CAB, NRCల్లో అసలేముంది? అసలు ఉద్దేశమేంటి?

Publish Date:Dec 17, 2019

Advertisement

పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ రెండూ విభిన్నమైనవే అయినా ఒకే నాణేనికి రెండు ముఖాల్లాంటివి. ఆరెస్సెస్ ప్రతిపాదిస్తున్న హిందూ భావనకు దోహదం చేసేవే. భారతదేశం హిందువులందరికీ మాతృభూమి అనే భావనకు అనుగుణంగానే ఈ రెండు చట్టాలు రూపుదిద్దుకున్నాయి. అసోం విషయానికి వస్తే....అక్కడ మతంతో సంబంధం లేకుండా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అంతా అక్రమ వలసదారులవుతారు. అదే సమయంలో ముస్లిమేతరులు మాత్రం భారత పౌరసత్వం పొందేందుకు మాత్రం వీలవుతుంది. బెంగాల్ విషయానికి వస్తే 1971 మార్చి 24 కంటే  ముందు వచ్చిన బంగ్లాదేశీయులకు అందరికీ భారత పౌరసత్వం ఇచ్చేలా 2003లోనే చట్ట సవరణ జరిగింది. తాజా చట్టసవరణతో 2014కు ముందు వచ్చిన వారందరికీ పౌరసత్వ లభించే అవకాశం కలిగింది. కాకపోతే ముస్లిమేతరులు మాత్రమే భారత పౌరసత్వం పొందే వీలుంది. 

ఇక నేషనల్ రిజిష్టర్ ఆఫ్ కౌన్సిల్ ను దేశవ్యాప్తంగా అమలు చేస్తే....తాము భారతీయులమని రుజువు చేసుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉన్నా.....ముస్లింలపై అది మరింత భారం మోపే అవకాశం ఉంది. అందుకు కారణం....తాము భారత పౌరులమని రుజువు చేసుకోలేకపోయిన ముస్లిమేతరులు శరణార్థులమంటూ భారత పౌరసత్వాన్ని పొందవచ్చు. ముస్లింల విషయంలో మాత్రం అలా జరిగేందుకు అవకాశం లేదు. మొత్తం మీద చూస్తే మాత్రం....పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ రెండు వేర్వేరు అంశాలే అయినప్పటికీ ఏదో విధంగా మతంతో ముడిపడినవే. ఆ కారణంగానే ఇది దేశంలో మతపరమైన వాదనలకూ దారితీస్తోంది.

పౌరసత్వ సవరణ అంశం అనేది మతం ఆధారంగా ఉందనేది నిజం. పొరుగున ఉన్న మూడు దేశాల నుంచి శరణార్థులుగా వచ్చి భారతీయ పౌరసత్వం కోరే వారిని ఇది మతం ప్రాతిపదికన విభజిస్తుంది. పొరుగున్న ఉన్న ముస్లిం దేశాల్లో మతపరమైన వేధింపులకు గురయ్యే ముస్లిమేతరులు మాత్రమే పౌరసత్వ సవరణ చట్టం ఆధారంగా దేశంలో పౌరసత్వం పొందగలుగుతారు. ఇక, నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది మతం ఆధారంగా ఉండేది కాదు. ఏ మతానికి చెందిన వారైనప్పటికీ అక్రమంగా వచ్చిన వలసదారులను వెనక్కి పంపడమే దీని ఉద్దేశం. 

అయితే, ఎన్సార్సీని దేశవ్యాప్తం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నప్పటికీ... ఇప్పటికైతే ఇది సుప్రీం ఆదేశం మేరకు ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమైంది. అసోంలోని అక్రమ వలసదారులను గుర్తించి, నిర్బంధించడమే దీని ఉద్దేశం. అసోం మినహా మరే రాష్ట్రానికి కూడా ప్రస్తుతం ఎన్సార్సీ వర్తించదు. అయితే, పౌరసత్వ సవరణ చట్టం మాత్రం యావత్ దేశానికి వర్తిస్తుంది. కొంతమంది ముఖ్యమంత్రులు ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో పాటించబోమని అంటున్నా  రాజ్యాంగరీత్యా వారి మాట చెల్లుబాటు అయ్యే అవకాశం లేదు. అన్ని రాష్ట్రాలు కూడా కచ్చితంగా ఈ చట్టాన్ని అమలు చేయాల్సి ఉంటుంది.

By
en-us Political News

  
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కడప నగరంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసి మునిసిపల్ కార్పొరేషన్ లో జెండా ఎగురవేసేందుకు తెలుగుదేశంపార్టీ శ్రేణులన్ని కష్టపడి పని చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులురెడ్డి పిలుపు నిచ్చారు.
బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. మా ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం పేర్కొన్నారు.
మాజీ సీఎం జగన్ పల్నాడు రెంటపాళ్ల గ్రామ పర్యటన సందర్బంగా వైసీపీ శ్రేణులు ప్రదర్శించిన ఫ్లెక్సీలపై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యథా అధినేత.. తథా నాయకులు, కార్యకర్తలు. వైసిపి సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించ తలపెట్టిన పోలవరం-బసకచర్ల ప్రాజెక్టును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టును తిరస్కరించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామన్నారు.
జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో ఫాస్టాగ్ యాన్యూవల్ పాస్‌ను ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచి అందుబాటులోకి వస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ ద్వారా తెలిపారు.
ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఉద్రిక్తలు చోటు చేసుకున్నా, ముఖ్యంగా ఇరుగు పొరుగు దేశాల మధ్య యుద్ధ వాతావరణం, నెలకొన్న సమయంలో, ఆయా దేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్ధులను, ఇతరత్రా, ఉద్యోగ, ఉపాధి వ్యాపకాల్లో ఆయా దేశాల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు రావడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారుతున్నది.
ఇంగ్లండ్ వేదికగా 2026 జూన్ 12 నుంచి జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ రిలీజ్ చేసింది. ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో మరో అపశృతి చోటు చేసుకుంది. సత్తెనపల్లి గడియార స్థంభం వద్ద ర్యాలీలో తొక్కిసలాట జరిగింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. మళ్లీ, మళ్లీ విచారణకు పిలుస్తున్నారు. గంటలకొద్దీ ఎంక్వైరీ చేస్తూ.. ఆయన నుంచి కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా పాత్ర కానీ, ఆ దేశ అధ్యక్షుడి పాత్ర కానీ ఇసుమంతైనా లేదని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కే చెప్పారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా లోకేష్ ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా హోంమంత్రి అమిత్ షాతో లోకేష్ భేటీ దాదాపు పాతిక నిముషాలు సాగింది.
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.