ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టుగా తయారైంది వల్లభనేని వంశీ పరిస్థితి. ప్రొడ్యూసర్గా హిట్ సినిమా తీసి, ఎమ్మెల్యేగా హవా నడిపి, అధికార పార్టీ నాయకుడిగా మకుటం లేని మహారాజులా చెలామణి అయి, అధికారం తెచ్చిన అహకారంతో అడ్డమైన వాగుడు వాగిన వల్లభనేని వంశీ బతుకు చివరికి దొంగ బతుకైపోయింది. తెలుగుదేశం పార్టీ ఆఫీసును ధ్వంసం చేసిన కేసులో అరెస్టు చేయడానికి పోలీసులు రెడీ అయ్యేసరికి వల్లభనేని వంశీ అమెరికాలోని డల్లాస్కి పారిపోయినట్టు తెలుస్తోంది. డల్లాస్లో దొంగలాగా నక్కినక్కి తిరుగుతున్న వల్లభనేని వంశీ కొంతమంది తెలుగువాళ్ళ కళ్ళలో పడ్డాడని, సాటి తెలుగువాడు కదా అని వాళ్ళు పలకరించే ప్రయత్నం చేస్తే, అక్కడ నుంచి గబగబా వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. వల్లభనేని వంశీ పనికిమాలిన వాడు అని ఆల్రెడీ అందరికీ తెలుసు... పిరికివాడు కూడా అనే విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది.
‘‘స్థానబలిమే కాని తనబలిమి కాదయా.. విశ్వదాభిరామ వినుర వేమ’’ అని వేమన చెప్పినట్టు, ఈ వైసీపీ చెత్తగ్యాంగ్కి అధికారంలో వున్నప్పుడే ధైర్యం వుంది తప్ప, అధికారం పోగానే అందరూ పిరికి సన్నాసులు అయిపోయారు. వైసీపీ అధికారంలో వున్నప్పుడు ‘చంద్రబాబు ఏమీ పీకలేడు’ అనే స్థాయి డైలాగులు, సవాళ్ళు విసిరిన వల్లభనేని వంశీకి, అధికారం పోగానే తనది బలుపు కాదని అర్థమైంది. తాను నిజమైన శక్తివంతుడు కాదని, స్థానబలంతో అరిచే ఊరకుక్కకి, తనకి ఎంతమాత్రం తేడా లేదనే విషయం అవగతం అయింది. అందుకే, ఒక చిన్న కేసుకు భయపడి పారిపోయాడు. టీడీపీ ఆఫీసు మీద దాడి చేయించిన కేసులో మహా అయితే ఏం చేస్తారు? పడితే కొద్ది నెలలపాటు జైలు శిక్ష పడుతుంది. అంతేతప్ప తల తీసి మొలేయరు కదా? వల్లభనేని వంశీకి బాస్ జగన్ 16 నెలలో జైల్లో గడిపి, హ్యాపీగా నవ్వుకుంటూ బయటకి వచ్చాడు. ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని కొద్ది నెలలపాటు జైల్లో వుండలేనంత పిరికిసన్నాసి వల్లభనేని వంశీ. టీడీపీ ఆఫీసు మీద దాడి చేయించిప్పుడు చూపించిన తెగువలో వన్ పర్సెంట్ కూడా లేకుండా పోయింది ఈ పిరికి పిల్లికి!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vallabhaneni-vamsi-in-dallas-39-182263.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.