చంద్రబాబు లేఖతో వరద ప్రభావిత ప్రాంతాలకు జగన్ పరుగు

Publish Date:Jul 26, 2022

Advertisement

ఏపీలో భారీ వర్షాలు, వరదలతో గోదావరి నది జిల్లాలకు జిల్లాలనే ముంచెత్తినప్పుడు నీరో చక్రవర్తిలా వ్యవహరించిన సీఎం జగన్.. డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇప్పుడు కోనసీమ జిల్లాకు పరుగులు పెట్టారు. పి.గన్నవరం, రాజోలు మండలాల్లో పర్యటించి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించడమే కాకుండా, వరద బాధితులు కొందరితో ముఖాముఖి మాట్లాడారు. అంతకు ముందు వరద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కొద్ది రోజుల క్రితం ఏరియల్ సర్వే పేరుతో సీఎం జగన్ గాల్లో తిరిగి గాల్లోనే వెనక్కి వెళ్లిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితమే వరద బాధిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి బాధితులకు భరోసా కల్పించి వచ్చారు.

కాగా.. గోదావరి నదికి వరదలు భారీగా వస్తాయని కేంద్ర జలసంఘం ముందే హెచ్చరించినా జగన్ రెడ్డి సర్కార్ పట్టించుకోలేదని చంద్రబాబు దుమ్మెత్తిపోశారు. గోదావరి నది పరీవాహ ప్రాంతంలోని, ముంపు ప్రాంతాల్లోని వేలాది మందిని వరదలకు వదిలేసి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద ప్రభావంపై ప్రజలను కనీసం అప్రమత్తం చేయలేదని, సురక్షిత ప్రాంతాలకు ముందు తరలించలేదని విమర్శించారు. వరద బాధితులకు భరోసా కల్పించలేదని, వారిని ఆదుకోవడంలో దారుణంగా విఫలమైందని చంద్రబాబు తూర్పారపట్టారు. గోదావరి వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు సరైన పరిహారం అందించి, ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన ఓ లేఖ రాశారు.

ఒక పక్కన వరద పీడిత ప్రాంతాల్లోని బాధితులు అన్నమో రామచంద్రా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుండడంతో పాటు.. వైసీపీ సర్కార్ పైన, అధికారులు, ప్రజాప్రతినిధుల పైన తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. మరో పక్కన బాధితులను వారి ప్రాంతాల్లోనే ముందే ప్రత్యక్షంగా పరామర్శించి, స్థానిక టీడీపీ నేతలు, శ్రుణులను సహాయక కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనాలని చంద్రబాబు పురమాయించారు. వరద నీటిలో, బురదలో కూడా చంద్రబాబు నడుచుకుంటూ వెళ్లి మరీ బాధితులకు భరోసా ఇచ్చి వచ్చారు.

దీంతో పొలిటికల్ మైలేజ్ చంద్రబాబుకే వచ్చేస్తోందని భావించారో, లేదా ప్రజల్లో ఇప్పటికే తమ ప్రభుత్వంపై, పాలనపై గూడుకట్టుకున్న వ్యతిరేకత మరింతగా పెరిగిపోతుందనే భయంతోనో సీఎం కోనసీమ జిల్లాలో పర్యటనకు వెళ్లారు. అయితే.. సీఎం వెళ్లింది వరద పీడిత ప్రాంతాలను ప్రత్యక్షంగా చూసేందుకు. కానీ వరద బీభత్సాన్ని, బురదతో నిండిన ప్రదేశాలను సీఎం కళ్లకు కనిపించకుండా అధికారులు, స్థానిక వైసీపీ నేతలు పరదాలు కట్టడం ఏంటని జనం ఎద్దేవా చేస్తున్నారు. నాయకుడంటే చంద్రబాబులా ఉండాలని, కష్టం వచ్చిన వెంటనే నేనున్నానంటూ తమ ముందుకు వచ్చినే వాడే అసలైన నేత అంటున్నారు.

కానీ.. సీఎం జగన్ లా దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్క మొరిగిన చందంగా ఇప్పుడు పర్యటించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. హుద్ హుద్, తిత్లీ తుపాన్లు వచ్చినప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు హుటాహుటిన బాధిత ప్రాంతాల్లో వాలిపోయి, అక్కడే తాత్కాలిక సెక్రటేరియట్ ఏర్పాటు చేసి మరీ సహాయక చర్యలను పరుగులు పెట్టించిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఒక పక్కన తామంతా వరదల్లో అష్ట కష్టాలు పడుతుంటే.. సీఎం జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో తమ పార్టీ నేతలతో వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో అనే, పొలిటికల్ మైలేజ్ ఎలా రాబట్టుకోవాలి, మళ్లీ అధికార పీటాన్ని ఏ విధంగా హస్తగతం చేసుకోవాలనే విషయాలపై ఫోకస్ పెట్టిన వైనాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.

By
en-us Political News

  
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.