జగన్ సర్కార్ పై ఉద్యోగుల ఆగ్రహానికి నిదర్శనం.. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సునామీ!

Publish Date:May 10, 2024

Advertisement

వైపీపీ ఓటమి తథ్యమన్న బలమైన సంకేతాన్ని ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్  ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 90శాతం మందికి పైగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. గతంలో ఎన్నడూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 77 శాతం మించిన దాఖలాలు లేవు. అంతెందుకు పొరుగు రాష్ట్రం తెలంగాణలో గతం కంటే తక్కువ మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఉద్యోగులు ఉప్పెనలా కదలి వచ్చి మరీ తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు. 
ఈ క్రమంలో వారెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు తమ ఓటు ఎక్కడ వేయాలన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇక్కడ కాదు అక్కడ అంటూ తిప్పారు. కొందరు అధికారులు వారి పని ప్రదేశంలోనే వారి ఓటు ఉంటుందని చెబితే మరి కొందరేమో వారు నివసించే ప్రాంతంలోనే వారి ఓటు ఉంటుందని చెప్పారు. ఈ గందరగోళం కారణంగా కొందరు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకోలేకపోయారు. మరి కొందరి ఓట్లు గల్లంతయ్యాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ల లో సౌకర్యాలు లేవు. ఇన్ని కష్టాల మధ్య కూడా 90శాతం మందికి పైగా ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

2019 ఎన్నికలలో 77 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైతే.. వాటిలో వైసీపీకి 1.34 లక్షలు, తెలుగుదేశంకు 80 వేలు, జనసేనకు 11 వేలు, బీజేపీకి నాలుగువేల ఓట్లు వచ్చాయి.  అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి అత్యధికంగా 90శాతానికి పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇంత అధికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలు కావడమే వైసీపీని ఖంగారు పెడుతోంది. ఆందోళనకు గురి చేస్తోంది. జగన్ సర్కార్ ఉద్యోగులను నానా విధాలుగా వేధించింది. వారి పీఎఫ్ డబ్బులను మళ్లించడం దగ్గర నుంచి అన్ని విధాలుగా వారిని వేధింపులకు గురి చేసింది. చులకనగా చూసింది. మద్యం దుకాణాల దగ్గర కాపలాగా పెట్టింది. అసలు మీరేం పని చేస్తున్నారని సమయానికి వేతనాలు, అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ ప్రశ్నించింది. చివరాఖరికి వారి అటెండెన్స్ విషయంలో కూడా ఫేస్ రికగ్నేషన్ అంటూ ఇబ్బందులకు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అనేక కష్టనష్టాలకు ఓర్చి కూడా ఎలాగైనా ఓటు వేసి తీరాలన్న సంకల్పంతో పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకోవడం వైసీపీ పట్ల వారికి ఉన్న ఆగ్రహాన్ని, ఎలాగైనా ఆ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న పట్టుదలనూ సూచిస్తోంది. వైసీపీలో అందుకే ఆందోళన వ్యక్తం అవుతోంది. 

తాము సృష్టించిన సచివాలయ ఉద్యోగులు వైసీపీకే ఓట్లు వేస్తారని జగన్ సర్కార్ ఆశలు పెట్టుకంది. అయితే సచివాలయ ఉద్యోగులలో కూడా జగన్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి కనిపిస్తోంది. పేరుకు ప్రభుత్వ ఉద్యోగమే అయినా పని ఎక్కువ వేతనం తక్కువ ఉండటంతో వారు కూడా జగన్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  

మొత్తం మీద జగన్ పాలనలో తాము ఎదుర్కొన్న కష్టాలు, అనుభవించిన బాధలు, ఎదుర్కొన్న అవమానాలు.. ఇలా అన్నిటికీ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుని బదులు తీర్చేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉద్యోగులు, టీచర్ల ఆగ్రహమే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సునామీగా మారిందని అంటున్నారు. గత ఎన్నికల ముందు అప్పటికి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన తరువాత తుంగలో తొక్కారనీ, హామీలు నెరవేర్చడం, వాగ్దానాలు అమలు చేయడం సంగతి అటుంచి కనీసం ఒకటో తారికు నాటికి వేతనాలు వస్తే చాలు భగవంతుడా అని వేడుకునే స్ధితికి ఉద్యోగులను తీసుకువచ్చిన జగన్ ప్రభుత్వంపై వారి ఆగ్రహం ఓటుగా మారిందని అంటున్నారు. 

  ఉద్యోగుల ఆగ్రహాన్ని గమనించిన  వైసీపీ నాయకులు  ఏకంగా ఉద్యోగస్తులు పాదాల మీద ఓటు వేయమంటూ బతిమలాడుకుంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.   దీనిని బట్టే ఉద్యోగుల ఆగ్రహజ్వాలల సెగ వైసీపీకి ఎంత గట్టిగా తగిలిందో అర్ధమౌతోందంటున్నారు పరిశీలకులు. 

By
en-us Political News

  
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు పెద్ద సమస్య వచ్చిపడింది. క్యాట్‌ తీర్పు ఇచ్చినా ఆయనకు పోస్టింగ్ దక్కలేదు. ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినా స్పందన లేదు. ఈ నెల 31తో ఆయన పదవీకాలం పూర్తి కాబోతోంది. 2019 ఎన్నికల తర్వాత, ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ లేకుండా పోయింది
 తెలుగు మహిళ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. సప్త సముద్రాలు దాటిన ఈ వనిత భారత దేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింజేసింది. 
 ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం పొడిగించింది
ప్రస్తుతం జగన్ భయంతో వణికిపోతున్నారు. అధికారం పోయిన తర్వాత తన పరిస్థితి ఏమిటి? తన మీద వున్న కేసుల పరిస్థితి ఏమిటి? జైలుకు వెళ్ళక తప్పదా? హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు సమాధానం దొరికితే ఏం జరుగుతుంది. అయిదేళ్ళపాటు మహారాజులా బతికిన తాను జూన్ 4 నుంచి ఎలా బతకాలి...
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరగ్గా, పలువురు పోలీసు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. బదిలీ అయిన వారి స్థానంలో ఈసీ నేడు కొత్త నియామకాలు చేపట్టింది. డీఎస్పీలుగా ఐదుగురిని, ఇన్ స్పెక్టర్లుగా ఏడుగురిని నియమిస్తూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
జనం మొగ్గు ఎటువైపు ఉంది.. ఏ పార్టీ పట్ల జనంలో అభిమానం మెండుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కార్ ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ గద్దె ఎక్కుతుందా? లేక పరాజయం పాలై అధికారం కోల్పోతుందా వంటి ప్రశ్నలకు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే సర్వేల మీద ఆధారడుతుంది.
ప్రభుత్వ అవినీతి, అక్రమాలతోపాటు ముఖ్య కారణంగా చెప్పుకోవలసింది ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్’. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ యాక్ట్ ద్వారా తమ భూములకు మొగుడై కూర్చుంటాడన్న భయం జనాన్ని వేధించింది. అందుకే అతన్ని సాగనంపేలా తీర్పు చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగానూ, ఆ తరువాత కొన్ని ప్రాంతాలలో హింస చెలరేగింది. దీంతో ఆయా ప్రాంతాలలో పరిస్థితిని అదుపు చేయడానికి నిరవధికంగా 144వ సెక్షన్ విధించారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రజల తీర్పు ఎలా ఉందో చెప్పడానికి ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఫలితం చూస్తే సరిపోతుందని అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ ఇదే ఓరవడి కొనసాగుతూ వస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రజల ఆదరణ పొందిన పార్టీయే అధికారంలోకి వచ్చింది. ఈ
 తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు. టెట్ పరీక్షలు సోమవారం  నుంచి జూన్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కవిత.. సుమారు 46 రోజులుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. కోర్టు అనుమతితో పలు పుస్తకాలను చదువుతూ... ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు.
పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేదీ సినిమాలో చివరి పంచ్ మనదైతే ఆ క్కిక్కే వేరప్పా అని ఓ డైలాగ్ ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ అలాంటి కిక్ నే ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు.
 ఎపిలో సర్వేలన్నీ త్రికూటమి వైపే ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ అధికారంలో రాబోతుందని జోస్యం చెబుతున్నాయి. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇదే విషయం చెబుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేతలు కూడా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. ఏపీలో కూటమి విజయం సాధించబోతోందని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ జోస్యం చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.