బాబు అరెస్టుకు రెండేళ్లు..

Publish Date:Sep 9, 2025

Advertisement

రెండేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు..(అంటే సెప్టెంబర్ 9 2023) అప్పటి జగన్ సర్కార్ నారా చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసింది. స్కిల్ కేసు అంటూ నంద్యాలలో బూబు షూరిటీ.. భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని తన బస్సులో విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబునాయుడిని నిబంధనలను తుంగలోకి తొక్కి మరీ చేసి రాక్షసానందాన్ని పొందింది. నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ చరిత్ర, 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 15 ఏళ్ల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబునాయుడిని అరెస్టు చేయడం పట్ల అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లోనూ, తెలంగాణలోనూ మాత్రమే కాదు, దేశంలోని అన్ని  రాష్ట్రాలూ, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో నిరసనలు మిన్నంటాయి.   

చంద్రబాబు అరెస్టును ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా జాతీయ స్థాయిలో  కూడా అన్ని రాజకీయపార్టీలూ తప్పుపట్టాయి.  నేషనల్ మీడియాలో కూడా  చంద్రబాబు అరెస్టు వార్తను అత్యంత ప్రముఖంగా ప్రచురించింది. ప్రసాదం చేసింది. ఇక  మేధావులు కూడా ఈ అరెస్టు వ్యవహారాన్ని కక్ష  సాధింపు చర్యగానే  అభివర్ణించారు. తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగులు, కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబుకు మద్దతు ప్రకటించాయి. హైదరాబాద్, ఢిల్లీ, కర్ణాటక , చెన్నై లాంటి  నగరాలలో యువత  చంద్రబాబుకు మద్దతుగా  నిరసనలు చేపట్టారు.   రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, మాజీ న్యాయమూర్తులు కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు.  అసలు జగన్ ప్రభుత్వ పతనానికి ప్రధాన కారణాలలో చంద్రబాబు అక్రమ అరెస్టు ఒకటి అనడంలో సందేహం లేదు.  

చంద్రబాబు అక్రమ అరెస్టుపై పెల్లుబికి ఆగ్రహ జ్వాలల సెగ అప్పటి జగన్ సర్కార్ కే కాదు.. అప్పట్లో మోడీ సర్కార్ ను కూడా ఉక్కిరిబిక్కిరి చేసింది. బీజేపీకి చెందిన ఆంధ్రప్రదేశ్ నాయకులు  చంద్రబాబు అరెస్టు వల్ల జగన్ మాత్రమే కాదు.. తాము కూడా తీవ్ర ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్నామని బాహాటంగానే  చెప్పారు. మొత్తం మీద చంద్రబాబు అరెస్టు ప్రభావం ఏపీలో వైసీపీ పతనాన్ని ఎన్నికలకు ముందే ఖరారు చేసేసింది.  2024లో జరిగిన ఎన్నికలలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన జగన్ సర్కార్ కు ఏపీ జనం గట్టి బుద్ధి చెప్పారు. కనీసం ప్రతిపక్షహోదాకు కూడా నోచుకోని ఘోర పరాజయాన్ని చవి చూపించారు.   

By
en-us Political News

  
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌ తెలిపారు
ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు.
నారాయణ వంటి ప్రైవేట్ సంస్థలే నెలకు 15 లక్షల రూపాయల జీతం ఇచ్చినా మంచి ప్రొఫెసర్లను తెచ్చుకోలేకపోతున్నాయి. అటువంటప్పుడు ప్రభుత్వ పే-స్కేల్స్‌తో వారు ఎలా వస్తారన్నది పెద్ద ప్రశ్న. ఇక మారుమూల ప్రాంతాలకు రావడానికి అర్హత కలిగిన వారు రావడానికి ఇష్టపడకపోవడానికి వారి పిల్లల చదువులు, కుటుంబ వసతులు వంటివి అవరోధాలుగా మారుతున్నాయని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు.
ఈడీ అధికారులు మిథున్ రెడ్డికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, కంపెనీలతో జరిగిన లావాదేవీలు, అను బంధ వ్యక్తులు, సంస్థల వివరాలు సేకరిస్తున్నారు. లిక్కర్ వ్యాపారంలో పాల్గొన్న పలువురు వ్యాపా రులు, మధ్యవర్తులను విచారించడం ద్వారా వచ్చిన సమాచారంతో ఈడీ మిథున్ రెడ్డిని విచారిస్తున్నట్లు సమాచారం.
అంతే కాదు ఆ రాళ్లపై జగన్ జగన్ ఫొటోలను ముద్రించడం కూడా పెను వివాదంగా మారింది. హైకోర్టు కూడా సర్వేరాళ్లపై జగన్ బొమ్మల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే భూముల రీ సర్వేకు సంబంధించి రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాలపై కూడా జగన్ బొమ్మ ఉండటంపై కూడా అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఇరువురూ సవాళ్లు ప్రతి సవాళ్లతో తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించి, పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రతను పటిష్ఠం చేశారు.
నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానై దిశా నిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఇప్పుడు ఎవరికీ ఎటువంటి సందేహాలూ, అనుమానాలూ లేవు.
ప్రభుత్వ ఆస్పత్రులలో నెలకు 15 లక్షల జీతం ఇస్తామన్నా ఎందుకు చేరడం లేదు? అన్న విషయాలను ప్రస్తావించారు. ఇది కేవలం ఆస్పత్రులకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు.. మొత్తంగా రాష్ట్రంలో ఆరోగ్య భద్రతకు సంబంధించిన అంశంగా విశ్లేషించారు.
ఈసీ తమ పార్టీకి ఈల గుర్తు కేటాయించడం పట్ల విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు విజయ్ నటించిన సక్సెస్ ఫుల్ మూవీ విజల్ ను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, టీవీకేకు విజిల్ గుర్తు సక్సెస్ కు సంకేతంగా అభివర్ణిస్తున్నారు.
అలాగే భారీగా అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలపైనా ఈడీ విజయసాయిని సుదీర్ఘంగా విచారించింది. అదే విధంగా మద్యం కుంభకోణం ద్వారా అక్రమంగా వచ్చిన నగదును విదేశాలకు తరలించిన అంశం, హవాలా మార్గాల వినియోగం, షెల్ కంపెనీల ఏర్పాటు ద్వారా మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.
2019 ఎన్నికలకు ముందు జగన్ ప్రజా సంకల్పయాత్ర పేరిట దాదాపు 16 నెలల పాటు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ పాదయాత్ర కారణంగానే అప్పటి ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.
ఉద్యోగులు విధులకు గైర్హాజరైతే వేతనాలు నిలిపివేస్తారు.. మరి ఎమ్మెల్యేల విషయంలో ఆ విధానాన్ని ఎందుకు అమలు చేయరని జనం ప్రశ్నిస్తున్నారన్నారు.
ఈ నేపథ్యంలో, రాజధానిగా అమరావతి ఎంపిక ప్రక్రియ, నిర్మాణ కార్యక్రమాలపై వివరాలను కూడా కేంద్రానికి నోట్‌ ద్వారా రాష్ట్ర ప్రభఉత్వం అందజేసింది. ఈ విషయమై, కేంద్రం ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖల నుంచి అభిప్రాయాలు సేకరించడమే కాకుండా, నీతి ఆయోగ్‌ అభిప్రాయాన్ని కూడా కోరినట్లు సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.