వెనకటికి పులి చారల కోసం తోడేలు వాతలు పెట్టించుకుందిట. ఇపుడు కేసీఆర్ తన పార్టీ పేరును టీఆర్ ఎస్ నుంచి బీఆర్ ఎస్ గా మార్చారు. ఎన్నికల కమిషన్ ఓకే అనేస్తే ఇక అదే పేరు ఖాయమై ఎన్నికల్లోకి అదే పేరుతో పోటీ చేస్తుంది. ఆయన జాతీయ రాజకీయాలమీద దృష్టి సారించడంతో పార్టీని ఆ దిశగా పరుగులు పెట్టించాలని ఆ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలే ఎక్కవగా వినపడుతు న్నాయి. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి దేశంలో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, వీరాభిమానులను ఉత్సహంగా ఉరకలు వేయిం చడానికి కార్యోన్ముఖులను చేయడానికి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసా గిస్తున్నారు. దీనికి తోడుగా యువతను ఆకట్టుకోవడానికి అసలు పార్టీ పేరునే యువ భారత్ కాంగ్రెస్ అంటూ పేరు మారిస్తే ఎలా ఉంటుందని థరూర్ అభిప్రాయాన్ని కాంగ్రెస్ సీనియర్లకు వినిపించేలా అన్నారు. అనాదిగా దేశంలో అన్ని ప్రాంతాల్లో గట్టి మద్దతు, కార్యకర్తల బేస్ ఉన్న పురాతన పార్టీకి పేరు మార్చాలని థరూర్ ఎందుకు ఆలోచన చేసినట్టు?
కాంగ్రెస్ క్రమేపీ యువతను మరింతగా ఆకట్టుకుంటూ భవిష్యత్ మరింత అనుకూలించేలా వ్యూహ రచ నలు చేస్తూ ముందుకు పోతోంది. అయితే పార్టీ నాయకత్వం మార్పు అవసరం అని భావించిన కాం గ్రెస్ ఏకగ్రీవ ఎన్నిక కష్టమై ఎన్నిక దాకా వెళుతోంది. పోటీలో సీనియర్లు మల్లికార్జున్ ఖర్గే, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ఉన్నారు.
కాంగ్రెస్ భావీభారత పౌరులను ఆకట్టుకోవాలంటే ఇలా భారత్ జోడో యాత్రలు చేయడంతో పాటు పార్టీ లోకి యువతను మరింత ఆకట్టుకోవాలని భావించారు. దేశంలో యువత ఎక్కువ శాతం ఉందని వారిని పార్టీవైపు మొగ్గేలా చేస్తే పార్టీ మరింత పటిష్టపడి బీజేపీని ఎదిరించగలదని థరూర్ అభిప్రాయం. అంతేకాదు అందుకు పార్టీ పేరునీ మార్చుకుంటే బావుంటుందనే సూచన ఢిల్లీ పెద్దలకు మరింత బాగా వినిపించేలా అన్నారు. సాధారణ కార్యకర్తలు, ముఖ్యంగా యువకుల నుంచి తనకు సానుకూల స్పం దన వస్తోందని చెప్పారు.
రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడీ యాత్ర, కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికలు పార్టీకి ముఖ్యమని, విప క్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో యువత ఎక్కువగా ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో తనకు యువత మద్దతుగా నిలవడం సంతోషంగా ఉంది. 35 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసున్న వారు దేశ జనాభాలో 65 శాతం ఉన్నారు. మనది యువ భారత్. యువ భారత్ పార్టీగా కాంగ్రెస్ను మార్చాలని భావిస్తున్నానన్నారు. యువ భారత్ ఆశలు, ఆకాంక్షలు, కలలకు ప్రాతినిధ్యం వహించాలని ఆశిస్తున్నానని, ప్రస్తుతం యువ భారత్కు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముంది. యువతతో పాటు పార్టీలోని సీనియర్లు కూడా తనకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నానని శశిథరూర్ అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tharur-suggests-yuvabharth--to--congress-25-145030.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.