కొత్తదనాన్నే అందరూ కోరుకుంటారు. సైకిలయినా, కారయినా సరే. పిల్లడికి కొత్త బ్యాగ్ ఇష్టం, పై చదువు లకు వెళ్లే కుర్రాడికి మంచి కాలేజీ కొత్త వాతావరణం కోరుకుంటాడు. ఎన్నాళ్లుబోయినా ఒకే ఇంట్లో ఉం డాలా అని బోరింగ్ గా అనుకునేవారు కొత్త ఇల్లు కొనడానికి వేటలో ఉంటారు. పాత తరం ఆలోచనలు వది లి అందరూ వెళ్లే ఈ తరం దారిలోకి వెళ్లాలని చాలామంది ఉన్నదారిని వదులుకోను యిష్టపడ తారు. ఇపుడు కాంగ్రెస్ నుంచి చాలామంది మళ్లీ టీఆర్ ఎస్ కారు వెళుతోన్న మార్గాన్ని ఎంచుకుం టున్నారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన టీఆర్ ఎస్ పార్టీకి బీఆర్ ఎస్ అనే కొత్త పేరు పెట్టుకున్నారు. దాంతోనే ఇక రాజకీయాల్లో దూసుకుపోవాలని ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే మంత్రులను, ఎమ్మెల్యేలను, పార్టీ వీరాభిమానులను సమాయత్తం చేశారు. మనం దేశ రాజకీయాల్లోనూ హల్చల్ చేయాలన్న ప్రబోధ చేసి ఉరకలు పెట్టిస్తున్నారు. టీఆర్ ఎస్గా కంటే బీఆర్ ఎస్గానే ఉత్తరాది ప్రాంతా ల్లోకి వెళ్లడానికి వీలవు తుందని కేసీఆర్ నమ్ముతున్నారు. పార్టీ పేరు, గుర్తుకీ ఎన్నికల కమిషన్ ఓకే అనేస్తే ఇక మును గోడు ఉప ఎన్నికల నుంచే వీరావేశంలో దూసుకుపోవడానికి సిద్ధపడుతున్నారు. కేసీఆర్ తన పార్టీ మార్చి దేశంలో తన పార్టీ ప్రభావాన్ని చూపడానికి యువతను కూడా ఎంతో ఆకట్టు కుంటున్నారు. ఆయన వాడి వేడి గమ నించి కాంగ్రెస్లోంచి కొందరు పార్టీ ఫిరాయించేందుకు సిద్ధ పడ్డారు. చిత్రమేమంటే వీరంతా గతంలో టీ ఆర్ ఎస్ నుంచీ ఇటు వచ్చినవారే!
పాతతరం పాలనలోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ ని యువతతో నింపి ముందుగు వేగంగా వేయించాలని తెలం గాణా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యువతను ఎంతో ఆకట్టుకునేలా ప్రసంగాలు చేసి చాల మందిని పార్టీలోకి తీసుకురాగలిగారు. టీఆర్ ఎస్ నాయకులు, అధినేత వ్యవహరిస్తున్న తీరుతో విసిగెత్తిన కొందరు మూటాముల్లూ సద్దుకుని కాంగ్రెస్ పంచన చేరారు. రేవంత్ ఘన విజయం సాధించినంత ఆనం దించా రు. కేసీఆర్ కి గొప్ప ఝలక్ ఇచ్చానని లోలోపల తెగ ఆనందించారు. కానీ అది కేవలం తాత్కాలిక మేనని ఇపుడు స్పష్టమయింది. కదల్లేని కాంగ్రెస్లో ఉండేకంటే ఢిల్లీ దాకా ఉరకలు వేయబోతున్న టీ ఆర్ ఎస్ లోకి మళ్లీ వెళ్లడమే మేలు అని బాగా ఆలోచించే వారంతా మళ్లీ ఈ గట్టుకే వచ్చే ఆలోచనలో పడ్డారు. ఈ జంపింగ్ జిలానీలలో రేవంత్ ఇపుడు కంగారపడుతున్నట్టు తెలుస్తోంది. తను ఎంతో ప్రతిష్టగా భావించి ప్రచారం చేసుకున్నదంతా కేవలం డొల్లేనని అధిష్టానానికి ఎగస్పార్టీవారు తెలియజేస్తే, గతేంగాను.
అసలే రాహుల్గాంధీ భారత్ జోడో అంటూ యువతను ఆకట్టుకునే ప్రచార యాత్రలో ఉన్నారు. ఈ సంగతి క్లియర్గా తేలితే, తెలిస్తే తిట్టే తిట్లు హిందీలోనూ తెలంగాణా వారికి అర్ధమవుతాయి. మరి అంతటి అవమానం దాటేసేందుకు రేవంత్ మరో అమాయక బృందాన్ని తన గట్టుమీదకి తెచ్చుకోవడానికి వెతుక్కో వాలేమో!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-nextrevanth-25-145036.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.