కార్గో స్పేస్ క్రాఫ్ట్ కు కల్పనాచావ్లా పేరు

Publish Date:Sep 11, 2020

Advertisement

అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయమహిళా వ్యోమగామి కల్పనాచావ్లా పేరును ఒక కమర్షియల్ కార్గో స్పేస్ క్రాఫ్ట్ కు పెట్టాలని అమెరికాకు చెందిన నార్త్ రాప్ గ్రూమన్ సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే ఏడాది స్పేస్ లోకి పంపనున్న సిగ్నస్ క్యాప్య్సూల్ కు ఎస్ఎస్ కల్పనా చావ్లా అని నామకరణం చేసినట్టు సంస్థ ప్రకటించింది. గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ సేవలను అందించే  నార్త్ రాప్ గ్రూమస్ సంస్థ తన అధికార ట్విట్టర్ లో వెల్లడించింది. కల్పనా చావ్లాను గౌరవిస్తున్నాం. ఆమె తొలి భారత మహిళా వ్యోమగామిగా నాసాలో చరిత్ర సృష్టించారు. హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్స్ అభివృద్ధిలో ఆమె ఎంతో సేవ చేశారని, ఎన్జీ-14 సిగ్నస్ ఎయిర్ క్రాఫ్ట్ కు కల్పనా చావ్లా పేరును పెట్టడాన్ని నార్త్ రాప్ గ్రూమన్ గర్వంగా భావిస్తోంది. ప్రతి సిగ్నస్ కూ అంతరిక్ష సేవలందించిన వారి పేర్లను పెట్టాలని కూడా నిర్ణయించాం. స్పేస్ ప్రోగ్రామ్ లో భాగంగా తన ప్రాణాలను పోగొట్టుకున్న ఆమె సేవలను ఎన్నో తరాలు గుర్తు పెట్టుకుంటాయి.   ఆన్ బోర్డ్ రీసెర్చ్, వ్యోమగాముల ఆరోగ్యం, స్పేస్ ఫ్లయిట్ లో సేఫ్టీ తదితర ముఖ్యమైన అంశాలపై ఎంతో సమాచారాన్ని ప్రపంచానికి కల్పనా చావ్లా అందించారని కంపెనీ వెబ్ సైట్ లో పేర్కొన్నారు.

ఈనెల 29న
కల్పనా చావ్లా పేరుతో అంతరీక్షంలోకి వెళ్లే స్పేస్ క్రాఫ్ట్ దాదాపు 3,629 కిలోల బరువైన వస్తువులను స్పేస్ స్టేషన్ కు చేర్చడానికి సిద్ధంగా ఉంది. ఈ నెల 29న ఈ స్పేస్ క్రాఫ్ట్ వర్జీనియాలో ఉన్న నాసా వాలోప్స్ ఫ్లయిట్ ఫెసిలిటీ నుంచి గగనతలంలోకి పంపిస్తారు.

దాదాపు 80 పరిశోధనలు..
కల్పనాచావ్లా అంతరీక్షయానం చేసిన మొదటి భారతీయ మహిళ. ఆమె హర్యానాలోని కర్నాల్ లో 17 మార్చి 1962న జన్మించారు. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి 1982లో ఎయిరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత  ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి మాస్టర్స్ డిగ్రీని, కొలరాడో యూనివర్శిటీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ పూర్తి చేశారు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ను, సర్టిఫైడ్ ఫ్లయిట్ ఇన్ స్ట్రక్టర్ హోదాను అందుకున్న ఆమె 1988లో నాసాలో తన కెరీర్ ను ప్రారంభించారు. 1994లో నాసా  అంతరిక్షంలోకి పంపే వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత రెండేండ్లకు STS-87  కొలంబియా వ్యొమనౌక లో ఆకాశయానం చేయడానికి సిద్ధమయ్యారు. ఆమె మొదటి అంతరిక్ష ప్రయాణం 1997 నవంబర్ 19 న ఆరు వ్యోమగాములతో మొదలైంది. దాంతో తొలిసారిగా అంతరిక్షానికి  వెళ్లిన భారత మహిళగా చరిత్ర సృష్టించారు. రెండవసారి అంతరిక్ష యానాన్ని చేసే అవకాశం కూడా ఆమెకు లభించింది.  2001లో ఎస్టీఎస్-107 క్రూ మెంబర్ గా ఎన్నికయ్యారు. 2003, జనవరి 16 న ఎస్‌టిఎస్-107 కొలంబియా స్పేస్ షటిల్ లో 16 రోజుల అంతరిక్ష పరిశోధనల కోసం ఆమె అంతరిక్షంలోకి వెళ్ళారు. ఈ రెండు ప్రయాణాల్లో ఆమె దాదాపు 80 పరిశోధనలను పూర్తి చేశారు. స్పేస్ క్రాఫ్ట్ లో తిరిగి భూమ్మీదకు వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అంతరిక్షయానంలో భారత మహిళ పేరును చరిత్రలో తొలిసారి లిఖించి ఎందిరో స్ఫూర్తిదాయకంగా మారారు.  ఆమె జ్ఞాపకార్ధం ప్రపంచవ్యాప్తంగా అనేక విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు అవార్డులను, స్కాలర్ షిప్ లను అందిస్తున్నాయి. మొదటిసారి కమర్షియల్ స్పేస్ క్రాఫ్ట్ కు ఆమె పేరు పెడుతున్నారు.  "పరిస్థితులు ఎలాగున్నా... కన్న కలల్ని నిజం చేసుకోవడమే అంతిమ లక్ష్యం " అంటూ చెప్పే కల్పన చిన్నతనంలో ఆకాశంలో విహరించాలన్న తన కలను నిజం చేసుకున్నారు. 31రోజుల 14గంటల,54నిమిషాలు అంతరిక్షంలో ఉన్న ఆమె చివరికి తన ఊపిరి కూడా ఆకాశంలోనే వదిలారు. ఎందరిలోనూ స్ఫూర్తి రగిలించి చిరంజీవిగా మిగిలారు. 

By
en-us Political News

  
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.