వల్లభనేని వంశి.. హిట్ వికెట్టా.. క్లీన్ బౌల్డా?

Publish Date:Feb 1, 2024

Advertisement

వల్లభనేని వంశి ఏపీ రాజకీయాలతో పరిచయం ఉన్నవారికి ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుసగా రెండు సార్లు తెలుగుదేశం అభ్యర్థిగా గన్నవరం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన వంశీ.. రెండో సారి ఎన్నికైన తరువాత విపక్షంలో ఉండలేక అధికార పార్టీ పంచన చేరిపోయారు. తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న వంశీ ఆ తరువాత గురువుకే పంగనామాలు పెట్టిన చందంగా జగన్ పంచన చేరి తెలుగుదేశం పార్టీని విమర్శించడంలో మాస్టర్ డిగ్రీ సంపాదించినట్లుగా చెలరేగిపోయారు. అయితే పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. మరీ ముఖ్యంగా రాజకీయాలలో  అయితే  మరీను. ఇప్పుడు వల్లభనేని వంశీ పరిస్థితి కూడా అలాగే తయారైంది.  బలమైన క్యాడర్, సమర్థ నాయకత్వం ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి వరుసగా రెండు సార్లు గన్నవరంఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీ.. రెండో సారి ఎన్నికైన తరువాత పార్టీదేముంది? అంతా తన ప్రతిభేనని అనుకున్నారు. ఔను అచ్చం విజయవాడ ఎంపీ కేశినేని నానిలాగే.. అయితే నాని నిన్నమొన్నటి వరకూ గెలిచిన పార్టీలోనే ఉంటూ, పార్టీ విధానలను లెక్కచేయకుండా వ్యవహరించారు. చివరకు తెలుగుదేశం పార్టీయే మీ సేవలింక చాలని మర్యాదగా పక్కన పెట్టేసింది. అప్పుడు ఆయన రాజీనామా చేసి తానే బయటకు వచ్చేశానని గప్పాలు కొట్టుకుంటున్నారనుకోండి అది వేరే విషయం.

వల్లభనేని వంశీ మాత్రం రెండో సారి విజయం సాధించగానే, తన ప్రయోజనాలు అధికార పార్టీతో అంటకాగితేనే  భద్రంగా ఉంటాయన్న ఉద్దేశంతో జగన్ పంచన చేరిపోయారు. రాజకీయాలలో పార్టీలు మారడం సహజం. అందుకు ఎవరి కారణాలు వారికి ఉంటాయి. అయితే అలా పార్టీ మారిన వారు చెప్పే, చెప్పిన కారణాలు సహేతుకంగా ఉన్నాయని భావిస్తే జనం పార్టీ మారినా ఆదరిస్తారు. అలా కాకుండా స్వార్థ ప్రయోజనాల పరిరక్షణకే  ప్లేటు ఫిరాయించి తాను గెలిచిన పార్టీపైనే బురద జల్లుతున్నారని జనం భావిస్తే మాత్రం ఆ పార్టీ మారిన వ్యక్తికి ఇక రాజకీయ జీవితం ముగిసినట్లేనని దేశ వ్యాప్తంగా జరిగిన పలు జంపింగు నుతలను చూస్తే ఇట్టే అవగతమౌతుంది. 

మరీ ముఖ్యంగా తెలుగుదేశం వంటి కేడర్ ఆధారిత పార్టీలో అయితే పార్టీని కాదని పక్కకుపోయిన నేతల పరిస్థితి శంకర గిరి మాన్యాలే దిక్కు అన్నట్లుగా తయారౌతుంది. ఎన్టీఆర్ హయాం నుంచీ ఇది పదే పదే రుజువైంది. నెల రోజుల ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కోసం అమ్మలాంటి పార్టీని కాదని జంప్ చేసిన పలువురు ఆ తరువాత రాజకీయాలలో  అడ్రస్ లేకుండా పోయిన సందర్భాలు ఎన్నో. 
ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్ఖితి కూడా అలాగే తయారయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా గన్నవరం నుంచి విజయం సాధించిన వల్లభనేని వంశీ ఎప్పుడైతే పార్టీని కాదని వైసీపీ పంచన చేరారో ఆ రోజు నుంచే ఆయన రాజకీయ పతనం ఆరంభమైందని ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు. 

వంశీ విజయానికి కారణమైన తెలుగుదేశం, ఆ పార్టీ కార్యకర్తలూ ఎటూ వంశీకి దూరమయ్యారు. అలాగే.. ఆయన కోరి చేరిన వైసీపీలో కూడా ఆయన ఒంటరిగానే మిగలాల్సి వచ్చింది.  వైసీపీ గన్నవరం క్యాడర్ ఎవరూ వంశీని దగ్గరకు రానీయలేదు. యువకుడు, ఉత్సాహవంతుడు అన్న భావనతో గత ఎన్నికలలో వంశీవైపు మొగ్గు చూపిన న్యూట్రల్స్ కూడా ఇప్పుడు ఆయనను దగ్గరకే రానీయడం లేదు.  ఇక వైసీపీ అధిష్ఠానం కూడా వంశీని వదుల్చుకోవడమే బెటర్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇందుకు నిదర్శనమే రెండు సార్లు సొంత ఇమేజ్ తో గన్నవరం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యాను అంటూ చెప్పుకునే వంశీకి వైసీపీ ఈ సారి మొండి చేయి చూపాలన్న నిర్ణయానికి వచ్చేశింది.  దీంతో వంశీయే గత్యంతరం లేని పరిస్థితిలో పోటీ చేయను అంటూ ప్రకటించేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆయన ఆ ప్రకటన చేసినా చేయకపోయినా గన్నవరం నుంచి వంశీకి వైసీపీ టికెట్ ఇచ్చేది లేదన్నది ఖాయమైపోయింది.

దీంతో గత కొంత కాలంగా వంశీ దాదాపుగా అజ్ణాతంలోకి వెళ్లిపోయిన పరిస్థితి. కనిపించడు, వినిపించడు అని వైసీపీ నేతలే ఆయనపై సెటైర్లు వేస్తున్నారు.  అసలు విషయం ఏమిటంటే గన్నవరం నుంచి పోటీకి జగన్ అసలు వంశీ పేరును కనీసం పరిశీలనకు కూడా తీసుకోలేదని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. గత రెండు నెలలుగా వల్లభనేని వంశీ అసలు నియోజకవర్గంలో ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిన పరిస్థితి. తెలుగుదేశం అగ్రనాయకత్వంపై వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయనకు మిత్రులుగా ఉన్న వారు కూడా దూరం అయ్యిరని అంటున్నారు. ఇప్పుడు గన్నవరంలో వంశీ ఏకాకిగా మారిపోయారని, ఆయనను కలిసే వారు కానీ, పలకరించేవారు కానీ లేరని అంటున్నారు. అన్నిటికీ మించి వంశీ తనకు ఆప్తమిత్రుడిగా చెప్పుకునే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా వంశీని పట్టించుకోవడం లేదని అంటున్నారు.  

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.