ఇరాన్‌పై ఆగని అమెరికా దాడులు.!

Publish Date:Jul 10, 2026

Advertisement

అమెరికా ఇరాన్ పై భీకర దాడులను కొనసాగిస్తున్నది. వరుసగా మూడో రోజు అమెరికా ఇరాన్ పై దాడులను కొనసాగించింది. మూడో రోజు  గురువారం (జులై 9) అమెరికా ఇరాన్ లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది.   ఈ దాడుల తీవ్రతకు దక్షిణ ఇరాన్‌లోని పలు కీలక తీర ప్రాంతాలు భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. ముఖ్యంగా  ఇరాన్‌కు చెందిన అత్యంత వ్యూహాత్మక బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో బాంబులు పేలడం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. 

బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా జరిగిన ఈ   దాడుల ప్రభావంపై ఇరాన్ ప్రభుత్వ మీడియా స్పందించింది. అమెరికా  జరిపిన ఈ దాడుల ధాటికి బుషెహర్ అణు కేంద్రం ప్రాంగణంలోని ఒక ముఖ్యమైన భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు పేర్కొంది. కేవలం అణు కేంద్రమే కాకుండా, ఇరాన్ రక్షణ రంగానికి, వాణిజ్యానికి అత్యంత కీలకమైన బందర్ అబ్బాస్, కొనారక్ వంటి తీరప్రాంత నగరాలపై కూడా అమెరికా దాడులు చేసింది.  ప్రధానంగా సైనిక స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం.

గత 48 గంటల వ్యవధిలోనే అమెరికా మిలిటరీ ఇరాన్ సరిహద్దుల్లో భీకర దాడులతో విధ్వంసం సృష్టించింది. ఇరాన్ తీర ప్రాంతాల పొడవునా విస్తరించి ఉన్న దాదాపు 170 కి పైగా సైనిక స్థావరాలు, నిఘా కేంద్రాలు, క్షిపణి లాంచింగ్ ప్యాడ్‌లపై అమెరికా వైమానిక దళం   విరుచుకుపడింది. ఈ దాడులతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో  భయానక వాతావరణం నెలకొంది.  

Bushehr nuclear power plant, Strait of Hormuz conflict, Donald Trump Iran, US Iran war crisis, Persian Gulf explosions

By
en-us Political News

  
ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ఘోరమైన, కలకలం రేపే ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ దాహం వేసి నీళ్ల బాటిల్ అనుకుని యాసిడ్ తాగడంతో తీవ్ర అనారోగ్యానికి గురైంది.
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న గానకోకిల ఎస్. జానకి
వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం.
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో గానకోకిలగా, నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ గాయని ఎస్. జానకి. ఆమె తన మధురమైన గానంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఆదివారం ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తమిళ సినీ నటుడు ఆర్యపై చీటింగ్ కేసు నమోదైంది.
రంగారెడ్డి జిల్లాలో ఒక బాధ్యతాయుతమైన పోలీసు అధికారి ప్రవర్తించిన తీరు ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
మారువేషంలో వచ్చిన మంత్రికి చేదు అనుభవం..
భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో తన అద్భుతమైన గాత్రంతో ఆరు దశాబ్దాల పాటు శ్రోతలను ఓలలాడించిన గానకోకిల ఎస్. జానకి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని దైవాలగూడ గ్రామంలో ఒకే ఒక్క అరగంట వ్యవధిలో ఆరుగురిని అత్యంత కిరాతకంగా నరికి చంపి
విశాఖపట్నం నగరంలో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రస్తుత సీజన్‌లో ఎల్ నినో పంజా విసరడం వల్ల రాయలసీమతో పాటు కోస్తాంధ్రలో అన్నపూర్ణగా పేరొందిన జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది. ఎండల తీవ్రతకు జలాశయాల్లోని నీరు ఆవిరైపోయే పరిస్థితులు తలెత్తాయి. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రధాన ప్రాజెక్టులు ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ వైపు నుంచి ఎగువ ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.