Publish Date:Mar 17, 2020
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయించడంలో ఎవరి హస్తం ఉంది అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.. అధికారంలో లేకపోయినా చంద్రబాబు ఇంత లాబీ చేయించే పరిస్థితిలో ఉన్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. రాత్రికి రాత్రే ఎన్నికల కమిషన్ ఇంత తీవ్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవడం కూడా మరింత చర్చనీయాంశం అవుతోంది.....ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థలు వాయిదా అంశం అన్ని రాజకీయ పార్టీలతో పాటు అధికార వర్గాలలో కూడా చర్చగా మారింది...
ఇప్పటి వరకు జరిగిన పరిణామాలలో ఎన్నికల కమిషనర్ ని మ్మగడ్డను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మేనేజ్ చేసారనే అభిప్రాయాలు బాగా వ్యక్తం అవుతున్నాయి...సీఎం జగన్ నుంచి మంత్రులు వైసీపీ నేతల వరకు ఇదే విమర్శ.......చంద్రబాబు ఎన్నికలను ఆపించే పరిస్థితిలో ఉన్నారంటే నిజంగా ఆయనకు ఇంకా బోల్డంత క్రేజ్ ఉన్నట్టే అనుకోవాలి.....సామిజిక కోణం పక్కన పెడితే ఒక కీలక మైన ఎన్నికల వ్యవస్థను చంద్రబాబు మేనేజ్ చేసి ఎన్నికలు వాయిదా వేయించే పరిస్థితి ఉన్నట్టయితే భవిష్య్ త్ లో జరిగే పరిణామాలు ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి......
స్థానిక సంస్థల వాయిదా వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందనే అభిప్రాయాలు కూడా ప్రధానంగా వ్యక్తం అవుతున్నాయి...బిజెపి శ్రేణుల పై దాడులు జరగడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది....ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి..ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు కలిసినా పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితి లేదు...దీంతో ఈ రెండు పార్టీలు సరైన విజయం పక్కన పెడితే కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపించకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది....దీంతో రాష్ట్రంలో జరిగిని హింసాత్మక సంఘటనలు కూడా బిజెపి సీరియస్ గా తీసుకుంది..సొంత పార్టీ నాయకులపైనే దాడులు జరగడం ఎన్నికల్లో సరైన ఫలితాలు రాకపోతే నష్టం జరగడం వీటిని ద్రుష్టిలో పెట్టుకుని కేంద్రంతో మాట్లాడి బిజెపి నేతలు ఎన్నికలు వాయిదా వేయించారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి....
దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం కూడా తీవ్రంగా ఉండడం కూడా ఒక కారణం అయింది..వై సీపీ నేతల విమర్శల ప్రకారం చంద్రబాబు వాయిదా వెనుక ఉండే పరిస్థితి పెద్దగా కనిపించడం లేదు....ఒక వేళ నిజంగా ఆయన హస్తం ఉంటే బాబు పవర లో లేకపోయినా పవర్ ఫుల్ గా ఉన్నట్టే లెక్క....వైసీపీ అండ్ ప్రభుత్వం బాబుపై విమర్శలు చేసి ఆయన్ని అనవసరంగా ఇంకా పెద్ద హీరోను చేస్తోందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/who-is-behind-postpone-of-local-body-elections-25-95726.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.