కీచకులను పంచన పెట్టుకుని సమాజానికి జగన్ ఇచ్చే మెసేజ్ ఏమిటి?

Publish Date:Aug 5, 2022

Advertisement

ఏపీలో మూడేళ్లకు పైగా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలో ఇలా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, వేధించడం గోరంట్ల మాధవ్ తోనే మొదలు కాలేదు.  రాష్ట్ర ప్రజలు 2019 ఎన్నికలలో ఏకంగా వైసీపీ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలను, 22 మంది ఎంపీలను గెలిపించి అధికారం కట్టబెట్టారు. గొప్పగా పాలన అందిస్తారని ఆదేశించారు. పాదయాత్ర సందర్భంగా జగన్ చేసిన వాగ్దానాలను విశ్వసించారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు,అప్పులు, దౌర్జన్యాతోనే ఈ మూడేళ్లు గడిపేసింది. అభివృద్ధిని అటకెక్కించేసింది. విమర్శలను సహించని, రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూసే కొత్త సంస్కృతికి తెరతీసింది. అన్నిటికీ మించి రాష్ట్రంలో మహిళలపై  దాడులు, వేధింపులు, అత్యాచారాలు పెచ్చరిల్లాయి. అయినా సీఎం పెదవి విప్పి మాట్లాడరు. ఆయన మాట్లాడరు కనుక మంత్రలదీ మౌనముద్రే.  సమస్య ఏదయినా.. సందర్భం ఏదయినా అయితే సకల శాఖల మంత్రిగా గొప్ప గుర్తింపు పొందిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, లేదంటే  విజయసాయిరెడ్డి.. వీళ్లే మాట్లాడతారు. ఇక ప్రత్యర్థులపై సమయం సందర్భం లేకుండా విమర్శలు గుప్పించడానికి వైసీపీ సోషల్ మీడియా. అంతే. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్.. ఇప్పుడు ఎంపీ గోరంట్ల..వీరంతా మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ వేధించి అడ్డంగా దొరికిపోయిన వారే. వీరేనా మహిళల పాలిట కీచకుడిగా మారిన వలంటీర్, సర్పంచ్.. ఎవరైతేనే వీరంతా వైసీపీ వారే. వీరందరినీ వెనకేసుకొస్తూ ముఖ్యమంత్రి జగన్. ఇంతటి మెజారిటీతో, అభిమానంతో అధికార అందలం ఎక్కించిన వారికి జగన్ ఇస్తున్న సందేశం ఏమిటి?

వారి బాగోతాలను బైటపెట్టిన మీడియాకు పచ్చ ముద్ర వేస్తూ, విమర్శించి ఖండించిన విపక్షాలపై కేసులు బనాయిస్తూ వైసీసీ ప్రభుత్వం రాష్ట్రాన్ని జనరంజకంగా పాలిస్తోందని జగన్ తనకు తాను కితాబులిచ్చేసుకుంటే అంతా బాగున్నట్టేనా?  అయినా ఒక ఎంపీ అయ్యి ఉండి ఒక మహిళతో వీడియోకాల్ లో అసభ్యంగా ప్రవర్తిస్తూ అడ్డంగా దొరికిపోయిన తరువాత కూడా ఆయనపై చర్యలు తీసుకోవడం మాని అసలా వీడియోనే మార్ఫింగ్..దానిపై విచారణ జరిపిస్తాం అంటూ నాన్చడం ఏమిటీ? ఆ వీడియో మార్ఫింగ్ చేసిన వారిపై పోలీసులకు ఎంపీ మాధవ్ ఫిర్యాదు చేశారట. పోలీసులు విచారణ చేసిన తరువాత ఒక వేళ ఆ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే అప్పుడు మాధవ్ పై చర్య తీసుకుంటారట.  

ఇంతకీ ఆ వీడియోలను సర్కారు ఫోరెన్సిక్ పరీక్షకు పంపుతుందా లేదా అన్న విషయాన్నిమాత్రం  ఎంపీగారిని వెనకేసుకు వస్తూ దోషిగా తేలనివ్వండి అప్పుడు చర్య తీసుకుంటామని చెప్పిన సజ్జల చెప్పలేదు. అసలు ఇంతటి దరిద్రంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతుంటే, వైసీపీలోని మహిళా మంత్రులు కనీసం నోరు విప్పలేదు. అయిన దానికీ కాని దానికీ విపక్షాలపై ట్వీట్లతో విరుచుకుపడే విజయసాయి కూడా ఇంత వరకూ స్పందించలేదు.

ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే.. కనీస నైతికత లేకుండా కుటుంబ విషాదాన్ని కూడా పట్టించుకోకుండా ఇష్టారీతిన ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు తమ సొంత పార్టీ ఎమ్మెల్యే నీచ వ్యవహారంపై ఎందుకు మౌనం వహించారు.  ఇంతకూ నైతికతకు తిలోదకాలిచ్చేసి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న వారందరికీ వెన్నుదన్నుగా నిలుస్తూ జగన్ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. అప్పల్లో, అక్రమాల్లో ఆర్థిక క్రమశిక్షణారాహిత్యంతో నేతల రోత వర్తనతో జగన్ సర్కార్ ఏపీ పరువును గంగలో కలిపేసిందంటున్న మహిళల విమర్శలకు ఏం సమాధానం చెప్పగలరు?

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.