కాంగ్రెస్ కలను వెంకయ్య నాయుడు సాకారం చేస్తారా?

Publish Date:Jan 31, 2013

Advertisement

 

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి మోడీ వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధి అంటూ మీడియాలో వార్తలు వస్తున్ననేపద్యంలో, మొన్నఆయన కొత్తగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రాజ్ నాథ్ సింగ్ ను కలవడానికి డిల్లీ రావడం ప్రాదాన్యతని సంతరించుకొంది. మూడు నాలుగు గంటలకు పైగా సాగిన వారి సమావేశం అనంతరం, పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అయన అభ్యర్దిత్వం గురించి ప్రత్యేకంగా ఏమి మాట్లాడకపోయినప్పటికీ, మీడియాతో మోడీకు అనుకూలంగానే మాట్లాడారు.

 

ఆ మరునాడే, ఆ పార్టీకే చెందిన సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కూడా మోడీ అభ్యర్దిత్వాన్ని సమర్దిస్తూ మాట్లాడారు. తరువాత, బీజీపీ నుండి సస్పెండ్ చేయబడ్డ రామ్ జేత్మలానీ కూడా మోడీ లౌకికవాది, అతని నాయకత్వంలోనే పార్టీ ఎన్నికలను ఎదుర్కోవడం మంచిదని అన్నారు.

 

అయితే, పార్టీ ఇంతవరకు మోడీ అభ్యర్దిత్వాన్నిఖరారు చేయనప్పటికీ, అప్పుడే ఆయనకు వ్యతిరేఖంగా మరోవర్గం ప్రచారం మొదలు పెట్టింది. పార్టీలో సీనియర్ నాయకుడు వెంకయ్య నాయడు నిన్న మీడియా వారితో మాట్లాడుతూ “అద్వాని, నేను, సుష్మ స్వరాజ్ తో సహా పార్టీలో చాలామందే ప్రధాని పదవికి అర్హులయినవారున్నారు. కానీ, ఈ విషయం గురించి పార్టీలో చర్చించి తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకొంటాము,” అని అన్నారు.

 

భారతీయ జనతాపార్టీ ఉన్న ప్రస్తుత పరిస్థితులలో, ఆ పార్టీని వచ్చేఎన్నికలలో నరేంద్ర మోడీ తప్ప మరొకరు గట్టేకించలేరు అని వారికీ తెలిసినప్పటికీ కూడా కాంగ్రెస్ ను అవలీలగా ఓడించి డిల్లీ పీటాన్ని కైవసం చేసుకోగలమని వారు నమ్ముతున్నారు.

 

కానీ, కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలను రాహుల్ గాంధీ నేతృత్వంలో, అతనిని తమ పార్టీ ప్రధాని అభ్యర్ధిగా నిలిపి ముందుకు సాగాలనుకొంటునందున ఆ పార్టీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొనిపనిచేస్తుంది. అటువంటప్పుడు, దేశ వ్యాప్తంగా మంచి పేరు పొంది, రాహుల్ గాంధీని దీటుగా ఎదుర్కోగల నరేంద్ర మోడీని కాదనుకొని, ఏంతోకాలంగా ప్రధాన పదవిని అధిష్టించాలని ఆశపెట్టుకొన్న వయసుమీరిన లాల్ కృష్ణ అద్వానీ, లేదా ఏవిధమయిన ప్రత్యేకత లేని వెంకయ్య నాయుడు, సుష్మ స్వరాజ్ వంటి నేతలను ముందుంచుకొని భారతీయ జనతా పార్టీ గనుక ఎన్నికలకు వెళితే ఫలితాలు ఎలా ఉంటాయో వేరేగా చెప్పనవసరం లేదు.

 

నిజం చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీ కూడా మోడీ కాకుండా వేరేవరయినా ఆ పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తే తనకీ లాభం అని కోరుకొంటోంది. కాంగ్రెస్ కోరికని వెంకయ్య నాయుడు వంటి వారు సాకారం చేస్తారేమో చూడాలి మరి.

By
en-us Political News

  
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్ర‌జ‌ల్లో సంతృప్తి పెంచేలా వ్య‌వ‌హ‌రించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ పట్లే కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. ఇంత కాలం తన వెన్నంటి ఉండి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. పార్టీ అధినేతపైనా, అధినేత కుటుంబంపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిలాండి భువనేశ్వరిని సైతం దుర్భాషలాడారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.