Publish Date:Mar 27, 2025
వయసు మీద పడుతున్నా తనకు పెళ్లి కావడం లేదన్న మనో వ్యధతో సికింద్రాబాద్ లో ఓ యువవైద్యుడు బలవర్మణానికి పాల్పడ్డాడు. వివరాల్లో వెళితే గుజరాత్ కు చెందిన ప్రకాశ్ మాల్ బతుకుదెరువు కోసం దశాబ్దాల క్రితమే సికింద్రాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. అయితే చిన్న కుమారుడు పురోహిత్ కిషోర్ ను బాగా చదివించి డాక్టర్ చేశాడు. బస్తీ దవాఖానాలో డాక్టర్ గా పని చేస్తున్న పురోహిత్ కిషోర్ కు ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. నిశ్చితార్థ వేడుక కూడా ఘనంగా జరిగింది. అప్పటివరకు విగ్ ధరించి మేనేజ్ చేసిన పురోహిత్ పూజారీ ఈ వేడుకలోనే తన బట్టతల బయటపడటంతో అమ్మాయి కుటుంబం పెళ్లి క్యాన్సిల్ చేసింది. చాలా సంవత్సరాల నుంచి సంబంధాలు వెతుకుతున్నప్పటికీ పురోహిత్ పూజారీకి అమ్మాయిని ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దీనికి ప్రధాన కారణం అతడికున్న బట్టతల. రాకరాక వచ్చిన ఈ సంబంధం కూడా నిశ్చితార్థం తర్వాత క్యాన్సిల్ కావడంతో అబ్బాయి తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు . బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలోని క్యావలరీ బ్యారక్ రైల్వేస్టేషన్ వద్ద రైలు క్రిందపడి చనిపోయాడు. గుర్తింపు కార్డులో పురోహిత్ పూజారీ డిటైల్స్ ఉండటంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. జీవితంలో అన్ని ఎత్తు పల్లాలను అధిగమించిన ఈ యువ డాక్టర్ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తీవ్ర విషాదాన్ని నింపింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/wedding-canceled-due-to-baldness-young-doctor-commits-suicide-due-to-depression-25-195079.html
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.