Publish Date:Mar 27, 2025
వయసు మీద పడుతున్నా తనకు పెళ్లి కావడం లేదన్న మనో వ్యధతో సికింద్రాబాద్ లో ఓ యువవైద్యుడు బలవర్మణానికి పాల్పడ్డాడు. వివరాల్లో వెళితే గుజరాత్ కు చెందిన ప్రకాశ్ మాల్ బతుకుదెరువు కోసం దశాబ్దాల క్రితమే సికింద్రాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. అయితే చిన్న కుమారుడు పురోహిత్ కిషోర్ ను బాగా చదివించి డాక్టర్ చేశాడు. బస్తీ దవాఖానాలో డాక్టర్ గా పని చేస్తున్న పురోహిత్ కిషోర్ కు ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. నిశ్చితార్థ వేడుక కూడా ఘనంగా జరిగింది. అప్పటివరకు విగ్ ధరించి మేనేజ్ చేసిన పురోహిత్ పూజారీ ఈ వేడుకలోనే తన బట్టతల బయటపడటంతో అమ్మాయి కుటుంబం పెళ్లి క్యాన్సిల్ చేసింది. చాలా సంవత్సరాల నుంచి సంబంధాలు వెతుకుతున్నప్పటికీ పురోహిత్ పూజారీకి అమ్మాయిని ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దీనికి ప్రధాన కారణం అతడికున్న బట్టతల. రాకరాక వచ్చిన ఈ సంబంధం కూడా నిశ్చితార్థం తర్వాత క్యాన్సిల్ కావడంతో అబ్బాయి తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు . బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలోని క్యావలరీ బ్యారక్ రైల్వేస్టేషన్ వద్ద రైలు క్రిందపడి చనిపోయాడు. గుర్తింపు కార్డులో పురోహిత్ పూజారీ డిటైల్స్ ఉండటంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. జీవితంలో అన్ని ఎత్తు పల్లాలను అధిగమించిన ఈ యువ డాక్టర్ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తీవ్ర విషాదాన్ని నింపింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/wedding-canceled-due-to-baldness-young-doctor-commits-suicide-due-to-depression-25-195079.html
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.