యురేనియం తవ్వకాలతో సాగర్కు ముప్పు ?
Publish Date:Jul 28, 2012
Advertisement
నల్గొండ జిల్లా దేవరకొండలోని చందం పేట అడవుల్లో మళ్లీ యురేనియం కోసం తవ్వకాలను జరపటం స్థానికులను భయ బ్రాంతులను చేస్తుంది. ఇంతకు ముందు రెండేళ్లక్రితం గిరిజనుల ఉద్యమం చేపట్టడం ద్వారా కొంతకాలం తాత్కాలికంగా ఆపిన సంస్ధ మళ్లీ నమూనా సేకరణను యుసిఐఎల్ చేపట్టడం గిరిజనులను కలత పెట్టింస్తుంది. మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో సాగర్రిజర్వాయరుకు సమీపంలో వేలాది ఎకరాల్లో యురేనియం నిల్వలున్నట్లు కనుగొన్నయసిఐఎల్ సంవత్సరం క్రితం మహబూబ్నగర్ జిల్లా తుమ్మలచెరువులో నమూనాలు సేకరించే ప్రయత్నం చేయగావారి బోరు యంత్రాలను స్ధానికులు అడ్డుకున్నారు. తాజాగా 15 రోజుల నుండి నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని చిత్రాలగుట్టపై క్యాంపు ఏర్పాటు చేశారు. ఇప్పుడు బోరు బావులనుండి శాంపుల్స్ సేకరించి పరిశోధన నిమిత్తం ముంబాయి పంపారని నిర్వాహకులు చెప్పారు. గతంలో ప్రజలు, పర్వావణ శాస్త్రవేత్తలు, స్వచ్చంద సంస్ధల ఆందోళనతో వెనక్కి తగ్గిన తవ్వకాలు మళ్లీ జోరందుకున్నాయి. పెద్దగట్టు ప్రాంతంలో యుసిఐఎల్ వారు వేసిన బోరునుండి నీటిని తాగిన మేకలు, బర్రెలు మృత్యువాల పడ్డాయి.సాగర్ నిర్వాసితుల పిఏ పల్లి , చందం పేటల వారు ఇక్కడ స్థిరపడ్డారు. ఇప్పుడు మళ్లీ ఈ ప్రాంతంలోని తవ్వకాలు చేపట్టటంతో నిర్వాసితులకు నీడలేకుండా పోతుంది.
2007 సంవత్సరంలో తవ్వకాలకు నిరసనగా పర్యావరణ శాస్త్రజ్ఞులు, స్వచ్చంధ సంస్థలు చేపట్టిన పాదయాత్ర వల్ల సాగర్నీటిని కలుషితం కాకుండా, జీవనవైవిధ్యం దెబ్బతినకుండా చూశారు. వారు తమ సహాయాన్ని ఇప్పుడు కూడా ఇవ్వవలసిందిగా స్ధానికులు కోరుకుంటున్నారు. ఈ ప్రాంతం లో యురేనియం ఫ్యాక్టరీ నెలకొల్పితే ప్రజలకు హానిక కలుగుతుందని, అలాగే సాగర్జలలు కలుషితం అవుతాయని స్వచ్చంధ సంస్థలు చెబుతున్నాయి. గిరిజనులను ప్రతిచోటా ఇదే విధంగా దోచుకుంటున్నారని, అటవీ సంపద తరిగి పోతుందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/nagarjuna-sagar-24-16011.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





