తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రిగ కజగం (టీవీకే) రెండు దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా ఉన్న ద్రావిడ పార్టీలను చిత్తు చేసి ఏకంగా అధికార పీఠాన్ని దక్కించుకుంది. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టడంతో తమిళ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. అక్కడ జరుగుతున్న ప్రతి చిన్న రాజకీయ పరిణామం దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు తెరలేపుతోంది. తాజాగా అప్పు డే రాబోయే 2031 అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలపై పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. ఐదేళ్ల తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు విజయ్ వర్సెస్ అన్నామలై గా మారతాయంటూ విశ్లేషకులు పెద్ద చర్చకు తెరలేపారు.
అయితే వాదనలు, చర్చ, క్షేత్రస్థాయిలో ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయనే దానిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. నూతన సీఎం విజయ్ ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ల ముందుగానే తన రాజకీయ పార్టీని ప్రకటించి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా.. ఆరెండేళ్లూ.. నిరంతరం ప్రజల్లోనే తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
మరోవైపు బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన భవిష్యత్తు రాజకీయ చిత్రంపై ఇప్పటికీ స్పష్టత కొరవడింది. ఒకప్పుడు కర్ణాటక క్యాడర్ లో సమర్థుడైన ఐపీఎస్ అధికారిగా సేవలందించిన అన్నామలై.. తన సివిల్ సర్వెంట్ పదవికి రాజీనామా చేసి మరీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. కమలం పార్టీలో చేరిన వెంటనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో దూకుడు నిర్ణయాలతో ఆకట్టుకున్నారు. గతంలో డిఎంకె ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఒక నిరసనలో బహిరంగంగా తనను తాను కొరడాతో కొట్టుకుని దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించారు. అయితే ప్రస్తుతం ఆయన బీజేపీని వీడడంతో ఆయన రాజకీయ పయనం ఎటు వైపు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఒకవేళ అన్నామలై సొంతంగా ముందుకు సాగినా విజయ్ స్థాయిలో ప్రజాదరణను, ఓట్లను సాధించడం దాదాపు అసాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఒక జాతీయ పార్టీలో పనిచేసి, దానిని వీడి తన రాజకీయ అపరిపక్వతను ఆయనంతట ఆయనే స్వయంగా బయటపెట్టుకున్నారంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి విజయ్ వెనుక కోట్లాది మంది అభిమానులు, బలమైన కేడర్ ఉండి ఓట్లు వేసి గెలిపించారు. కానీ.. అన్నామలైకి ఆ స్థాయిలో ఓట్లు వేసి గెలిపించే ఓటు బ్యాంక్ లేదని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijay-vs-annamalai-in-tamilnadu-39-221612.html
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.