Publish Date:May 10, 2024
పాయకరావు పేట తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట లాంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ టీడీపీ అభ్యర్థులు ఏడుసార్లు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నాలుగుసార్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు విజయం సాధించాయి. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో అంటే 2014లో పాయకరావు పేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి వంగలపూడి అనిత విజయం సాధించారు.
అయితే 2019 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ విజయం సాధించింది. అయితే ఆ ఎన్నికలలో వంగలపూడి అనిత పాయకరావు పేట నుంచి పోటీ చేయలేదు. ఆమె పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పోటీ చేశారు. అక్కడ ఆమె తానేటి వనిత చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఓటమితో ఆమె కుంగిపోలేదు. పార్టీలో మంచి వాగ్ధాటి కలిగిన నేతగా ఎదిగారు. వైసీపీ వేధింపులను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ సారి అంటే 2024 ఎన్నికలలో ఆమె మళ్లీ పాయకరావు పేట నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా అనితకు మంచి గుర్తింపు ఉంది. అదీ కాకుండా వైసీపీ దాష్టికాలను ఎదుర్కొని ప్రజల మన్ననలు కూడా పొందారు. వైసీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లు టీడీపీకి చెందిన మహిళా నేతలు ఎటువంటి వేధింపులకు గురయ్యారో అందరికీ తెలిసిందే. తెలుగుదేశం మహిళా నేతల చిత్రాలను మార్ఫింగ్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అసభ్య వ్యాఖ్యలతో మానసికంగా కుంగదీసే ప్రయత్నం చేయడం వైసీపీ సోషల్ మీడియా వింగ్ కు పరిపాటిగా మారింది. అయితే అటువంటి వేధింపులన్నిటీనీ ఎదుర్కొని వంగలపూడి అని గట్టిగా నిలబడ్డారు. పార్టీ తరఫున వాయిస్ వినిపించే బలమైన నాయకురాలిగా గుర్తింపు పొందారు. పాయకరావు పేట రిజర్వ్డ్ నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ కాపు సామాజికవర్గం ఓట్లు కూడా చెప్పుకోదగ్గ స్ధాయిలో ఉన్నాయి. అలాగే బీసీ ఓట్లు కూడా అధికమే. నియోజకవర్గంలోని 18 తీర గ్రామాల్లో మత్స్యకారుల ఓట్లు ఇక్కడ గెలపు ఓటములను ప్రభావితం చేస్తాయి.
వంగలపూడి అనిత తన వ్యక్తిత్వంతో, సవాళ్లను దీటుగా ఎదుర్కొని పాయకరావుపేటలో బలమైన పునాది వేసుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో పాయకరావు పేటలో ఆమెకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురుకావడంతో పార్టీ అధినేత చంద్రబాబు ఆమెను నియోజకర్గం మార్చారు. అయితే ఈ సారి ఆమెకు సొంత పార్టీ నుంచి పాయకరావు పేటలో సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అలాగే నియోజకవర్గ ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఈ సారి పాయకరావు పేటలో మరో సారి తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vangalapudi-anitha-gain-public-suppourt-in-payakaraopeta-25-175525.html
తెలంగాణ రాష్ట్రం దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ రాష్ట్ర మంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ని ‘తెలంగాణ జిన్నా’ అని అభివర్ణించారు.
హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్కి బంధం నేటితో తెగిపోనుంది..
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఎపి కూడా నైరుతి రుతు పవనాలు రానున్నాయని సంకేతాలు అందుతున్నాయి.
ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలతో పల్నాడు అట్టుడికి పోయింది. ముఖ్యంగా మాచర్లలో అల్లర్లు దేశం యావత్ దృష్టికి వచ్చాయి. మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ను ధ్వంసం చేసి వార్తల్లో వ్యక్తి అయ్యారు.
ప్రత్యేక తెలంగాణ బిల్లు కాంగ్రెస్ పెడితే బిజెపి ఆమోదించింది. పదేళ్ల తర్వాత జరుపుకుంటున్న తెలంగాణ అవతరణ దినోత్సవాలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. మెజారిటీ మార్కుకు అవసరమైన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఏకగ్రీవంగా పది స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. 33 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్లు ఈసీ ప్రకటించింది.
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. నేటి అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలను పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్ హెచ్ఐఏ) ప్రకటించింది.
ఎపిలో త్రి కూటమి విజయం తథ్యమని ముందు నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో బోణి కొట్టిన బిఆర్ఎస్
నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన బిఆర్ఎస్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బోణి కొట్టింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు రెండు రోజుల ముందు వచ్చిన ఫలితాల్లో గులాబి జెండా రెపరెపలాడటం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు.
నారా చంద్రబాబునాయుడు ప్రజలకు కష్టాలలోనూ, సంక్షోభంలోనూ గుర్తుకు వచ్చే నేత. కష్టాల నుంచీ, సంక్షోభం నుంచీ తన దార్శనికతతో రాష్ట్రాన్ని గట్టెక్కించగల నాయకుడిగా ఏపీ ప్రజలు నమ్మే నేత చంద్రబాబునాయుడు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజా విశ్వసనీయతను చూరగొన్న చంద్రబాబు.. ఇప్పటి వరకూ అధికారంలో కన్నా విపక్ష నేతగానే ఎక్కువ కాలం ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికే పట్టం కట్టారని ‘తెలుగువన్’ ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఏపార్టీ అధికారంలోకి వస్తుంది? గెలిచే అభ్యర్థులు ఎవరు..? ఓటమి చవిచూసే వారు ఎవరు? అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి.. అధికార పార్టీ వైసీపీ నుంచి ఓడిపోనున్న ప్రముఖులు ఎవరు? అనే ఉత్కంఠ ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతిఒక్కరిలో నెలకొంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. మరోసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా..? చంద్రబాబు సీఎం సీటును అదిరోహించబోతున్నారా? ఓటర్లు ఎవరికి మద్దతు ఇచ్చారు..? అనే విషయాలపై ఏపీ ప్రజల్లోనేకాదు, దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.