అమ‌రావ‌తిపై వాట్ నెక్ట్స్‌?.. డైలమాలో జగన్ సర్కార్!

Publish Date:Mar 4, 2022

Advertisement

కింకర్తవ్యం.. ఏమిటి చేయడం? ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముందున్న పెద్ద ప్రశ్న ఇది.రాష్ట్ర రాజధాని విషయంలో, రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు సర్కార్ ‘ కు ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. నిజమే, ఇలాంటి తీర్పు ఏదో వస్తుందనే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ముందుగానే మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహిరించుకుంది. సీఆర్డీఏ చట్టాన్ని కోర్టు గడప దాటించే ప్రయత్నం చేసింది. కానీ, కుదరలేదు. ప్రభుత్వం చట్టాన్ని ఉపసంహరించుకోవడం వెనక ఉన్న ఉద్దేశాలను హైకోర్టు గుర్తించింది. సర్కార్ వెనకడుగు వేసింది, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల ఫై మరింత బలంగా పంజా విసిరేందుకే అనే నిజాన్ని, సర్కార్ నైజాన్ని న్యాయస్థానం గ్రహించింది. నిజానికి అందులో దాపరికం ఏమీలేదు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, మంత్రులు, వైసీపీ నేతలు ఎవరి భాషలో వారు, చట్టాన్ని వెనక్కి తీసుకున్నా మూడు రాజధానుల సంకల్పం మారలేదని చెపుతూనే ఉన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులకు తమ ప్రభత్వం కట్టుబడి ఉందని, వాదిస్తూనే వచ్చారు. చివరకు, కోర్టు సమర్పించిన అఫిడవిట్’లోనూ అదే విషయం బ్లాక్ అండ్ వైట్’లో చూపించారు. అందుకే, ప్రభుత్వం చట్టాన్ని ఉపసంహరించుకున్నా, న్యాయస్థానం అదే చట్టం పై రైతులు దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ కొనసాగించి, సహజ న్యాయానికి దగ్గరగా ఉండే సంచలన తీర్పును ఇచ్చింది.తాజా తీర్పులో రాష్ట్ర హై కోర్టు, సర్కార్ దృఢ /దృష్ట సంకల్పం అడుగులు ముందు పడకుండా ముందరి కాళ్ళకు బంధాలు వేసింది.నిజానికి జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఇది గట్టి ఎదురుదెబ్బ. ఇంకా గట్టిగా, స్పష్టంగా చెప్పాలంటే చెంప దెబ్బ అంటున్నారు విశ్లేషకులు.  

అదలా ఉంటే, ఈ చిక్కులలోంచి బయట పడేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం సహా అనేక ప్రత్యాన్మాయాలను అలోచిస్తునట్లు తెలుస్తోంది. అయితే, జగన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని విషయంలో ఇప్పటికే పీకలలోతుకు మునిగిపోయింది, తనకు తానుగా సృష్టించుకున్న చిక్కుల్లోంచి బయటపడడం అయ్యే పని కాదని న్తున్నారు. ఒక విధంగా రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వాన్ని అన్నిపక్కల నుంచీ కట్టడి చేసిందని అంటున్నారు.  

భూ సమీకరణలో భాగంగా రైతులతో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) చట్టానికి అనుగుణంగా రాజధాని నగరాన్నీ, ప్రాంతాన్నీ అభివృద్ధిచేయాలన్న హైకోర్టు ఆరునెలల్లో మాస్టర్ ప్లాన్ అమలు పూర్తిచేయాలనీ, మౌలిక సదుపాయాల నిర్మాణం, కనీసావసరాలు తీర్చడం నెలరోజుల్లో జరగాలని ఆదేశించింది. భూములు ఇచ్చిన రైతులకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధిపరచిన ప్లాట్లు మూడునెలల్లో అప్పగించాలని, అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు తనకు నివేదికలు ఇస్తుండాలని నిర్దేశించింది. అంటే ఒక విధంగా న్యాయస్థానం ప్రభుత్వాన్ని గట్టిగా కట్టి పడేసిందని అనుకోవచ్చునని అంటున్నారు.  

నిజమే, కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కొందరు మంత్రులు ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందని అంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమని పాత పాటనే మళ్ళీ ఎత్తుకున్నారు. అలాగే, రాష్ట్ర హై కోర్టు తీర్పు పై సుప్రీం కోర్టుకు వెళతామని ప్రకటించారు. నిజానికి, ఇది దింపుడు కళ్ళెం ఆశా లేక నిజంగా అలాంటి ఆవకాశం ఉందా? అంటే న్యాయనిపుణులు ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళినా, వెళ్ళక పోయినా, జగన్ రెడ్డి ప్రభుత్వానికి కొత్తగా ఎలాంటి ఊరట ఉండక పోవచ్చనే అంటున్నారు. అందుకే కావచ్చును ప్రభుత్వం కూడా, తుది నిర్ణయం విషయంలో కిందా మీదా అవుతోందని అధికార వర్గాల సమాచారంగా వుంది.  

ఇంతవరకు జగన్ రెడ్డి ప్రభుత్వం, మూడు ముక్కలాటను ఇష్టా రాజ్యంగా నడిపించింది. దాదాపు 800 రోజులకు పైగా విభిన్న రూపాల్లో ఉద్యమాలు చేస్తున్న అమరావతి రైతులను, మహిళలను అనేక విధాల వేధింపులకు గురిచేసింది. అయినా,  చివరకు కోర్టు తీర్పురూపంలో ధర్మం జయించింది. 
అందుకే, ఇప్పటికైనా, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం,అధికార పార్టీ, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడు రాజధానుల మంకు పట్టును వదిలి కోర్టు తీర్పును గౌరవించడం అన్ని విధాలా శ్రేయస్కరం అంటున్నారు. గత రెండున్నరేళ్ళుగా జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో, రాజధాని నిర్మాణం అడుగు ముందుకు సాగలేదు. రాష్ట్రం రాజధాని లేని అనాధగా మిగిలిపోయింది. ఈనేపధ్యంలో రాష్ట్ర హై కోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనిపించినా, నిజానికి అది ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు కాదు. ఇంకా మాట్లాడితే,  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వానికి హై కోర్టు ఒక సువర్ణ అవకాశం కలిపించింది. ఇక ఈ అవకాశాన్ని. ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇపుడు జగన్ రెడ్డి చేతిలోనే వుంది. ఎప్పటిలా మొండికి పోతే, రాష్ట్రం తీవ్రం నష్టపోతుందని అంటున్నారు.

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.