తిరుపతిని తలపించేలా యాదగిరి గుట్టపై ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడే లక్ష్యంతో ఆయల పునర్నిర్మాణం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతుంటే.. ఆలయ దర్శనాలు ప్రారంభమైన తరువాత అక్కడ సీన్ రివర్స్ అయ్యిందన్న విమర్శలు వినవస్తున్నాయి.
కేసీఆర్ లక్ష్యాలు, ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా అక్కడి పరిస్థితి ఉందని యాదగిరిగుట్ట జేఏసీ ఆరోపిస్తున్నది. ఇదంతా ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతోందా? లేక దేవాదాయ శాఖాధికారుల ఇష్టారాజ్యంగా సాగుతోందా అన్న అనుమానాలు వ్యక్త మౌతున్నాయి.
గుట్టపైకి వాహనాల అనుమతి, దుకాణాలకు అనుమతి దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ భారీ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నట్లు జేఏసీ ఆరోపించడమే కాకుండా ఉన్నతాధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదు అందజేసి సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. అయితే వారి ఫిర్యాదుపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలకూ ఉపక్రమించకపోవడంతో అంతా సీఎం కనుసన్నలలోనే జరుగుతోందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
యాదగిరిగుట్ట కొండపైన దుకాణాలు ఉండవద్దని కేసీఆర్ చెబితే..అదుకు భిన్నంగా అధికారులు దుకాణాలకు టెండర్లు పిలవడం, ఆ తరువాత వాటిని రద్దు చేసి వ్యాపార కేంద్రాల తెరిచేందుకు మౌఖిక ఆదేశాలివ్వడం,సీఎం వస్తున్నారనగానే వాటిని మూసివేయించడం మరల మూసివేయించడం, ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన ముగించుకుని వెళ్లగానే వ్యాపార కేంద్రాలను తెరిపించడం వంటి సంఘటనలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. జేఏసీ ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ వాస్తవాలు వెలికి తీసేందుకు ఉన్నత స్థాయి విచారణకు డిమాండ్ చేస్తున్నది. ఉన్నతాధికారులు తమ ఫిర్యాదుపై స్పందిచకపోవడంతో లోకాయుక్తను ఆశ్రయించాలని యోచిస్తున్నది. తెలంగాణ కీర్తి కిరీటంలో కలికితురాయి వంటి యాదాద్రి పవిత్రతను మంటగలిపే విధంగా అక్కడి కార్యక్రమాలు ఉన్నాయన్న భావన సామాన్య భక్తులలో సైతం కలుగుతోంది. ఆలయ పునర్నిర్మాణానికి ముందు ఒకింత ఇరుకుగా ఉండి అసౌకర్యం ఉన్నప్పటికీ భక్తులకు వసతి, సౌకర్యాల విషయంలో ఇప్పటి కంటే గతంలోనే ఎంతో మెరుగ్గా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కొండపై ఎండ బారిన పడకుండా తలదాచుకునేందుకు నీడ కూడా కరవైన పరిస్థితి ఉందని వారు వాపోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రణాళికకు, ప్రకటనలకు భిన్నంగా జరుగుతున్న కార్యక్రమాలపై జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులు కొందరు బినామీల పేరిట శానిటేషన్, మరమ్మతులు, నిర్మాణపు పనులు చేపడుతూ దేవస్థానం నిధులను ప్రణాళికా బద్ధంగా దుర్వినియేగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూడా ఆధారాలతో సహా లోకాయుక్తకు ఫిర్యాదు చేయనున్నట్లు జేఏపీ తెలిపింది. అసలింతకీ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందాల్సిన యాదగిరి గుట్టపై ఏం జరుగుతోంది? భక్తులలో, స్థానికులలో ఎందుకు ఇంత అసహనం వ్యక్తం అవుతోంది. గుట్ట విషయంలో భారీ స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? నిజంగానే గట్టు పునర్నిర్మాణం, అనంతర పనుల నిర్వహణలో భారీ అవినీతి జరిగిందా? ఈ అంశాలపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించి అవకతవకలు జరిగినట్లు రుజువైతే సంబంధితులపై తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ జోరందుకుంటోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-is-going-on-in-yadadri-jusj-opposit-to-what-cm-said-25-135301.html
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు.
తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
Publish Date:Dec 31, 2025
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
Publish Date:Dec 31, 2025
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.