Publish Date:May 24, 2022
వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఛీటింగ్ కేసు నమోదైంది. నిత్యం వివాదాలతో సహవాసం చేసే రామగోపాల వర్మ వివాదాలను ఆహ్వానించి మరీ వార్తల్లో నిలుస్తారని ప్రతీతి. తాజాగా ఆయనపై ఓ చీటింగ్ కేసు నమోదైంది. నిజానికి రామ్ గోపాల్ వర్మకు వివాదాలేమీ కొత్త కాదు. నిత్యం ఏదో ఒక వివాదాన్ని ఆయనే సృష్టించి మరీ వార్తల్లో ఉండడం ఆయన హాబీ. తన దైన శైలిలో ట్విటర్ వేదికగా ట్వీట్లు చేసినా, ఆయన నోటి నుంచి ఏ మాట వచ్చినా అవి వివాదాస్పదమైనవే అయి ఉంటాయి. వివాదాల సృష్టి కోసమే ఆయన ఆలోచిస్తుంటారనడం సబబేమో అన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది.
తాజాగా హైదరాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఆర్జీవీపై చీటింగ్ కేసు నమోదైంది. దీంతో ఆయన మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఆర్జీవీ చీటింగ్ చేశారంటూ శేఖర్ ఆర్ట్ క్రియేషన్ యజమాని కొప్పాడ శేఖర్ రాజు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో వర్మ మరో వివాదంలో చిక్కుకున్నట్లయింది. కొన్ని సంవత్సరాలుగా ఆర్జీవీ తాను తెరకెక్కిస్తున్న మూవీలు, వ్యవహార శైలితో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
‘ఆశ ఎన్ కౌంటర్’ సినిమా ఒకటి ఆర్జీవీ సమర్పణలో విడుదలైంది. 2019 నవంబర్ లో హైదరాబాద్ నగర శివార్లలో ఒక వెటర్నరీ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటన, నిందితుల ఎన్ కౌంటర్ ఘటన ఆధారంగా ఆశ ఎన్ కౌంటర్ మూవీని రూపొందించారు. ఆ సినిమాపై వివాదాలు చుట్టుముట్టాయి. అనేక సార్లు అది రిలీజ్ కాకుండా వాయిదాలు పడింది. చివరికి ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కథ ఇక్కడితో ముగియలేదు.
కొద్ది రోజుల క్రితం శేఖర్ రాజుకు ఓ కామన్ మిత్రుడి ద్వారా ఆర్జీవీ పరిచయం అయ్యారట. వర్మకు తాను 2020 జనవరిలో 8 లక్షలు, మరి కొన్ని రోజుల అనంతరం మరో 20 లక్షలు, మళ్లీ 28 లక్షలు ఇచ్చినట్లు ఆయన తన ఫిర్యాదులో శేఖర్ రాజు పేర్కొనడం గమనార్హం. ఈ మొత్తాలన్నీ కలిపి ‘ఆశ ఎన్ కౌంటర్’ మూవీ రిలీజ్ కు ముందే ఇచ్చేస్తానని ఆర్జీవీ హామీ ఇచ్చారని శేఖర్ రాజు చెబుతున్నారు. తీరా ఆ మూవీ రిలీజ్ అయిపోయింది. వర్మ తనకు మాట ఇచ్చిన సమయం కూడా దాటిపోయింది. ఆశ ఎన్ కౌంటర్ మూవీకి ఆర్జీవీ నిర్మాత కాదని శేఖర్ రాజుకు తెలిసిందట. దీంతో తాను మోసపోయానని, ఆర్జీవీ తనను చీట్ చేశారంటూ మియాపూర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిత్య వివాదాల దర్శకుడు మరోసారి చీటింగ్ వివాదాన్ని తన తలపైకి తెచ్చుకున్నట్లయింది. అయితే.. ఈ చీటింగ్ కేసు విషయమై ఇప్పటి వరకూ రామ్ గోపాల్ వర్మ స్పందించకపోవడం గమనార్హం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cheating-case-on-rgv-25-136361.html
దేశవ్యాప్తంగా విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, మూల్యాంకన వ్యవస్థ వైఫల్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.