లేట్ అయినా.. పెద్ద జాక్పాట్ కొట్టారు...
యూఎస్ దంపతులకు రూ.390 కోట్ల లాటరీ..
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు. చివరికి 30 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ దంపతులను భారీ అదృష్టం వరించింది. ఏకంగా రూ.390 కోట్ల రూపాయల లాటరీ తగిలింది. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగు చూసింది. టెక్సాస్లోని రిచర్డ్సన్కు చెందిన దంపతులు గత 30 ఏళ్లుగా లాటరీలు కొంటున్నారు. ఏనాటికైనా తమను అదృష్టం వరిస్తుందన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. వారి నమ్మకమే నిజమైంది.
దంపతులు ఏప్రిల్ నెలలో మెస్క్వైట్లోని సెవెన్ ఎలెవెన్ స్టోర్ నుంచి క్విక్ పిక్ లాటరీ టికెట్ కొన్నారు. ఆ టికెట్ వారి జీవితాన్ని మారుస్తుందని దంపతులు అస్సలు ఊహించలేదు. ఏప్రిల్ 20వ తేదీన తీసిన డ్రాలో వారు కొన్న టికెట్కు ప్రైజ్ మనీ వచ్చింది. ఏకంగా 41 మిలియన్ డాలర్స్ .. ఇండియన్ కరెన్సీలో రూ.390 కోట్ల రూపాయలు వారి సొంతం అయ్యాయి. అయితే, పేర్లు బయటకు చెప్పడానికి ఆ దంపతులు ఇష్టపడలేదు. తాము ఏ రోజైనా అదృష్టం వరించకపోతుందా అన్న నమ్మకంతో ఉన్నామని, 30 ఏళ్ల తర్వాత అదృష్టం వరించిందని ఆ దంపతులు పేర్నొన్నారు. వచ్చిన డబ్బులలో కొంత కుటుంబసభ్యులకు పంచుతామని చెప్పారు. మరికొంత డబ్బుతో ప్రపంచ పర్యటన చేస్తామని అనందంగా వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/us-couple-wins-rs-390-crore-lottery-36-219159.html
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్గా మారింది.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్గ్రామ్లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.