ప‌దునైన మోడీ..గాంభీర్య మోడీ!

Publish Date:Sep 11, 2020

Advertisement

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ..డెబ్బ‌య్ ఏళ్ల వ‌య‌స్సు...ప్ర‌ధానిగా రెండో ట‌ర‌మ్‌లోనూ ప‌ద‌హారు నెల‌లు కావ‌స్తున్న‌ది. క‌రోనా ద‌రిమిలా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ ఆహార్యంలో మార్పు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్న‌ది. పొడ‌వాటి గ‌డ్డం..మెడ‌చుట్టూ కండువా..అదే మాస్కుగాను ఉప‌యోగం..వీలైనంత‌వ‌ర‌కు మౌన‌మునిలా క‌నిపిస్తున్నారు. ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు, ప్ర‌భుత్వ ప్రొటోకాల్ స‌మావేశాల్లో త‌ప్ప ఇత‌ర‌త్రా ఆయ‌న హ‌డావుడి పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు.వినిపించ‌డం లేదు. ఉప‌న్యాసాలు కూడా వీలైనంత‌వ‌ర‌కు క్లుప్తంగా ఉంటున్నాయి. ఎందుకీ మార్పు? ఆయ‌న  అంత‌రంగంలో ఏముంది? ఆయ‌న లోలోన ఏమి ఆలోచిస్తున్నారు?  ఆయ‌నొక‌ హావ‌భావాల సునామీ.. కాని ఈమ‌ధ్య కాలంలో ఎందుకు మౌనాన్ని ఆశ్ర‌యిస్తున్న‌ట్టు? స‌భ‌లు, స‌మావేశాలైనా..అంత‌ర్జాతీయ వేదిక‌లైనా ప్ర‌ధాని మోడీ భావోద్వేగాల‌తో అవి ఊగిపోయేవి. విదేశీ అధిప‌తులు ఆయ‌న ముందు మోక‌రిలిన‌ట్టే అనిపించేది. ఆయ‌న మాట్లాడుతుంటే త‌లూపుతూ వింటూ మంత్ర‌ముగ్దుల్లా అయిపోవాలి త‌ప్ప వారికి వేరే మార్గం ఉండేది కాదు. అగ్ర‌రాజ్యాధిప‌తి ట్రంప్ అయినా అంతే. చేతిలో చెయ్యేసి ట్రంప్ మాట్లాడ‌టం కాదు. మోడీయే ట్రంప్ చేతిమీద చెయ్యేసి జోకేసి మాట్లాడితే ట్రంప్ కూడా న‌వ్వుతూ ఔన‌న్న‌ట్టు త‌లూప‌డ‌మే చూశాం.

గ‌తంలో ఒబామాతోనైనా అవే స‌న్నివేశాలు. స‌రికొత్త‌గా చాయ్‌పే అంటూ ఒక సంద‌ర్భాన్ని క్రియేట్ చేసుకుని ద్వైపాక్షిక సంబంధాల మీద ఒక అవ‌గాహ‌న‌కు రాగ‌లిగిన సమ‌య‌స్ఫూర్తి మోడీ సొంతం.అంతేకాదు.  పార్ల‌మెంటు స‌భాప‌ర్వ‌మైతే ఇక చెప్పేదేముంది? అంతా ఏక‌ప‌క్ష‌మే. మాట‌ల దాడి ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. ఎదురుదాడి అంటే ఇంకా ఇష్టం. అల‌వోక‌గా ప‌దాల గార‌డీతో వ్యంగ్య‌బాణాలు సంధిస్తూ అక్ష‌రాల అల మీద సునాయాసంగా ఈత కొడ‌తారు.  ఆయ‌‌న వాగ్దాటి అలాంటిది. ఆయ‌న త‌త్వం అలాంటిది. ఆయ‌న హావ‌భావాల్లో రివ్వున ఎగిరే ప‌క్షుల రెక్క‌ల చ‌ప్పుడు వినిపిస్తుంది. ఆయ‌న శారీర‌క భాష‌లో ఉద్వేగ‌పు దొంత‌ర‌లు తార‌ట్లాడతాయి. అలాంటిది ప్ర‌ధాని మోడీ ఈమ‌ధ్య మిత‌భాషిలా క‌నిపిస్తున్నారు. ఆ చొర‌వ‌లో వేగం కాస్తంత నెమ్మ‌దించిన‌ట్టు అనిపిస్తున్న‌ది. జాతీయ స‌మ‌స్య‌లు, అంత‌ర్జాతీయ అంశాల మీద ఆయ‌న నోటి నుంచి విన‌వస్తున్న మాట‌లు ప‌రిమిత‌మ‌య్యాయి. ప్ర‌ధానిగా తొలి ట‌ర‌మ్ లో మోడీ అంద‌రికీ ఇప్ప‌టికీ గుర్తే. ఆ వేగం..ఆ ప‌దును..ఆయ‌న ప్ర‌తిచ‌ర్య‌లోనూ క‌నిపించేవి. వాటి ప్ర‌తిధ్వ‌నులు వినిపించేవి. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు చారిత్రాత్మ‌కం. సాహ‌సోపేతం. ఆ నిర్ణ‌యాల్లో ప‌దును మ‌న‌సుల‌కు తాకేది.

కాలం చెల్లిన‌, తుప్పుప‌ట్టిన కొన్ని వ్య‌వ‌స్ధ‌ల‌కు ఆయ‌న మంగ‌ళం పాడిన‌ప్పుడు యావ‌జ్జాతి స‌మ్మ‌తించింది. ఆ ఆలోచ‌ల్లోని తెగువ చూసి ముచ్చ‌ట‌ప‌డింది. ప్లానింగ్ క‌మిష‌న్ని బుట్ట‌దాఖ‌లా చేయ‌డం..2016 న‌వంబ‌రులో పెద్ద‌నోట్ల రద్దు..2017 జులైలో జీఎస్టీ..2016 సెప్టెంబ‌రులో పాకిస్తాన్ మీద స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్సు..ఇలా మొద‌టి ట‌ర‌మ్ అంతా సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో సాగింది. అంతేకాదు. ఆయ‌న జ‌రిపిన ప్ర‌తి విదేశీ ప‌ర్య‌ట‌న ఒక ప‌ర్వ‌దినంగా వెలిగింది. స్ధానిక భార‌తీయుల స‌మ్మేళ‌నాలు జ‌రిగాయి. ఆ బ‌హిరంగ వేదిక‌ల మీద ఆయా దేశాల అధిప‌తుల‌తో క‌లిసి మోడీ చేసిన ప్ర‌సంగ విన్యాసాలు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌ను ఆక‌ర్షించాయి.

ఇక రెండో ట‌ర‌మ్‌..అదొక సాహ‌స క్రీడ‌. ఆర్టిక‌ల్‌370 ర‌ద్దు..రామాల‌య నిర్మాణం..త్రిపుల్ త‌లాక్‌..సిటిజెన్ షిప్ యాక్టు..ఇర‌వై ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీ..ఇలా ఒక్కొక్క‌టీ ఒక్కో చారిత్రాత్మ‌క నిర్ణ‌యం. ఇవ‌న్నీ మోడీ సాహ‌సోపేత నాయ‌క‌త్వానికి చిహ్నాలుగా శాశ్వతంగా చ‌రిత్ర‌లో నిలిచిపోతాయి. ఇక ఈ ఏడాది మార్చి నుంచి ఒక దుర్ద‌శ మొద‌లైంది. అదే క‌రోనా కాలం. క‌‌రోనా మ‌హ‌మ్మారి మ‌న‌దేశంలోకి ప్ర‌వేశించిన తొలినాళ్ల‌లో ప్ర‌ధాని మోడీ కార్యోన్ముఖుల‌య్యారు. దేశ ప్ర‌జ‌ల‌కు త‌క్ష‌ణ క‌ర్త‌వ్యాన్ని బోధించ‌డంలో వినూత్న ప‌ద్ద‌తుల‌తో ముందుకొచ్చారు. లాక్‌డౌన్ కాలంలో దేశ‌ప్ర‌జ‌లంద‌రిచేతా కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాల‌ను మ‌న‌సా వాచా అమ‌లుచేయించ‌డంలో విజ‌యం సాధించారు. లాక్‌డౌన్ వ‌ల్ల దేశం ఎదుర్కొన్న ఆర్ధిక సంక్షోభం నుంచి కోలుకునే మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. 2014లో ప్ర‌ధాని మోడీ తొలిసారి ప్ర‌ధానిగా ప‌ద‌వీబాధ్య‌త‌లు స్వీక‌రించాక అయిదేళ్ల‌పాటు వ్య‌వ‌హ‌రించిన తీరు ఒక ర‌కం. రెండోద‌ఫా ప్ర‌ధాని అయ్యాక వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు మ‌రొక ర‌కం. మొద‌టి ట‌ర‌మ్ లో వినూత్న‌పంథాలో అడుగులేశార‌న్న భావ‌న అంద‌రిలో ఉంది. రెండో ట‌రమ్‌లో ఆయ‌న‌లో మ‌రింత ప‌రిప‌క్వ‌త కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్న‌ది. అది ఆయ‌న ఆహార్యంలో ప్ర‌తిబింబిస్తున్న‌ది. పొడ‌వాటి గ‌డ్డం అంద‌రూ గుర్తించేలా ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్న‌ది. ఆయ‌న‌లో మునిపుంగ‌వుడు ద‌ర్శ‌న‌మిస్తున్నాడ‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఆరేళ్ల భార‌త‌దేశ సార్వ‌భౌమ‌త్వ బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ అనంత‌రం ఆయ‌న‌లో ఈ మార్పు దేశ ప్ర‌గ‌తికి ఒక చిహ్న‌మ‌న్న భావ‌న క‌లుగుతున్న‌ది. పాకిస్తాన్ తో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరుకు, చైనాతో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుకు పొంత‌న లేద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ది.

అయితే ఆ రెండు దేశాల‌తో మ‌న‌కున్న వివాదాల గుణ‌గ‌ణాలు వేరు. రెండింటినీ పోల్చి చూడ‌డం భావ్యం కాదు. కాని పాకిస్తాన్ విష‌యంలో మెరుపుదాడుల‌తో ఆయ‌న తీవ్రంగా వేగంగా స్పందించిన విష‌యాన్ని విశ్లేష‌కులు ఇక్క‌డ గుర్తు చేస్తున్నారు. అదే చైనా ద‌గ్గ‌ర‌కొచ్చేస‌రికి ఆయ‌న‌లో నిగ్ర‌హం క‌నిపిస్తున్న‌ది. చైనా సైనికులు ల‌డ‌ఖ్ లోని పాంగాంగ్లో మ‌న జ‌వాన్ల‌ని వ‌ధించినందుకు మొద‌టి ట‌ర‌మ్ మోడీ అయితే ఏమి చేసి ఉండేవార‌న్న విశ్లేష‌ణ‌లు జ‌ర‌గ‌క‌పోలేదు. అయితే   చైనాతో వ్య‌వ‌హ‌రిస్తున్న‌తీరు విదేశాంగ విధానంలో ఆచితూచి అడుగులేయాల‌న్న ప్రాథ‌మిక సూత్రానికి అనుగుణంగా ఉంది. శ‌త్రుశిబిరం దుందుడుకుగా వ్య‌వ‌హ‌రిస్తున్నా..భార‌త్ మాత్రం చ‌ర్చ‌ల‌కే ప్రాధాన్య‌మిస్తున్న‌ది. చైనాతో ద‌శాబ్దాల మైత్రి ఒక వంక మోడీని క‌ట్టిప‌డేస్తున్న‌ది. భార‌తీయ సంప్ర‌దాయ‌క మైత్రీభావ‌న‌ను చెక్కుచెద‌ర‌నీయ‌కూడ‌ద‌న్న మోడీ భావ‌న ఆయ‌న‌లోని ప‌రిప‌క్వ‌త‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్న‌ది. ఈ ప‌రిప‌క్వ‌త‌కు అనుగుణంగానే క్ర‌మ‌బ‌ద్దంగా ఆయ‌న ఆహార్యంలో మార్పు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్న‌ది!

By
en-us Political News

  
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.