దావోస్ లో జగన్, కేటీఆర్ ఏమి చర్చించారు?

Publish Date:May 24, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్  ఇద్దరూ ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్’లో ఉన్నారు. అక్కడే ఆ ఇద్దరూ ప్రత్యేకంగా సమావేసమయ్యారు. ఇరుగు పొరుగు రాష్టాలకు చెందిన ఇద్దరు ముఖ్యనాయకులు మరో దేశంలో కలిసి నప్పుడు కలిసి మాట్లాడుకోవడం, ఒకరిని ఒకరు ఆత్మీయంగా పలకరించుకోవడం పెద్దగా చెప్పుకోవలాసిన విషయం కాదు. అందులో విశేషం లేక పోవచ్చును.కానీ,వుందని అంటున్నారు. 
ఎందుకంటే, ఈ మధ్య కాలంలో, ఈ మధ్య  కాలమని ఏముంది లెండి, మొదటి నుంచి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య గొప్ప సయోధ్య ఎప్పుడూ లేదు. స్నేహ, దాయాది బంధం అంతగా లేదు, ప్రస్తుతం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల నాయకుల మధ్య  మాటల యుద్ధం నడుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్’ను చులకన చేసి మాట్లాడడం తెలంగాణ మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలకు అలవాటుగా మారి పోయింది. 

ముఖ్యంగా మంత్రి కేటీఆర్’  ఈ మధ్యనే  ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థతి అద్వాన్నంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏపీలో రోడ్లు లేవు, విద్యుత్ లేదు, మౌలిక సదుపాలు అసలే లేవని, ఎవరో మిత్రుడు చెప్పినట్లు చెప్పి, పొరుగు రాష్ట్రాన్ని చులకన చేశారు. అఫ్కోర్స్, ఏపీలో పరిస్థితులు అద్వాన్నంగా ఉన్నమాట నిజం. అందులో రెండో అభిప్రాయానికి తావులేవు. అయితే, తెలంగాణలో పరిస్థితులు అంతకంటే గొప్పగా ఉన్నాయా అంటే, లేదు. సరే అది వేరే విషయం ...కేటీఆర్  నోరు జారి నాలుక కరుచుకున్నారు.  సారీ చెప్పారు. 

అయితే, ఇప్పుడు దావోస్’లో ఆ ఇద్దరూ యాదృచ్చికంగా కలిశారా, ముందుగా అనుకునే కలుసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, రాజకీయ వ్యూహంలో భాగంగా ఒకరిపై ఒకరు కాసింత ఘాటు విమర్శలు చేసుకున్నా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, అధికార తెరాస, వైసీపీ పార్టీల మధ్య రాజకీయ సంబంధాలు, ఇచ్చి పుచ్చుకోవడాలు సజావుగానే సాగుతున్నాయని, రెండు పార్టీలలో ఎప్పటి నుంచో వినవస్తోంది.  రాజకీయ ఉమ్మడి వ్యూహంలో భాగంగానే ఇద్దరు ముఖ్యమంత్రులు  ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే, దావోస్’లో కేటీఆర్, జగన్ రెడ్డి కులుసు కోవడం రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిజానికి, ఆ ఇద్దరు ముఖ్య నాయకులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనుసరించ వలసిన ఉమ్మడి ఎన్నికల వ్యూహం పైనే చర్చించారని రాజకీయ వరగాల్లో చర్చ జరుగుతోంది.

ఏపీలో చంద్రబాబు నాయుడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు  వారిపై ఉన్న కేసులను తిరగ దోడడం మొదలు, ఆ ఇద్దరి ఆర్థిక ములాలను దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యూహరచన చేశారని తెలుస్తోంది. అందుకే కేటీఆర్, కావాలనే జగన్ రెడ్డి తో సమావేశం ‘గొప్పగా’ జరిగిందని ట్వీట్’ చేశారు. ఆ ఇద్దరి మధ్య యాదృచ్చికంగా సమావేశం జరిగుంటే, కేటీఆర్ ట్వీట్ చేయవలసిన అవసం లేదు, చేసినా, “నా సోదరుడు ఏపీ ముఖ్యమంత్రి  జగన్ రెడ్డితో సమావేశం గొప్పగా జరిగింది”, అని అంత గొప్పగా, విశేషణాలను చేరుస్తూ, ఫోటోలు జత చేసి మరీ ట్వీట్  చేయవలసిన అవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు. 

అదలా ఉంటే, ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు, గౌరం తెచ్చిన నేపధ్యంలో రాష్ట్ర విభజన తర్వాత కూడా, చంద్రబాబు సృష్టించిన బ్రాండ్ ఇమేజ్’తో హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది. అదే విధంగా రాష్ట్ర విభజన అనంతరం తొలి ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ఎన్నో దేశాలు తిరిగి పెట్టుబడులు ఆకర్షించేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించారు. ఫలితంగా, ఇంతవరకు ఉభయ తెలుగు రాష్ట్రాలు విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ముందువరసలో నిలిచాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

 కేంద్ర పారిశ్రామిక అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం తాజా నివేదిక ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 4,37,188 కోట్ల  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే అందులో 37.46 శాతం ( రూ.37,188 కోట్లు)తో కర్ణాటక ప్రధమ స్థానంలో వుంది. అలాగే, 26.78 శాతం (రూ.64.24 కోట్లు) తో మహా రాష్ట్ర రెండవ స్థానంలో వుంది. గత సంవత్సరం వరకు టాప్ 10 స్టేట్స్’లో ఉన్న ఏపీ, తెలంగాణ ఈ సంవత్సరం ఆ స్థానాన్ని కోల్పోయాయి. ఈ సంవత్సరం తెలంగాణ 2.73 శాతం  (రూ.11,965 కోట్లు)తో దక్షిణాది రాష్టాలో కర్ణాటక, తమిళనాడు తర్వాత మూడవ స్థానానికి దిగజారింది,. ఆంధ్రప్రదేశ్ 0.38 శాతం ( రూ.1.682 కోట్లు) తో మరింత కింది జారిపోయింది.  అవును మరి అంతర్జాతీయ వాణిజ్య సదస్సులోనూ రాజకీయ ప్రత్యర్ధులను ఓడించే ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తూ, రాజకీయాలే సర్వస్వం అనుకుంటే పెట్టుబడులు రావు సరికదా, వచ్చినవీ వెనక్కి పోతాయి,.ఇప్పుడు ఉభే తెలుగు రాష్ట్రాలలో అదే జరుగుతోంది.

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, మూల్యాంకన వ్యవస్థ వైఫల్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్  అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్..  రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం  4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.