విజయసాయికి షాక్.. ఆర్ఆర్ఆర్ ఎఫెక్టేనా?

Publish Date:Dec 8, 2022

Advertisement

వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కేంద్రం  షాకిచ్చింది. రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్ పేర్ల జాబితా నుంచి ఆయన పేరును తొలగించింది. ముందుగా ప్యానల్ లో ఆయన పేరును ప్రకటించి, రెండు రోజుల వ్యవధిలోనే తొలగించింది. తొలుత  ప్రకటించిన రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ జాబితాలో విజయసాయి రెడ్డి  పేరు ఉంది.

దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. పలు ఆర్థిక నేరాల కేసుల్లో విజయసాయి రెడ్డి ఏ2గా ఉన్నారు, ఆయనను రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ జాబితాలో ఎలా చేరుస్తారంటూ ప్రశ్నలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పేరును తొలగించారు. తొలుత ఎనిమిది మంది పేర్లతో విడుదల చేసిన జాబితాలో విజయసాయికి స్థానం దక్కింది. అయితే ఆ తరువాత రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ సభ్యులను వెల్లడించే సమయంలో రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీష్ ధన్కఢ్ కేవలం ఏడుగురి పేర్లు మాత్రమే చదివారు. ఆయన చదివిన పేర్లలో వైసీపీ ఎంపీ విజయసాయి పేరు లేదు. ఆయనను రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ జాబితా నుంచి తొలగించారు.

అయితే విజయసాయి రెడ్డిని రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ జాబితా నుంచి తొలగించడానికి కారణాలేమిటన్నది మాత్రం రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీష్ ధన్కఢ్  వెల్లడించలేదు. ఈ ప్యానెల్ జాబితాలో తన పేరు ఉన్నట్లు తెలియగానే విజయసాయి స్పందించారు. ఉపరాష్ట్రపతికి కృతజ్ణతలు తెలిపారు.  సభ నిర్వహణలో పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే హఠాత్తుగా ప్యానల్ జాబితా నుంచి ఆయనను తొలగించడంపై మాత్రం ఇంత వరకూ ఆయన స్పందించలేదు.

అయితే ఈ జాబితా నుంచి విజయసాయిరెడ్డి పేరు తొలగించడంపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు (ఆర్ఆర్ఆర్) ఫిర్యాదు కారణంగానే విజయసాయి పేరును తొలగిస్తూ రాజ్యసభ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. విజయసాయి సామాజిక మాధ్యమంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రఘురామకృష్ణంరాజు ఇటీవల రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఆ ఫిర్యాదులో ప్యానల్ జాబితా నుంచి విజయసాయిరెడ్డిని తొలగించాలని రఘురామ కోరారు. దీంతో విజయసాయి తొలగింపు వెనుక రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు ఉందని అంటున్నారు. అయితే రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ జాబితా నుంచి తన పేరు తొలగింపుపై విజయసాయి రెడ్డి స్పందన ఏమిటనేది తెలియాల్సి ఉంది.  

By
en-us Political News

  
ప్రస్తుతం ఏపీ రాజ‌కీయాల్లో స‌వాళ్ల ప‌ర్వం స్టార్ట్ అయింది. ప్ర‌చారంలో ప్రధాన పార్టీల నేత‌లు మాట‌ల‌ ప‌దును పెంచుతున్నారు. రాజ‌కీయ స‌వాళ్ళు, ప్ర‌తిస‌వాళ్ళ‌తో నేత‌లు, ఓట‌ర్ల‌ను వినోదాన్ని పంచుతున్నారు. “హాష్ ట్యాగ్ బ్యాండైడ్ ఛాలెంజ్” పేరుతో ట్విట్టర్ లో ఛాలెంజ్ విసురుకుంటున్నారు.
కోడలికి బుద్ధి చెప్పి అత్త మూకుడు నాకిందనే సామెత తెలుగువారందరికీ తెలిసే వుంటుంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన రాజకీయ ఉత్కంఠ, టెన్షన్ భరిత వాతావరణం చాలదన్నట్టుగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అగ్నిలో ఆజ్యం పోశారు.
వల్లభనేని వంశీ నామినేషన్ దాఖలు చేసిన రోజునే ఓటమిని అంగీకరించేశారా? అంటే పరిశీలకలు ఔననే అంటున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించడం ద్వారా తనకు గెలుపు ఆశలు ఆవిరి అయిపోయాయని చెప్పకనే చెప్పేశారు.
డోన్ నియోజకవర్గం వైైసీసీ అభ్యర్థి మంత్రి  బుగ్గన నామినేషన్ పెండింగ్లో పడింది.   మంత్రి బుగ్గన రాజేంద్రనాథ నామినేషన్ ను ఆర్వో పెండింగ్ లో ఉంచారు.
ఏపీ ఎన్నికల సందర్భంగా జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కమెడియన్ హైపర్ ఆది ప్రచారం చేస్తున్నారు.
హిందూపురం తెలుగుదేశం అభ్యర్థిగా బాలకృష్ణ భార్య వసుంధర నామినేషన్! అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
ఓ వైపు ప్రజా వ్యతిరేకత, మరో వైపు చెల్లెళ్ల విమర్శలు, ఇంకో వైపు పార్టీ నుంచి పెరిగిపోతున్న వలసలు, వెరసి ఓటమి భయంతో జగన్ వణికి పోతున్నారా? ఆఫ్రస్ట్రేషన్ లో సొంత చెల్లెలిపైనే అనుచిత వ్యాఖ్యలు చేసి తనకు తానే నష్టం చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
ఏంటమ్మా జగనూ... మొన్న చెల్లి షర్మిలమ్మ ఎలక్షన్ కమిషన్ దగ్గర అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు చూశాంలే..
కేసీఆర్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్ ను పండించేందుకు నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కారణాలేమైతేనేం చాలా రోజుల పాటు ఎక్కడా బహిరంగంగా మాట్లాడని ఆయన ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రజల ముందుకు వచ్చారు.
గుడివాడ, గన్నవరం.. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ రెండు చోట్లా కూడా వైసీపీ అభ్యర్థుల తీరు, భాష పట్ల ఆయా నియోజకవర్గాలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ వైసీపీ గాంభీర్యం పదర్శిస్తూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నది.
ఏపీలో భానుడు చండ్ర నిప్పులు చెరుగుతున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.