Publish Date:Jan 27, 2026
తెలంగాణలో సంచలనం సృష్టించిన, సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అత్యంత కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో రాధాకిషన్ రావు విచారణలో బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ నివాసం నుంచి చేతిరాతతో కూడిన చిట్టీలు వచ్చేవనీ, ఆ చిట్టీలలోని ఫోన్ నంబర్లను తాము ట్యాప్ చేసేవారమనీ వెల్లడించారు. దీంతో ఇప్పుడు ఆ చేతి రాత ఎవరిది అన్న చర్చకు తెరలేచింది.
అప్పటి సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన సంతోష్ రావు చేతిరాతా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిట్ కూడా ఇప్పుడు ఆయనను కూడా విచారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రావును నిఘా విభాగం స్పెషల్ బ్రాంచ్ఇన్ ఛార్జ్ గా నియమించడంపైనా సిట్ ఆరా తీస్తోందంటున్నారు. ప్రత్యేకించి ఆయనకే ఈ బాధ్యతలు ఇవ్వడమేంటన్న దిశగా కూడా సిట్ దర్యాప్తు కొనసాగుతోందంటున్నారు. అత్యంత కీలకమైన పదవిని ఒక రిటైర్డ్ అధికారికి కట్టబెట్టడంలోని మతలబుపై సిట్ ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక పోతే చిట్టీలలో చేతిరాత విషయం నిగ్గు తేల్చేందుకు బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల ఎదుట మంగళవారం (జనవరి 27) విచారణకు హాజరు కానున్నారు. ఈ మేరకు సంతోషరావుకు నోటీసులు జారీ అయ్యాయి..మంగళవారం (జనవరి 27) మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కు ఇటీవల సజ్జనార్ ని చీఫ్ గా నియమించిన సంగతి తెలిసిందే. సజ్జనార్ నియామకంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఐపీఎస్ ని సిట్ ఇంచార్జ్ ని చేయడమేంటని ప్రవీణ్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సిట్ ఆయనకు కూడా నోటీసులు ఇచ్చింది. దీంతో ప్రవీణ్ యూటర్న్ తీస్కున్నారు.
అదలా ఉంటేఇటు మాజీ మంత్రి హరీష్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను కూడా ఇటీవల సిట్ విచారించింది. ఇక ఇపుడు సంతోష్ రావు వంతు వచ్చిందంటున్నారు. అదలా ఉంచితే.. బీఆర్ఎస్ కూడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని అనడం లేదు. ఫోన్ ట్యాపింగ్ అన్నది సర్వసాధారణమనీ, అదేం పెద్ద నేరం కాదనీ అంటున్నది. కేటీఆర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఫోన్ ట్యాపింగ్ అన్నది పోలీస్ డిపార్ట్ మెంట్ విధి నిర్వహణలో ఒక భాగం అన్నారు. ఇక ప్రస్తుతానికి వస్తే.. చేతిరాత చిట్టీల వెనుక ఉన్నది సంతోషేనా? అసలు దీని వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి? అన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/who-is-behind-han-written-slips-25-213041.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.