నోట్లో యాసిడ్ పోసి.. వివ‌స్త్ర‌ను చేసి క‌ట్టేసి.. భార్య‌పై ఉన్న‌తోద్యోగి టార్చ‌ర్‌..

Publish Date:Jan 24, 2022

Advertisement

ఆమె చెప్పిందాని ప్ర‌కారం.. అత‌డు మ‌నిషి కాదు ఉన్మాది. భ‌ర్త‌ ముసుగులో ఉన్న రాక్ష‌సుడు. చేసేది నీటిపారుద‌ల శాఖ‌లో సూప‌రింటెండెంట్ ఇంజినీర్ (ఎస్‌ఈ). అంత పెద్ద జాబ్ ఉన్నా.. స‌మాజంలో హోదా ఉన్నా.. భార్య విష‌యంలో మాత్రం పోరంబోకులానే ప్ర‌వ‌ర్తించాడు. ఆస్తి కోసం ఆమెను నానాటార్చ‌ర్ పెట్టాడు. న‌ర‌కం చూపించాడు. వేధింపులు ప‌డ‌లేక‌.. మీడియా ముందుకు వ‌చ్చి గోడు వెళ్ల‌బోసుకుంది మాజీ బ్యాంక్ ఉద్యోగి అయిన‌ ఆ భార్య‌. భర్త నుంచి ప్రాణహాని ఉందని, తనను రక్షించాలని పోలీసులను వేడుకుంది.

నోట్లో యాసిడ్‌ పోసి హత్యాయత్నం చేశాడు. వివస్త్రను చేసి కొన్ని రోజుల పాటు ఓ గదిలో నిర్బంధించాడు! ఏసీబీ స్వాధీనం చేసుకొని, తిరిగిచ్చేసిన ఆస్తులను తన పేరిట బదిలీ చేయాలని వేధించాడు!.. ‘నాకు ఆస్తులొద్దు.. ఏమీ వద్దు ప్రాణాలతో ఉంటే చాలు’ అంటూ భ‌ర్త చేసిన టార్చ‌ర్ గురించి చెబుతోంది.  

బాధితురాలి పేరు బోడ పద్మజ (47). ఆమె భర్త కొర్ర ధర్మానాయక్‌. 1989లో వారి వివాహం జరిగింది. ధర్మానాయక్‌.. ప్రస్తుతం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటి పారుదల శాఖ ఎస్‌ఈగా ఉన్నారు. సైదాబాద్‌ సరస్వతీనగర్‌లో నివాసముంటున్నారు. 2008లో ఏఈగా పనిచేస్తున్న కాలంలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో సైదాబాద్‌లోని వీరి ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. పలు ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచే పద్మజపై ధర్మానాయక్‌ వేధింపులు మొదలయ్యాయి. ఆమె చేస్తున్న బ్యాంకు ఉద్యోగానికి కూడా రాజీనామా చేయించాడు. ఆస్తులను తన పేరిట బ‌దిలీ చేయాలని భర్త వేధింపులకు గురిచేస్తున్నారంటూ సైదాబాద్‌ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ధర్మానాయక్‌పై పోలీసులు 498ఏ కేసు నమోదు చేయగా, కుటుంబ పెద్దల జోక్యంతో రాజీ కుదిరింది. అయితే కొన్ని నెలల తర్వాత ఆమెకు భర్త నుంచి మళ్లీ వేధింపులు మొదలయ్యాయి. 

భ‌ర్త ధ‌ర్మానాయ‌క్ హింసలకు తాళలేక ఆమె ఈ నెల 2న ఇంట్లో నుంచి వెళ్లిపోయి కొత్తపేటలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. 4వ తేదీన ఆమె ఇంటికి  ధర్మానాయక్‌.. తల్లి లక్ష్మీబాయి, తమ్ముడు నాగరాజు, చిన్నమ్మ కాంత వ‌చ్చారు. పద్మజను బలవంతంగా కారులో ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఆమె, తన ఫోన్‌ నుంచి షీ టీం, సైదాబాద్‌ పోలీసులకు మేసేజ్‌ పెట్టింది. దీన్ని గమనించి ఆ ఫోన్‌ను ధ్వంసం చేశారు. 

ప‌ద్మ‌జ‌ను సరస్వతీనగర్‌లోని ఇంటికి తీసుకెళ్లి బలవంతంగా సూసైడ్‌ నోటు రాయించారు. నోట్లో యాసిడ్‌ పోశారు. పద్మజ గట్టిగా కేకలు వేయడంతో భ‌య‌ప‌డి ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆస్పత్రిలో ఆమెకు నాలుగు సర్జరీలు జరిగాయి. ఇంటి నుంచి బయటకు వస్తే వారి బండారం బయటపడుతుందనే భయంతో ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిన త‌ర్వాత‌ ఆమెను ఓ గదిలో వివస్త్రను చేసి బంధించారు. ఎలాగోలా అతికష్టం మీద ఆమె తప్పించుకొంది. ఇవ‌న్నీ ప‌ద్మ‌జ చేస్తున్న ఆరోప‌ణ‌లు.

మ‌రోవైపు, పద్మజ శనివారం ఇంట్లోంచి వెళ్లిపోవడంతో తన భార్య కనిపించడం లేదంటూ ధర్మనాయక్‌, సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పైగా 50 తులాల బంగారు నగలు, రూ.50 వేల నగదును ఆమె తీసుకువెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. 

పద్మజ, ఆమె తల్లి, తమ్ముడు, ఇతర కుటుంబసభ్యులతో ఉన్న గొడవల కారణంగా మానసికంగా ఇబ్బందులు పడుతోందని.. తనను అన్యాయంగా ఇరికిస్తున్నారని ఎస్‌ఈ ధర్మానాయక్ అంటున్నారు. ఆమె చేస్తున్న ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎలాంటి విచారణకైనా  సిద్ధమని చెప్పారు. 

By
en-us Political News

  
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.