స్వచ్ఛందంగా తెల్లకార్డులు తిరిగి ఇచ్చేస్తారా?
Publish Date:Jul 28, 2012
Advertisement
బోగస్ తెల్లకార్డులున్న వారందరూ స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేయాలని రాష్ట్రపౌరసరఫరాలశాఖ మంత్రి డి.శ్రీధర్బాబు కోరారు. ఆగస్టు పదోతేదీలోపు ఈ కార్డులు అందజేయాలని ఆయన గడువు ఇచ్చారు. తెలిసో తెలియకో కార్డులుంటే అప్పజెప్పేయాలి అని మంత్రి పేర్కొనటాన్ని రాష్ట్రంలోని పలువురు ఎగతాళి చేస్తున్నారు. ఇదేమిటి అలా అడిగేస్తే ఇచ్చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కొందరు ధనవంతులు కూడా వీఆర్వోలను మెప్పించి మరీ ఈ కార్డులను పొందారు. అలానే ఆరోగ్య అవసరాలు తీర్చుకునేందుకు ధనవంతులు ఎక్కువ మంది తెల్లకార్డులు పొందారు.
రెవెన్యూ శాఖలోని సిబ్బందికి తెలియకుండా ఈ కార్డులు విడుదలవ్వలేదు కాబట్టి వారిని హెచ్చరిస్తే బాగుంటుంది కానీ, బోగస్కార్డుదారులనే స్వచ్ఛందంగా అప్పగించమనటం ఎంతవరకూ కరెక్టు అని ప్రశ్నిస్తున్నారు. అలాకార్డులు అప్పగించకుంటే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. ఏ చర్య తీసుకోవటానికి అవకాశముందో ముందుగానే చూసుకుని చెప్పాల్సిన మంత్రి ఇలా కామన్గా ప్రకటిస్తే బోగస్కార్డుదారులు బయటపడతారా? అసలు లొసుగున్న రెవెన్యూశాఖను హెచ్చరిస్తే ఈ కార్డులు ఎక్కడ ఉన్నాయో వివరాలన్న దొరికేవి.
ఇటీవల ప్రతీరేషను దుకాణంలోనూ తెల్లకార్డుదారుల ప్రూఫ్లు తీసుకున్నారు. అలా ప్రూఫ్లు సమర్పించకుండా కార్డులను కొనసాగించేవారిపై చర్య తీసుకుంటామని ప్రకటిస్తే బోగస్కార్డుల వివరాలు సేకరించటం ఏమంత కష్టం కాబోదు. ఈ విషయాన్ని మంత్రి గుర్తించి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్వచ్ఛందంగా కార్డులు సమర్పించకుంటే వాటిని రద్దు చేస్తామన్నా బాగుండేదని మంత్రికి పలువురు సూచిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/white-ration-card-holders-24-16012.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





