ఇంతకీ మోడీ షాలకు మిత్రుడు చంద్రబాబా.. జగనా?

Publish Date:Mar 6, 2025

Advertisement

వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో  చివర కూర్చున్నా ఫరవాలేదన్నది నానుడి. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ తీరు అందుకు భిన్నంగా ఉంది.   కేంద్రంలో  బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబునాయకత్వంలో  అధికారంలో ఉన్నది కూడా ఎన్డీయే సర్కారే.  అయినా మోడీ మద్దతు, సహకారం ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్ కే అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.   

వైఎస్ వివేకానండ రెడ్డి హత్య కేసులో ప్రధాన, ప్రత్యక్ష సాక్షి వాచ్ మ్యాన్ రంగన్న  బుధవారం (మార్చి 5) రాత్రి కడప రిమ్స్ హాస్పిటల్లో మృతిచెందారు.  రంగన్న మృతిపై తనకు అనుమానాలున్నాయంటూ ఆయన భార్య పిర్యాదు చేయడంతో పులివెందుల పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  వివేకా హత్య కేసులో ఇప్పటికే పలువురు సాక్షులు మృతి చెందారు. ఇప్పుడు  ప్రత్యక్ష సాక్షి రంగన్న కూడా మృతి చెందారు. గత 5 ఏళ్ళుగా ఈ కేసు విచారణ సాగుతూనే ఉంది. కానీ నేటికీ వివేకాని ఎవరు హత్య చేశారో? ఆయన హత్య వెనుక ఎవరెవరున్నారో సీబీఐ నిర్ధారించి కోర్టులో నిరూపించలేకపోయింది.  పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే బలమైన సాక్ష్యాధారాలు లేనందున ఈ కేసుని కొట్టివేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పరిశీలకులు అంటున్నారు. గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్నారు కనుక కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని తెలుగుదేశం ఆరోపించింది. ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే అప్పుడు పరిస్థితులు ఉన్నాయి.

సీబీఐ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కనీసం తాకలేకపోయింది. అవినాష్ రెడ్డిపై అరెస్టు వారెంట్ ఉన్నా అప్పటి జగన్ ప్రభుత్వం ఆయన అరెస్టు కాకుండా అడ్డుకోగలిగింది. దీంతో సీబీఐ చేసేదేం లేక అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండానే అరెస్టు చూపించి స్టేషన్ బెయిలు ఇచ్చేసి వదిలేసింది. అప్పట్లో కేంద్రంలోని మోడీ సర్కార్ అండతో జగన్ ఇవన్నీ చేయించగలిగారు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే అయినా కేసు ముందుకు సాగడం లేదు. కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత వివేకా కుమార్తె సునీత చంద్రబాబును కలిసి కేసు విచారణ వేగవంతం చేయాలని కోరారు. అయినా పరిస్థితిలో ఇసుమంతైనా మార్పు లేదు. దీనిని బట్టి చూస్తుంటే కేంద్రం పెద్దల వద్ద ఇంకా జగన్ మాటే చెల్లుబాటు అవుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరిశీలకులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చే స్తున్నారు.

అసలింతకీ మోడీ షా చంద్రబాబు వైపా, జగన్ వైపా ఎవరి వైపు ఉన్నారన్న సందేహిలు సామాన్యులలో కూడా వ్యక్తం అవుతున్నాయి. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండి, కనీసం విపక్ష హోదా కూడా దక్కకపోయినా జగన్మోహన్ రెడ్డి కేంద్రం వద్ద తన పలుకుబడి ఉపయోగించి వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ దూకుడుగా వ్యవహరించకుండా నిలువరించగలుగుతున్నారనీ, అదే సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాత్రం వివేకా సహా జగన్ కేసుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి దర్యాప్తు సంస్థలు చురుకుగా వ్యవహరించేలా చేయడంలో విఫలమౌతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.