేశంలో ఉన్న మొత్తం 28 రాష్ట్రాలు కేంద్ర పాలిత కు గానూ, 18 రాష్ట్రాలలో మాత్రమే బీజేపీ అధికారంలో వుంది. మిగిలిన  రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో లేదు. కాంగ్రెస్, తృణమూల్ , లెఫ్ట్ ఫ్రంట్, ఆప్ ఇలా వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నాయి. అయినా, రాజకీయంగా ఎవరిని ఎవరు ఎంతగా విమర్శించుకున్నా వ్యక్తిగత ద్వేషం పెద్దగా ఎక్కడ కనిపించదువు. ఒక కేసీఆర్, ఒక మమతా బెనర్జీ వంటి ఒకరిద్దరు ముఖ్యమంత్రుల విషయంలో తప్పించి మిగిలిన వారి విషయంలో ఇలాంటి వ్యక్తిగత ద్వేషం ఎక్కడా లేదనే చెప్పవచ్చును.

 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత సంవత్సర కాలంలో , అధికార అనధికార కార్యక్రమాలలో పాల్గొనేందుకు నాలుగైదు సార్లు రాష్ట్రానికి వచ్చారు. అయినా, ఏ ఒక్క సందర్భంలోనూ  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలకలేదు. వీడ్కోలు చెప్పలేదు. ప్రోటోకాల్ పాటించలేదు. మరోవంక గవర్నర్ విషయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు అదే విధంగా వుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఇటు గవర్నర్ తో అటు కేంద్ర ప్రభుత్వంలో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అన్నట్లుగా  కయ్యానికి కాలు దువ్వడమే కనిపిస్తోంది.  

అదలా ఉంటే ఇప్పుడు కేసీఆర్ కు పెద్ద చిక్కే వచ్చి పడింది. రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి ఎదురుపడకుండా అయితే తప్పించుకున్నారు, కానీ, రేపు జూలై 28 న చెన్నైలో ప్రధాని మోడీని, ఎదురుగా పేస్ చేయక తప్పేలా లేదు. విషయం ఏమంటే, జూలై 28న చెన్నైలో ఫిడె చెస్ ఒలింపియాడ్ పోటీలు ప్రారంభమవుతున్నాయి. ఈ పోటీలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నారు. ఇదే ప్రారంభ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందింది.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రత్యేకంగా ఒక ఎంపీని హైదరాబాద్ పంపి మరీ, కేసీఆర్ ను ఆహ్వానించారు. కేసీఆర్  ఒకే చెప్పేశారు. తప్పకుండ్ వస్తానని మాట కూడా ఇచ్చేశారు. అయితే, అప్పటికీ అ పోటీలను ఎవరు  ప్రారంభిస్తారనే విషయ  ఖరారు కాలేదో ఏమో కానీ, ఇప్పడు తాజాగా ఒలింపియాడ్ ను ప్రధాని మోడీ ప్రారంభిస్తున్నారని అధికారికంగా ప్రకటించడంతో,కేసీఆర్ మీమాంసలో పడ్డట్టు తెలుస్తోంది. స్టాలిన్ కోసం వెళ్ళా లా, మోడీ కోసం మానేయాలా ? అనే విషయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తర్జనభర్జన పడుతున్నారని అంటున్నారు.

By
en-us Political News

  
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.