ఏపీ అప్పులపై కేంద్రం కన్నెర్ర!.. బుగ్గన ఢిల్లీ మకాం అందుకేనా?

Publish Date:Jan 24, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంచుమించుగా చాలా రోజులకు ఢిల్లీలో ఉన్నారు. అఫ్కోర్స్, ఆయన ఇలా ఢిల్లీలో ఉండిపోవడం కొత్త విషయం కాదు. నిజానికి, ఆయన రాష్ట్రంలో కంటే ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటారని, అంటారు. ఎందుకుంటారు, ఏమి చేస్తారు అనేది, వేరే విషయం. అదలా ఉంచితే, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య పీఆర్సీ జగడం నడుస్తోంది. పీఆర్సీను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల సాధన సమితి ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సమీర్ శర్మకు సమ్మె నోటీసు ఇచ్చేందుకు నిర్ణయించింది. మరో వంక, ఉద్యోగులతో సంప్రదిపులు జరిపేందుకు ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు ఆహ్వానించింది. ఈ కమిటీలో మంత్రి బుగ్గన సభ్యులు. అదీ గాక ఆర్థిక అంశాలతో ముదిపడిన చర్చలలో ఆర్థిక మంత్రిగా ఆయన పాత్ర కీలకం. అయినా ఆయన ఢిల్లీ వదిలి రావడం లేదు. ఆవిషయాన్ని జేఎడీ అధికారులే చెప్పారు. పీఆర్సీ జీవోలు వెనెక్కి తీసుకునేవరకు చర్చలకు వచ్చేది లేదని  స్టీరింగ్ కమిటీ సభ్యులు తేల్చి చెప్పారు,అనుకోండి అది వేరే విషయం. అయినా ఇలాంటి కీలక సమయంలో ఆర్థిక మంత్రి ఎందుకు ఢిల్లీలో తిష్ట వేశారు? ఎందుకు ఢిల్లీ వదిలి రావడం లేదు?అనే విషయంలో ఆసక్తికర్ చర్చ జరుగుతోంది. 

ఇందుకు ఇంకా కారణాలు ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ తీరుపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేయడం ఒక ప్రధాన కారణం అంటున్నారు. అంతే కాదు ఇంత వరకు చూసినట్లు వ్యవహరిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు ఉపకరిస్తోందని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టా రాజ్యంగా చేస్తున్న అప్పుల కట్టడికీ కేంద్రం నడుబిగించిందని, అందుకే బుగ్గన ఢిల్లీలో తిష్ట వేసి కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచరం. 

అదలా ఉంటే,  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే సుజనా చౌదరి వంటి బీజేపీ జాతీయ నాయకులు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందనీ, చర్యలు తప్పవని చెపుతూనే వున్నారు.  ఈ నేపధ్యంలోనే విదేశీ ఆర్థిక సంస్థల నుంచి వచ్చే నిధుల వినియోగంపై కేంద్ర ఆర్థిక రాష్ట్రానికి షాక్ ఇచ్చింది. ఏఐఐబీ, ఎన్‌డీబీ నుంచి మంజూరైన రుణాలకు అడ్వాన్స్‌లు ఇప్పించాలని కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ  ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం రాసిన లేఖపై కేంద్ర శాఖలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఏఐఐబీ నుంచి అడ్వాన్స్‌ రూపంలో ఇచ్చిన రూ.500 కోట్లకు ముందు లెక్క చెప్పాలని కేంద్రం కోరింది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా నిధులు జమచేయకుండా, విదేశీ ఆర్థిక సంస్థలు నిధులు ఎలా ఇస్తామని కేంద్రం ప్రశ్నించింది. ఇప్పటికే తీసుకున్న అడ్వాన్స్‌ల వినియోగానికి లెక్కలు పంపాలని ఆదేశించింది. ప్రాజెక్ట్‌ ఇంప్లిమెంట్‌ అథారిటీకి ప్రభుత్వంలోని నిధులను బదిలీ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలిచ్చింది. మరో వంక కేంద్ర ఆర్థికశాఖ విధించిన షరతులతో దాదాపుగా రూ.8 వేల కోట్ల రుణం మంజూరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలను అమలు చేస్తేనే నిధులు విడుదల అవుతాయని డిపార్టుమెంట్ ఆఫ్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అడ్వాన్స్‌లు ఇవ్వడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది.

అలాగే, రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా చేసన అప్పులపై కూడా కేంద్రం దృష్టిని కేద్రీకరించింది, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అప్పులపైనే అధారాపడిన రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు.. అందుకే రాష్ట్ర ఆర్థిక మంత్రి ఢిల్లీ వదలడం లేదని, ఆర్థిక శాఖ వర్గాల సమాచారంగా ప్రచార మవుతోంది.అంతే కాదు కేంద్రం కన్నేసిందే నిజం అయితే, ఏపీ సరకార్ కు ఇక అప్పులు పుట్టడం కష్టమే అంటున్నారు. ఏమవుతుందో ... ఈ సంక్షోభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎలా బయట పడుతుందో చూడవలసిందే అంటున్నారు.
 

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.