టిఆర్ఎస్ కు మంత్రిపదవుల ఎర?
Publish Date:Jul 28, 2012
Advertisement
కేంద్రక్యాబినెట్లో రెండు మంత్రిపదవులు తెలంగాణా రాష్ట్ర సమితి(టిఆర్ఎస్)కు కేటాయించాలని సోనియా యోచిస్తున్నట్లు తెలిసింది. టి.ఆర్.ఎస్.ను బుట్టలో వేసుకునేందుకే ఇటువంటి ఆఫర్ ఆ పార్టీకి ఇస్తున్నట్లు తెలిసింది అయితే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఉండబోదని ప్రకటించేందుకు కేంద్రం సన్నద్ధమవటంతో టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేరేందుకు సముఖత వ్యక్తం చేయకపోవచ్చని రాజకీయపరిశీలకులు తేల్చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ముందుగా సమాచారాన్ని లీక్ చేసినా ఇంతవరకూ తన వైఖరిని ప్రకటించని టిఆర్ఎస్ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణా లేదంటే ఊరుకోదని జగమెరిగిన సత్యం. అసలు ప్రత్యేకతెలంగాణా అంశమే లేకుంటే టిఆర్ఎస్ లేదు. అందువల్ల పార్టీ దెబ్బతింటుందని ఆ పదవులను త్యాగం చేసేందుకు సిద్ధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ మీడియాకు దూరంగా ఉంటున్న టిఆర్ఎస్ అధినేత కెసీఆర్ ఇక తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం త్వరలో తెలంగాణా ప్రకటించేస్తుందని ఆశలు పెట్టుకున్న ఆయన ఆందోళనలు సైతం చేయొద్దని ప్రకటించారు. కేంద్రం నిర్ణయం మారుతున్నందువల్ల అందువల్ల ఆయన తిరిగి ఉద్యమబాట పట్టే అవకాశం ఉంది. ఏదేమైనా కేంద్రహోంశాఖ రాష్ట్రపతికి ఇచ్చే నివేదిక టిఆర్ఎస్తో తెగతెంపుల దాకా రావచ్చనేది పరిశీలకుల అభిప్రాయం. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెరపైనే చూడాలి!
http://www.teluguone.com/news/content/trs-telangana-24-16015.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





