గమనిక: జయప్రదకు రాజమండ్రి టికెట్ కావలెను

Publish Date:Mar 29, 2013

Advertisement

 

అలనాటి అందాల నటి, ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ యంపీ జయప్రద సమాజ్ వాది పార్టీతో తెగ తెంపులు చేసుకొని బయటపడిన తరువాత మళ్ళీ పుట్టింటి వైపు మనసు మళ్ళడంతో రాష్ట్రానికి తిరిగివచ్చారు. అయితే ఆమె వచ్చి ఏడాది అవుతున్నపటికీ ఇంకా ఏ పార్టీలోను చేరలేదు, కానీ ఇక రాష్ట్ర రాజకీయాలలో దూకేయడం మాత్రం ఖాయం అని ఆమె నాటి నుండి నేటి వరకు చెపుతున్నారు. అయితే ఇంతవరకు ఏ పార్టీ నుండి కూడా ఆమెకు ఆహ్వానం వచ్చినట్లు కనబడలేదు. అయినప్పటికీ, ఆమె తానూ రాజమండ్రీ నుండే పోటీ చేయాలనుకొంటున్నట్లు మాత్రం ప్రకటించేశారు.

 

అంటే తనని పార్టీలో చేర్చుకోదలచిన వారికి ఆమె ముందుగానే రెండు షరతులు పెట్టినట్లు భావించాలి. పార్టీలో చేరాలంటే టికెట్ ఈయడం, అది కూడా రాజమండ్రీ టికెట్ అయి ఉండాలి. అసలు ఆమెను ఏ పార్టీ ఆహ్వానించనప్పుడు, ఇక టికెట్ ప్రసక్తి ఎందుకు? ఇప్పటికే, అన్ని పార్టీలలో ఏళ్ల తరబడి చేస్తున్న సీనియర్లు, ఆ నియోజక వర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న వారు చాలా మంది ఉండగా, హట్టాతుగా ఊడిపడిన ఆమెకు టికెట్, అది కోరుకొన్న చోటి నుండే ఎవరు ఇస్తారు? అని ఆమె ఆలోచించారో లేదో తెలియదు కానీ, తన రెండు షరతుల వలన ఆమెకు ఏ పార్టీలోకి ప్రవేశించే అవకాశాలు లేకుండా చేసుకొన్నారు.

 

కానీ, ఆమె ఒకనాడు తనతో కలిసి సినిమాలలో నటించిన చిరంజీవి అభయ ‘హస్తం’ అందుకొన్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానంతో నేరుగా కలిసి మాట్లాడగల చిరంజీవి ద్వారా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తునట్లు సమాచారం. ఆమెను జయప్రదంగా పార్టీలో అయితే ఆయన చేర్పించగలడు కానీ, కాంగ్రెస్ పార్టీకి పాత కాపు, కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మిన బంటు అని పేరున్న ఉండవల్లి అరుణ్ కుమార్ సీటు క్రింద మంట పెట్టే సాహసం చేయగలడా? చేస్తే కాంగ్రెస్ అధిష్టానం సమ్మతిస్తుందా? పార్టీకి పాతకాపయిన ఉండవల్లిని కాదనుకొని అకస్మాత్తుగా ఊడిపడిన జయప్రదకు టికెట్ ఎందుకు ఈయాలి అని అడిగితే చిరంజీవి దగ్గర సరయిన సమాధానం ఉందా?

 

ఏది ఏమయినప్పటికీ, జయప్రద ఇన్నేళ్ళ రాజకీయానుభవంలో ఈ మాత్రం చిన్న విషయం నేర్చుకోకనే రాజమండ్రీకి టికెట్ పుచ్చుకోవాలని బయలుదేరి వచ్చేసారా? అయినా నిన్ననే, ముఖ్యమంత్రి ఏదో సందర్భంలో “క్యూలో చాలా మంది ఉన్నారు. దయచేసి మీ సమయం వచ్చే వరకు వేచి చూడండి” అని ఒక ప్రకటన కూడా చదివినిపించినట్లు సమాచారం.మరటువంటప్పుడు ఆమె ఏ జీవిని నమ్ముకొంటే మాత్రం ఏమి లాభం ఉంటుంది?

 

ఆమెకు రాజమండ్రీ మీద అంతగా ఆసక్తి, తన గెలుపు మీద నమ్మకం ఉంటే హాయిగా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసుకొని గెలిచేస్తే, ఆనక కేంద్రంలో ఏ పార్టీ, ఏ కూటమి అధికారంలోకి వచ్చినా కూడా తగిన మూల్యం చెల్లించి మరీ ఆమెను తమ పార్టీలో చేర్చుకొంటుంది. గనుక, ఇక స్వంతంత్ర అభ్యర్ధిగా నిలబడి ఎన్నికలలో జయప్రదం అయిపోవడమే ఆమెకు మేలు.

By
en-us Political News

  
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.