త్రిశంకు స్వర్గంలో వల్లభనేని వంశీ

Publish Date:Mar 29, 2013

Advertisement

 

కర్ణుడి చావుకి వేయి కారణాలన్నట్లు విజయవాడ అర్బన్ అధ్యక్ష పదవి నుండి తొలగింపబడటానికి వల్లభనేని వంశీకి కూడా అన్నే కారణాలున్నాయని చెప్పవచ్చును. అన్నిటి కంటే ప్రప్రదానంగా చెప్పుకోవలసింది ఆయన దుందుడుకు స్వభావం, ఎవరినీ ఖాతరు చేయని లక్షణం అని పార్టీ కార్యకర్తలు అంటారు. తత్ఫలితంగా కృష్ణా జిల్లాలో ఆయనను వ్యతిరేఖించేవారే ఎక్కువయిపోవడంతో ఆయన పదవి కోల్పోయారని చెప్పవచ్చును. ఆయనను వ్యతిరేఖించే వారిలో మైలవరం శాసన సభ్యుడు మరియు కృష్ణ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావు, కేశినేని నాని ఉన్నారు. వీరిరువురి ఒత్తిడి వలనే చంద్రబాబు వంశీని విజయవాడ అర్బన్ అధ్యక్ష పదవి నుండి తప్పించి, దానిని కేశినేని నాని అనుచరుడయిన నాగుల్ మీరాకు కట్టబెట్టారు.

 

పార్టీకి ఆయన చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని వంశీకి తెదేపా కార్య నిర్వాహక సంఘానికి కార్యదర్శిగా పదవి ఇచ్చినపటికీ, గత ఏడాది ఓదార్పు యాత్ర సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి విజయవాడ వచ్చినప్పుడు వంశీ వెళ్లి ఆయనను కలవడం నేటికీ పార్టీలో ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. నాటి నుండి వంశీ పై పార్టీకి అనుమానాలు మొదలయ్యాయి. దానికి తోడూ వంశీ స్నేహితులయిన వంగవీటి రాధ కృష్ణ, కొడాలి నాని ఇద్దరూ వైకాపాలోకి మారిన తరువాత కూడా వంశీ వారితో స్నేహం కొనసాగిస్తుండటం వారి అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

 

ఈ నేపద్యంలో వంశీ పార్టీలో తనకు సరయిన గౌరవం లేదని భావించడం సహజమే. అందువల్లే ఆయన వైకాపా వైపు చూస్తున్నాడని పుకార్లు చెలరేగడంతో వంశీ వెంటనే స్పందిస్తూ తనకు చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికలలో గన్నవరం నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారని, ఒకవేళ ఆయన మాట తప్పితే తానూ పార్టీని, రాజకీయాలను విడిచిపెట్టి ఇంటి దగ్గర కూర్చోంటాను తప్ప వైకాపాలో చేరబోనని ప్రకటించారు. అంతే కాకుండా తనకు గన్నవరం సీటు మీద తప్ప ప్రస్తుతం తనకు అప్పగించిన పదవిపై ఏమాత్రం ఆసక్తి, ఇష్టం లేదని, ఒకవేళ పార్టీలో తనకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే తానూ ఈ పదవిని కూడా వీడి సాధారణ కార్యకర్తగానే పనిచేస్తానని చెప్పారు.

 

పార్టీకి ఇన్నేళ్ళ సేవలందించిన తరువాత ఈ రోజు ఇటువంటి అవమానకర పరిస్థితులను ఎదుర్కొంటున్న వల్లభనేని వంశీ ఇక తెలుగు దేశం పార్టీలో ఎన్నాళ్ళు కొనసాగగలడు? ఒకవేళ పార్టీ వీడి బయటకి వస్తే ఇప్పుడు చెపుతునట్లు రాజకీయ సన్యాసం చేస్తాడా లేక జగన్ మోహన్ రెడ్డి పంచన జేరుతాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది?

 

ఏది ఏమయినప్పటికీ, చంద్రబాబు ఆయనకీ గన్నవరం టికెట్ ఇస్తార లేదా అనే విషయం మీదనే అంతా ఆధారపడిఉంది. టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే ఆయన పార్టీని వీడటం 100 శాతం ఖాయం. ఒకవేళ ఇచ్చిన తరువాత కూడా పార్టీలో ఇవే పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది గనుక అప్పుడు ఆయన ఏమి చేస్తారో చూడాలి. ఏమయినప్పటికీ, వంశీ పరిస్థితి ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో వ్రేలాడుతున్నట్లే ఉందని చెప్పవచ్చును.

By
en-us Political News

  
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు.
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.