వ్యాపం...మరణ మృదంగం మ్రోగుతూనే ఉంది

Publish Date:Jul 7, 2015

Advertisement

 

వ్యాపం కాదు నాగుపాము:

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపం (మధ్యప్రదేశ్ వృత్తి పరీక్షా బోర్డు) కుంభకోణంలో నానాటికీ అనుమానాస్పద మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ కుంభకోణం గురించి ఆరా తీయాలని ప్రయత్నించిన వాళ్ళు లేదా అందుకు సహకరించిన వారు ఒకరొకరుగా అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్నారు. ఇంతవరకు ఈ కుంభకోణంలో 45మంది వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించడంతో దేశంలో పెద్ద సంచలనం కలిగిస్తోంది.

 

వ్యాపం అంటే ఏమిటి?

వ్యాపం ద్వారా రాష్ట్రంలో ఉపాద్యాయులు, కానిస్టేబుల్స్, మెడికల్ ఆఫీసర్లు, అటవీశాఖ గార్డులు తదితర అనేక ఉద్యోగాల భర్తీకి, ఉన్నత వృత్తి విద్యాసంస్థలలో ప్రవేశాలకి ఈ బోర్డు అద్వర్యంలో పరీక్షలు నిర్వహించబడతాయి.

 

ఈ భాగోతం ఎప్పడు మొదలయిందంటే...

ప్రభుత్వోద్యోగాలలో నియామకాలు కాబట్టి సహజంగానే లక్షల కోట్లు లంచాలు పంచుకొనే అనేకమంది ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, దళారులు ఈ వ్యాపం బోర్డుని తెరవెనుక నుండి శాశిస్తున్నారు. ఈ వ్యాపం బోర్డులో చాలా అవక తవకలు జరుగుతున్నాయని 1990 సం.లోనే పిర్యాదులు వచ్చేయి. కానీ 2000 సం.లో వరకు వాటిపై ఎటువంటి విచారణ కానీ కేసు నమోదు చేయడం గానీ జరగలేదు.

 

కమిటీలు విచారణలు:

మొట్టమొదటిసారిగా2000 సం.లో యఫ్.ఐ.ఆర్ నమోదు అయింది. కానీ 2009సం. వరకు కూడా ఆ కేసులో పెద్దగా కదలిక కనబడలేదంటే, తెర వెనుక ఎన్ని పెద్ద తలకాయలు పనిచేస్తున్నాయో అర్ధమవుతుంది. 2009సం.లో వ్యాపం బోర్డు నిర్వహించిన ప్రీ-మెడికల్ టెస్ట్ పై ఆరోపణలు వెల్లువెత్తడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీని వేయగా అదే సుమారు రెండేళ్ళ పాటు అధ్యయనం చేసి 2011సం.లో తన నివేదికని సమర్పించింది.

 

లంచావతారాలు ఎన్నో!

ఆ నివేదిక ఆధారంగా సుమారు 100 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. మళ్ళీ 2012సం.లో దీనిపై ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేశారు. అది ఒక ఏడాది అద్యయనం చేసిన తరువాత వ్యాపం బోర్డులో జరుగుతున్న అవకతవకలలో గవర్నర్ రామ్ నరేష్ యాదవ్, ఆయన కుమారుడు శైలేష్ యాదవ్, గవర్నర్ వద్ద పనిచేసే ఆఫీసర్-ఆన్-స్పెషల్ డ్యూటీ ధనరాజ్ యాదవ్, రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి లక్ష్మి కాంత్ శర్మ తదితరులతో సహా అనేకమంది రాజకీయ నాయకుల, ఉన్నతాధికారుల, వ్యాపారుల ప్రమేయం ఉందని తెలియజేస్తూ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. అది చేతికి అందిన మూడు సం.ల తరువాత ఈ వ్యాపం కుంభకోణం తో సంబంధం ఉందని భావిస్తున్న ధనరాజ్ యాదవ్ తో సహా మొత్తం 2000 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. వారిలో 100 మందికి పైగా రాజకీయ నాయకులున్నారు.

 

అరెస్టయిన వారిలో అనేకమంది బడా వ్యాపారవేత్తలు చివరికి విద్యార్ధులు, వారి తల్లితండ్రులు కూడా ఉండటం గమనిస్తే వ్యాపం బోర్డులో అవకతవకలు ఏస్థాయిలో జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చును. అప్పుడు గవర్నర్ తో సహా వారందరి మీద కేసులు నమోదు చేయబడగా గవర్నర్ మాత్రం తనకున్న రాజ్యాంగ రక్షణ కవచం ఉపయోగించుకొని బయటపడ్డారు. కానీ ఆయన కుమారుడు శైలేష్ యాదవ్ కూడా అనుమానాస్పద పరిస్థితిలో మరణించారు. కానీ వచ్చే ఏడాది సెప్టెంబర్ లో గవర్నర్ పదవీ విరమణ చేసిన వెంటనే మళ్ళీ ఆయనపై కేసు నమోదు చేసి విచారణ మొదలు పెడతామని సిట్ అధికారులు స్పష్టం చేసారు.

 

మరణ మృదంగం మ్రోగుతూనే ఉంది!

ఈ కుంభకోణంలో అరెస్టులు ఏ స్థాయిలో ఉన్నాయో అనుమానాస్పద మరణాలు అదే విధంగా ఉన్నాయి. ఈ కుంభకోణంలో ఇంతవరకు మొత్తం 45మంది చాలా అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు.ఈ వ్యవహారం నానాటికీ తీవ్ర రూపం దాల్చుతుండటంతో దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసి సూత్రధారులను కనుగొనేందుకు కొన్ని నెలల క్రితం మధ్యప్రదేశ్ హైకోర్టు ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’ (సిట్) ఏర్పాటు చేసింది. ఒకవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుంటే మరొకవైపు అనుమానాస్పద మరణాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి.

 

ఈ వ్యవహారం రాన్రాను విషమిస్తుండటంతో సుప్రీంకోర్టులో దానిపై కొందరు న్యాయవాదులు, ఆమాద్మీ పార్టీ నేతలు మరికొందరు ఇతర వ్యక్తులు పిటిషన్లు వేసారు. వాటిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి హెచ్.యల్. దత్తు, జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్ర మరియు జస్టిస్ అమితావ రాయ్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసును 9వ తేదీన విచారణకు చేప్పట్టబోతోంది. కానీ వ్యాపం మరణ మృదంగం మారుమ్రోగుతూనే ఉంది.

 

మొట్టమొదట 2009సం.నుండి 2014సం.వరకు మొత్తం 14మంది బ్రోకర్లు, ఆరుగురు విద్యార్ధులు, ముగ్గురు విద్యార్ధుల తండ్రులు, ఇద్దరు పోలీస్ అధికారులు, ఒక జర్నలిస్ట్ (అజ్ తక్ హిందీ న్యూస్ ఛానల్ విలేఖరి), జబల్ పూరులో యన్.యస్. మెడికల్ క్లాలేజి డీన్ అరుణ్ శర్మ తో సహా అనేకమంది అనుమానాస్పద స్థితిలో మరణించారు.

 

ఈ దారుణపరిస్థితి చూసి మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ప్రస్తుత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి మాట్లాడుతూ “ఈ వ్యాపం వ్యవహారంలో నాపైన కూడా యఫ్.ఐ.ఆర్. నమోదు చేయబడి ఉంది కనుక ఏదో ఒకరోజు నేను కూడా చనిపోతానేమో?”అని భయం వ్యక్తం చేసారంటే పరిస్థితి ఎంత తీవ్రత అర్ధమవుతుంది.

 

దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని, దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీతో సహా అనేకమంది కోరుతున్నారు.

By
en-us Political News

  
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.