దావోస్ లో కేటీఆర్, జగన్ భేటీ.. చీకటి ఒప్పందాల కోసమేనా?!

Publish Date:May 24, 2022

Advertisement

దావోస్ వేదికగా కేటీఆర్, జగన్ ల భేటీ రాజకీయ వర్గాలలో పెద్ద ఆశ్చర్యం కలిగించదు కానీ.. సామాన్య జనం మాత్రం ఇదేదో ఎనిమిదో వింత అన్నట్లు నిబిడాశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు. జగన్, కేటీఆర్ లు అంత ఆత్మీయంగా పలకరించుకోవడమేమిటి? అని నిర్ఘాంత పోతున్నారు. నిన్న గాక మొన్న ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో కేటీఆర్ హైదరాబాద్ వేదికగా ఒక బిజినెస్ సదస్సులో కుండ బద్దలు కొట్టారు.

దానిపై వైసీపీ నేతలు, మంత్రులు భగ్గుమన్నారు. టీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ అని నిలదీశారు. తెలంగాణలో కంటే ఆంధ్రలోనే అభివృద్ధి భేషుగ్గా ఉందని దబాయించారు. ఎన్నికల ముందు ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంటును మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలలోనే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. ఎన్నికల ముందు టీఆర్ఎస్, వైసీపీలకు ప్రజలలో ఆ సెంటిమెంట్ సజీవంగా ఉండటం అవసరం కనుకనే ఇరు పార్టీలూ కూడబలుక్కునే ఈ వివాదాన్ని లేవనెత్తయని అప్పట్లోనే రాజకీయ వర్గాలలో చర్చ నడిచింది. ఆతరువాత అంతా మామూలే. ఇప్పుడు దావోస్ వేదికగా టీఆర్ఎస్, జగన్ లు కలవడం అందుకే రాజకీయ వర్గాలలో పెద్దగా చర్చ జరిగే అవకాశం లేదు. కానీ ఇటీవలి కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంపై, ప్రధాని మోడీపై విమర్శల వర్షం కురిపిస్తుండటం... అలాగే కేంద్రం కూడా తెలంగాణ పట్ల ఒకింత వ్యతిరేక ధోరణి కనబరచడం, అదే సమయంలో కేసీఆర్ అవినీతి కోట బద్దలౌతోందనీ, ఆయన త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమనీ బీజేపీ ఏపీ అధ్యక్షుడు బండి పదే పదే సభలు, సమావేశాలలో చెబుతుండటంతో ఏదో జరగబోతోందన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది.

అలాగే కేంద్ర ఆర్థిక శాఖలోని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కేసీఆర్ అవినీతి, అక్రమాలపై సీబీఐ, ఈడీ దృష్టి సారించాయి. ఈ సమాచారం కేసీఆర్ కు కూడా లీక్ కావడంతోనే ఆయన నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారని ఆ వర్గాల భోగట్టా. ఈడీ సోదాల నుంచీ, సీబీఐ దర్యాప్తు నుంచి తప్పించుకోవడమెలా అన్న విషయంపై కేసీఆర్ జగన్ సలహా, సూచన తీసుకోవాలని నిర్ణయించుకున్నారనీ, ఏపీ, తెలంగాణలలో జగన్ తో భేటీ అయితే జనాలకు తప్పుడు సంకేతాలు వెలువడే అవకాశాలున్నాయన్న శంకతోనే ఈ భేటీ వేదికను దావోస్ ఎంపిక చేసుకున్నారంటున్నారు. అందుకోసమే పెద్ద ఎత్తున సిఫారసులతో కేటీఆర్ దావోస్ కు ఆహ్వానం అందేలా చేసుకున్నారనీ అంటున్నారు.

ఈ సలహా, సూచనలకు  జగనే ఎందుకంటే అన్న ప్రశ్నకు కూడా పరిశీలకులు విశ్లేషణాత్మక వివరణలు ఇస్తున్నారు. ఇప్పటికే ఈడీ, సీబీఐ విచారణలను ఎదుర్కొంటున్న జగన్ వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, విచారణ జాప్యం అవ్వడానికి ఏం చేయాలి అన్న విషయంలో విలువైన సహకారం అందించగలరన్నది కేసీఆర్ నమ్మకంగా చెబుతున్నారు. అందుకే జగన్ తో భేటీకి కేటీఆర్ అత్యంత ప్రాధాన్యతనిచ్చారని అంటున్నారు.

కేసీఆర్ అడగ్గానే జగన్ కేటీఆర్ తో భేటీకి అంగీకరించడానికి కూడా కారణముందంటున్నారు. గత ఎన్నికలలో ఏపీలో జగన్ అధికారంలోనికి వచ్చేందుకు అన్ని విధాలుగా కేసీఆర్ ‘సహాయ సహకారాలు’ అందించడంతో ఇప్పుడు ఆ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ కారణంతోనే జగన్, కేటీఆర్ లు ఇరువురూ కూడా దావోస్ లో పెట్టుబడుల వేట కంటే పరస్పర భేటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొంటున్నారు.   

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, మూల్యాంకన వ్యవస్థ వైఫల్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్  అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్..  రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం  4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.