బీఆర్ఎస్ లోగోలో కేసీఆర్ ఫొటో మాయం.. సంకేతమదేనా?

Publish Date:Oct 21, 2024

Advertisement

కేసీఆర్... ఈ మాట వినగానే నిన్నమొన్నటి వరకూ అందరి నోటా  మాటల మాంత్రికుడు, రాజకీయ చాక్యుడు.. ప్రత్యర్థుల కంటే రెండడుగుల ముందే  ఉంటారు. వారు వ్యూహ రచన చేయడానికి ముందే వాటికి విరుగుడు వ్యాహాలను అమలు చేసి వారిని నిరుత్తరులను చేస్తారు. అన్న మాటలే వినిపించేవి. అయితే ఇదంతా బీఆర్ఎస్ ఎన్నికలలో ఓడిపోయి ప్రతిపక్షానికే పరిమితం కావడానికి ముందు వరకూ మాత్రమే. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి  కూడా  కేసీఆర్ రాజకీయాలను తట్టుకోవడం కష్టమని  ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరించేసిన పరిస్థితి.

అయితే ఒక్క ఓటమి.. ఔను ఒకే ఒక్క ఓటమి కేసీఆర్ ను నిర్వీర్యుడిగా మార్చేసింది. ఆయనలో వ్యూహ శూన్యత నెలకొని ఉందా అన్నట్లుగా ఆయన క్రియా శూన్యుడిగా మారిపోయారు. ఆయన ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాల సంగతి పెడితే అసలాయనకు రాజకీయాలలో ఓనమాలు తెలుసునా అన్న అనుమానాలు బీఆర్ఎస్ లోనే వ్యక్తం అవుతున్నారు.   తెలంగాణలో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి పది నెలలు కావస్తున్నది. ఈ పది నెలల కాలంలోనూ కేసీఆర్ ప్రజలలోకి వచ్చి వారికి కనిపించిన సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.  అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే సాహసం కూడా చేయలేదు. ఏదో మొక్కుబడికి అన్నట్లు ఒక్క రోజు మాత్రం అదీ రేవంత్ సర్కార్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు హాజరయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన రాజకీయ సన్యాసం చేసేశారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాలే ఆయన తీరు ఉంది. గత పది నెలలుగా ఆయన ఒక విధంగా వానప్రస్థంలో ఉన్నట్లుగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఆయన పథకాలైన రుణమాఫీ, రైతు భరోసా వంటి వాటిలో రేవంత్ సర్కార్ వైఫల్యాలపై ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. పార్టీ వ్యవహారాలన్నీ ఆయన కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులే చక్కబెడుతున్నారు. మళ్లీ వీళ్లద్దరి మధ్యా ఆధిపత్య పోరు సాగుతోంది. అది వేరే సంగతి.

ఇప్పటి వరకూ ఇప్పుడు కాకపోతే మరోసారి. ఇవ్వాళ కాకపోతే రేపు కేసీఆర్ మళ్లీ ప్రజలలోకి వస్తారు. బీఆర్ఎస్ కు పూర్వ వైభవం తీసుకువస్తారు అని బీఆర్ఎస్ శ్రేణులూ, కేసీఆర్ అభిమానులూ నమ్మకంగా ఉన్నారు.  కానీ హైడ్రా వివాదం సమయంలో కూడా కేసీఆర్ ప్రజలకు ముఖం చూపకపోవడంతో  వారిలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక పరిశీలకులు అయితే  ఆయన రాజకీయంగా అస్త్రసన్యాసం చేసినట్లేని  విశ్లేషిస్తున్నారు.   

ఇందుకు ఉదాహరణగా కేటీఆర్ మూసీపై మీడియా సమావేశంలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను చూపుతున్నారు. ఆ సందర్భంగా బీఆర్ఎస్ లోగోలో కేసీఆర్ ఫొటోకు బదులుగా కేటీఆర్ ఫొటో ఉండటాన్ని చూపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ పూర్తిగా టేకోవర్ చేసేకుకున్నారనీ, కేసీఆర్ ఇక రాజకీయాలలో మళ్లీ చురుగ్గా పాల్గొనే పరిస్థితి కనిపించడం లేదనీ అంటున్నారు. అలాగే తెలంగాణ భవన్ లో కూడా పార్టీ లోగోలో కేసీఆర్ ఫొటో స్థానంలో కేటీఆర్ ఫొటో కనిపిస్తోంది.  మొత్తానికి కేసీఆర్ మౌనం, కేటీఆర్ దూకుడు చూస్తుంటే నేడో, రేపో అధికారికంగా పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ అన్న ప్రకటన వెలువడినా ఆశ్చర్యపోవలసిన పని లేదంటున్నారు. అదే సమయంలో హరీష్, ఆయన వర్గం ఏం చేస్తారన్నదానిపై కూడా పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ కేటీఆర్ అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టకపోవడానికి హరీష్ వర్గం అభ్యంతరాలే కారణమని అంటున్నారు. పార్టీ శాసనసభా పక్ష నేత ఎన్నిక విషయంలో కూడా కేటీఆర్ కు సంపూర్ణ మద్దతు లేకపోవడం వల్లే ఇప్పటికీ కేసీఆర్ శాసనసభాపక్ష నేతగా కొనసాగుతున్నారని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే బీఆర్ఎస్ లో చీలిక అనివార్యం అనే అనిపిస్తోందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. 

By
en-us Political News

  
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.
పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది.
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు, కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి కూడా భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక పంచయతీలో స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.
నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు.
లోకేష్ త‌ల్లిచాటు బిడ్డ‌గా ఎదిగారు. ఆయ‌న ఎదిగిన విధం అత్యంత ఉదాత్తం. సంస్కార‌వంతం. ఎందుకంటే తండ్రి ప్రజా నాయకుడిగా చాలా చాలా బిజీ. దీంతో లోకేష్ ని అన్నీ తానై పెంచిన జిజియా బాయి భువ‌నేశ్వ‌రి. లోకేష్ లో ఒక మాన‌వ‌త్వం, మంచి, మ‌ర్యాద, పెద్దా, చిన్నల ప‌ట్ల చూపించాల్సిన క‌రుణ- జాలి- ద‌య- ప్రేమ‌- బాధ్య‌త‌ వంటి సుగుణాల‌ు ప్రోది అయ్యేలా పెంచి పెద్ద చేశారు భువ‌నేశ్వ‌రి అని చెప్ప‌డానికి ఎన్నో నిద‌ర్శ‌నాలు.
తాజాగా ఆయన కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదంగా మారి పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చాయి.
కాంగ్రెస్, బీజేపీల‌క‌న్నా కూడా ఈ క‌విత‌తోనే ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది. పరువుపోతోందన్న మాట బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తోంది.
హరీష్ రావుపై తాన చేసిన కామెంట్లకు కౌంటర్లిచ్చే నాయకులను కవిత టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. హరీష్ కు మద్దతుగా నోరెత్తిన నేతలపై కవిత విమర్శలతో విరుచుకుపడటమే కాకుండా, వారి అవినీతి బాగోతాలు కూడా బయటపెడుతూ వారి నోళ్లు మూయించాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం అంటే.. కేటీఆర్ కు కష్టకాలం మొదలయ్యిందనే చెప్పాలంటున్నారు పరిశీలకులు. ఇప్ప‌టికే వ‌రుస ఓట‌ముల‌తో ఉక్కిరిబిక్కిరై ఉన్న కేటీఆర్ ఇప్పుడు ఈ కేసును ఎలా హ్యాండిల్ చేస్తార‌న్నది పార్టీ శ్రేణుల్లో ఆసక్తి, ఉత్కంఠ రేపుతోంది.
సుమారు రెండు దశాబ్దాలుగా.. భద్రతా బలగాలకు చిక్కకుండా.. అరణ్యంలో అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నాడు. దాదాపు పట్టుబడ్డాడు అనుకున్న ప్రతిసారీ.. అదృశ్యమయ్యాడు. అలాంటి హిడ్మా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోవడమే అందరికీ ఆశ్చర్యంగా ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.