Publish Date:Sep 11, 2025
బీఆర్ఎస్ లో అంతర్గత రాజకీయం సద్దుమణిగినట్లు కనిపించడం లేదు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కవిత ఎపిసోడ్ ఆమె సస్పెన్షన్ తో ముగిసిందని అంతా భావించినా పార్టీలో మాత్రం ఆ అలజడి ఇసుమంతైనా చల్లారలేదని అంటున్నారు. కాళేశ్వరం అవినీతి అంతా హరీష్ రావు, సంతోష్ లదే అంటూ కవిత చేసిన విమర్శల కారణంగానే ఆమెను సస్పెండ్ చేశారని అంటున్నా.. కవిత సస్పెన్షన్ తో ఆ ఆంశం ముగిసిందనడానికి వీలులేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఎందుకంటే కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై చేసిన అవినీతి విమర్శలను ఇప్పటి వరకూ బీఆర్ఎస్ అగ్రనేతలు ఎవరూ ఖండించలేదు. ఔను కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ కవిత ఆరోపణలను ఖండించలేదు. కేవలం ఆమెను సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. సస్పెన్షన్ వేటుతో కవిత ఏం వెనక్కు తగ్గలేదు. ఆరోపణలను వెనక్కు తీసుకోనూ లేదు. అయినా కూడా హరీష్ రావుకు మద్దతుగా కవిత ఆరోపణలను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మాట్లాడలేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే కేటీఆర్ రేవంత్ సర్కార్ పై విమర్శలతో కాలం గడిపేస్తున్నారే కానీ, సొంత పార్టీలో అతి కీలక నేతపై తన సోదరి కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలను ఖండించడం మాత్రం చేయలేదు. దీంతో సోషల్ మీడియాలో హరీష్ పై ఆరోపణల పరంపర రోజురోజుకూ పెచ్చరిల్లుతోంది. కవిత మద్దతుదారులే కాదు.. కాంగ్రెస్ వర్గాల నుంచి సైతం హరీష్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మరో వైపు విశ్లేషకులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హరీష్ రావు సుద్దపూస కాదని నమ్ముతుండటం వల్లనే బీఆర్ఎస్ ఆయనపై ఆరోపణలను ఖండించడం లేదా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు హరీష్ మద్దతు దారులలో కేటీఆర్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/why-ktr-did-not-condemn-kavitha-allegation-on-harish-rao-39-206008.html
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ పట్లే కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. ఇంత కాలం తన వెన్నంటి ఉండి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. పార్టీ అధినేతపైనా, అధినేత కుటుంబంపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిలాండి భువనేశ్వరిని సైతం దుర్భాషలాడారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.