సల్మాన్ ను ఖతం చేస్తామంటున్న బిష్ణోయ్.. అసలు కథేంటి?

Publish Date:Oct 21, 2024

Advertisement

పరిచయం అక్కర్లేని పేరు సల్మాన్ ఖాన్.. కండల వీరుడిగా అశేషమైన ప్రేక్షకాభిమానం కలగిన స్టార్ హీరో. దేశంలోనే కాదు ప్రపంచం నలుమూలలో ఆయనకు అభిమానులు ఉన్నారు. హీరోగా ఆయన స్థాయే వేరు. తెరపై విలన్లను భయభ్రాంతులకు గురి చేసి, వారిని చీల్చి చెండాని గెలిచే పాత్రలలో సల్మాన్ స్టైలే వేరు. ఎదురులేని హీరోగా ప్రేక్షకుల నీరాజనాలందుకునే సల్మాన్ ఖాన్ ఇప్పుడు భయంతో వణికి పోతున్నాడు. అడుగుతీసి అడుగు వేయాలంటే.. కట్టుదిట్టమైన భద్రత, సొంత బౌన్సర్లే కాకుండా ప్రభుత్వం తరఫున కూడా పదుల సంఖ్యలో సెక్యూరిటీ గార్డ్స్ , బయటకు వెడితే బుల్లెట్ ప్రూఫ్ కార్. వీటిలో ఏది లేకపోయానా సల్మాన్ బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఇంత భారీ సెక్యూరిటీ ఉన్నా కూడా సల్మాన్ లో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అసలు సల్మాన్ ఖాన్ ఇంతగా భయపడటానికి కారణమేంటి? పదే పదే సల్మాన్ ను ఖతం చేస్తామంటూ బెదరింపులు ఎందుకు వస్తున్నాయి? ఎవరు చేస్తున్నారు? అంటే మనం ముందుగా  గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ గురించి చెప్పుకోవాలి. అంత కంటే ముందు సల్మాన్ ఖాన్ నిర్దోషిగా బయటపడిన కృష్ణ జింకల వధ కేసు గురించి తెలుసుకోవాలి.  అలాగే తిరుగులేని స్టార్ గా ఎదిగిన సల్మాన్ ఖాన్ ప్రస్తానాన్నీ సింహావలోకనం చేసుకోవాలి. 

బాలీవుడ్‌లో  ఒకప్పటి స్టార్‌ రైటర్స్‌ సలీమ్‌ జావేద్‌లలో ఒకడైన సలీమ్‌ఖాన్‌ కుమారుడే సల్మాన్‌ఖాన్‌.  1988లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్ అదే ఏడాది  ‘బీవీ హోతో ఐసీ’ చిత్రంలో ఒక క్యారెక్టర్‌ పోషించడం ద్వారా నటుడిగా మారాడు. ఆ మరుసటి సంవత్సరమే ‘మైనే ప్యార్‌ కియా’ సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమాతో సల్మాన్ ఖాన్ స్టార్ హీరో అయిపోయారు. ఆ తరువాత  ‘హమ్‌ ఆప్‌కె హై కౌన్‌’ చిత్రంతో ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది.   వరుస చిత్రాలతో స్టార్ డమ్ పొందాడు. కండల వీరుడిగా గుర్తింపు పొంది. అశేష ప్రేక్షకాభిమానాన్ని చూరగొన్నాడు.  ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై సినిమా షూటింగ్ లో భాగంగా రాజస్థాన్ లో ఉన్న సమయంలో ఆయన అక్కడి అటవీ ప్రాంతంలో సరదాగా షూటింగ్ కు వెళ్లి  కృష్ణజింకను వేటాడారన్న అభియోగాలతో సల్మాన్ ఖాన్ పై 1998 అక్టోబర్‌ 2న  కేసు నమోదైంది.   అరెస్టై  20 రోజులు జైల్లో ఉన్నాడు. సల్మాన్‌ ఖాన్‌ కృష్ణజింకను వేటాడినట్టు ఆధారాలు లేని కారణంగా రాజస్థాన్‌ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. అక్కడితో ఆగని రాజస్థాన్‌ ప్రభుత్వం కేసును సుప్రీమ్‌ కోర్టుకు తీసుకెళ్లింది. 26 ఏళ్ళుగా సుప్రీమ్‌ కోర్టులో ఈ కేసు నడుస్తోంది. అయితే ఇక్కడే బిష్ణోయ్ రంగ ప్రవేశం చేశాడు. తమకు అత్యంత పవిత్రమైన కృష్ణ జింకను వేటాడి వధించిన కేసులో ఇన్నాళ్లైనా ఫలితం వెలువడకపోవడంతో  లారెన్స్‌ బిష్ణోయ్‌ రగిలిపోయాడు. సల్మాన్ ను ఖతం చేస్తామని ప్రతినపూనాడు. నిజానికి సల్మాన్‌ఖాన్‌పై కృష్ణ జింక వధ కేసు నమోదయ్యే సమయానికి లారెన్స్ బిష్ణోయ్ ఐదేళ్ల బాలుడు. అయితే ఇప్పుడు అతడో పెద్ద గ్యాంగ్ స్టర్  700 మంది సభ్యులతో తన నేర సామ్రాజ్యాన్ని దేశ వ్యాప్తంగా విస్తరించాడు. ప్రధానంగా ఐదారు రాష్ట్రాలలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చాలా చాలా పవర్ ఫుల్.  సల్మాన్‌ఖాన్‌ని చంపడమే తన ధ్యేయమని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సల్మాన్‌కి అత్యంత సన్నిహితుడైన మంత్రి బాబా సిద్ధిఖీని చంపడం ద్వారా తను ఏమిటో నిరూపించుకోవాలనుకున్నాడు లారెన్స్ బిష్ణోయ్‌. నిరూపించుకున్నాడు కూడా.   ప్రస్తుతం సబర్మతి జైలులో ఉన్న బిష్ణోయ్‌.. అక్కడి నుంచే తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ ను హత్య చేస్తామంటూ హెచ్చరికలు పంపుతున్నాడు. అందుకోసం రెక్కీలు కూడా జరుగుతున్నాయి. గత ఏప్రిల్ లో సల్మాన్ ఖాన్ నివాసం సమీపంలో ఇద్దరు వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. సల్మాన్ ఖాన్ హత్యకు ఈ కాల్పుల ఘటన ఒక రెక్కీ అని పోలీసులు భావిస్తున్నారు. సల్మాన్ నివాసం వద్ద కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు పలువురిని అరెస్టు చేశారు కూడా.  సల్మాన్ కు సన్నిహితుడైన  మంత్రి సిద్దిఖీ హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్, అతడి సోదరుడు అన్ మోల్ సహా మరో  ముగ్గురు కీలక నిందితులు. సల్మాన్ ను తాము క్షమించి వదిలేయాలంటే బిష్ణోయ్ ఆలయానికి వచ్చి సల్మాన్ క్షమాపణ చెప్పాలన్నది వారి డిమాండ్. లేదా.. సల్మాన్ ఐదు కోట్లు చెల్లస్తే చంపకుండా వదిలేస్తామన్నది బిష్ణోయ్ చేసిన ప్రపోజల్. మరి సల్మాన్ ఏం చేస్తాడన్నది చూడాల్సి ఉంది.  

By
en-us Political News

  
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.
పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది.
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు, కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి కూడా భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక పంచయతీలో స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.
నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు.
లోకేష్ త‌ల్లిచాటు బిడ్డ‌గా ఎదిగారు. ఆయ‌న ఎదిగిన విధం అత్యంత ఉదాత్తం. సంస్కార‌వంతం. ఎందుకంటే తండ్రి ప్రజా నాయకుడిగా చాలా చాలా బిజీ. దీంతో లోకేష్ ని అన్నీ తానై పెంచిన జిజియా బాయి భువ‌నేశ్వ‌రి. లోకేష్ లో ఒక మాన‌వ‌త్వం, మంచి, మ‌ర్యాద, పెద్దా, చిన్నల ప‌ట్ల చూపించాల్సిన క‌రుణ- జాలి- ద‌య- ప్రేమ‌- బాధ్య‌త‌ వంటి సుగుణాల‌ు ప్రోది అయ్యేలా పెంచి పెద్ద చేశారు భువ‌నేశ్వ‌రి అని చెప్ప‌డానికి ఎన్నో నిద‌ర్శ‌నాలు.
తాజాగా ఆయన కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదంగా మారి పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చాయి.
కాంగ్రెస్, బీజేపీల‌క‌న్నా కూడా ఈ క‌విత‌తోనే ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది. పరువుపోతోందన్న మాట బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తోంది.
హరీష్ రావుపై తాన చేసిన కామెంట్లకు కౌంటర్లిచ్చే నాయకులను కవిత టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. హరీష్ కు మద్దతుగా నోరెత్తిన నేతలపై కవిత విమర్శలతో విరుచుకుపడటమే కాకుండా, వారి అవినీతి బాగోతాలు కూడా బయటపెడుతూ వారి నోళ్లు మూయించాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం అంటే.. కేటీఆర్ కు కష్టకాలం మొదలయ్యిందనే చెప్పాలంటున్నారు పరిశీలకులు. ఇప్ప‌టికే వ‌రుస ఓట‌ముల‌తో ఉక్కిరిబిక్కిరై ఉన్న కేటీఆర్ ఇప్పుడు ఈ కేసును ఎలా హ్యాండిల్ చేస్తార‌న్నది పార్టీ శ్రేణుల్లో ఆసక్తి, ఉత్కంఠ రేపుతోంది.
సుమారు రెండు దశాబ్దాలుగా.. భద్రతా బలగాలకు చిక్కకుండా.. అరణ్యంలో అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నాడు. దాదాపు పట్టుబడ్డాడు అనుకున్న ప్రతిసారీ.. అదృశ్యమయ్యాడు. అలాంటి హిడ్మా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోవడమే అందరికీ ఆశ్చర్యంగా ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.