పనిచేయనప్పుడు వ్యాక్సిన్ ఎందుకు? ప్రజల్లో చర్చ..!

Publish Date:Jan 20, 2022

Advertisement

కరోనా టీకా వేయించుకుంటే యాంటీ బాడీలు పెరిగి వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. ఈ భూమ్మీద పుట్టిన ఏ శాస్త్రవేత్త అయినా చెబుతున్నది ఇదే.. వ్యాక్సినేషన్ చేయించుకున్నా దీర్ఘకాలం రక్షణ లభించే అవకాశం ఉండకపోవచ్చట. వ్యాక్సిన్ కరోనాకు బ్రహ్మాస్త్రం కాదట. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకదని గ్యారంటీ అసలే లేదు. వ్యాక్సిన్ రెండు డోసులూ వేయించుకున్న పలువురికి కూడా కరోనా వైరస్ సోకింది. ఇప్పుడు ఒమిక్రాన్, అంతకు ముందు డెల్టా వేరియంట్ కూడా సోకాయి. కరోనా టీకాలు వేసుకున్న తర్వాత కూడా కొందరి ప్రాణాలను మహమ్మారి హరించేసింది. అయినప్పటికీ ప్రజలంతా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోవాలి. అవసరం, అవకాశం ఉన్న వారు ప్రికాషన్ డోసు కూడా వేయించుకోవాలి. ఇది ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాట. టీకాలు వేయించుకున్నప్పటికీ మాస్క్ లు తప్పనిసరి. సామాజిక దూరం పాటించడమూ, తరచూ శానిటైజర్ వినియోగించడమూ తప్పదట. అయినప్పటికీ కరోనా సోకదనే గ్యారంటీ మాత్రం లేదు!

కరోనా టీకా టీసుకున్న వారిలో ఆరు నెలలకే యాంటీబాడీలు తగ్గుతున్నాయని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) అధ్యయనంలో వెల్లడైంది. ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్ తో కలసి ఏఐజీ ఈ అధ్యయనం నిర్వహించింది. మొత్తం ఒక వెయ్యి 636 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఏఐజీ అధ్యయనం నిర్వహించింది. టీకా వేయించుకున్న ఆరు నెలల్లోనే 30 శాతం మందిలో యాంటీబాడీలు తగ్గిపోతున్నట్లు గుర్తించింది. టీకా తీసుకున్న వారిలో కూడా ఐజీజీ-ఎస్ 1, ఐజీజీ-ఎస్ 2 యాంటీబాడీలల్లో తగ్గుదల కనిపించినట్లు ఏఐజీ స్టడీ వెల్లడిస్తోంది. అంటే టీకా వేసుకున్నా కరోనా ముప్పు పొంచి ఉండొచ్చట. ముఖ్యంగా 40 ఏళ్ల వయస్సు పైబడి, బీపీ, చక్కెర వ్యాధి ఉన్న వారిలో టీకాలు వేసుకున్నా యాంటీబాడీలు తగ్గుతున్నట్లు అధ్యయనంలో తేలిందని ఏఐజీ స్టడీ పేర్కొంది.

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో ఐరోపా దేశాలు వణికిపోతుండడం గమనార్హం. ఎందుకంటే ఆ దేశాల్లో చాలా మందికి రెండు డోసుల టీకా వేయించుకున్నవారికి, చివరికి బూస్టర్ డోసు వేయించుకున్న వారిలో కూడా చాలా మందిని ఒమిక్రాన్ వదిలిపెట్టడం లేదు.

వ్యాధి సోకకుండా నివారించే ఔషధాన్ని వ్యాక్సిన్ అంటారు. ఎప్పటికీ కరోనా సోకకుండా నివారించే శక్తి లేని దాన్ని వ్యాక్సిన్ అని ఎందుకు అనాలో అర్థం కావడం లేదనేది కొందరి క్వశ్చన్ మార్క్.. మసూచి, కోరింత దగ్గు, పోలియో లాంటి వ్యాధులు రాకుండా నివారించేందుకు వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సిన్ లు వేయించుకున్నవారిని ఆయా జబ్బులు దరి చేరవనేది ఇప్పటివరకు మనం నమ్ముతున్న నిజం. ఇప్పుడు కరోనా వైరస్, ఒమిక్రాన్ విషయంలో వస్తున్న వార్తలు, వైద్యులు చేస్తున్న చికిత్సలు, వేస్తున్న వ్యాక్సిన్ లో ఏది నిజం? ఏది అబద్ధమో తెలియకుండా ఉందని పలువురిలో కలుగుతున్న అనుమానం. కరోనా వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులు, కాలేయంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో 90 శాంత మంది శ్వాస అందకపోవడంతో మరణించినవారే ఎక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. కరోనా అసలే సోకకుండా.. ఒకవేళ సోకినా వైరస్ ను నాశనం చేసేలా మందులను ఔషధ కంపెనీలు కనిపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. నిజానికి కరోనా కన్నా ఇతర ఆరోగ్య సమస్యలతో మరణిస్తున్నవారి సంఖ్యే అధికం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ఇతర వ్యాధుల విషయంలో జరగని హడావుడి కరోనా విషయంలో ఎందుకు జరుగుతోందనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా ప్రమాదకరం అని జరుగుతున్న ప్రచారం వల్లే ఎక్కువ మంది ప్రాణాలు పోతున్నాయనేది కొందరి ఆరోపణ.

ఇవన్నీ వింటుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? పూర్తిగా రక్షణ కల్పించలేని టీకా తీసుకుని ఫలితం ఏమిటని అనిపించవచ్చు కదా? టీకా వేసుకున్నా కరోనా నుంచి ముప్పు గండం పొంచి ఉంటుందనుకున్నప్పుడు దాని కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా? అనే సందేహం కూడా పలువురిలో కలగవచ్చు. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా వస్తుందని చెబుతున్నప్పుడు టీకా ఎందుకు వేసుకోవాలి అనే ప్రశ్న వస్తోంది. ఉపయోగపడని వ్యాక్సిన్ ఎవరి ప్రయోజనం కోసం వేస్తున్నారనే విమర్శలు రావడం సహజమే కదా?!

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.