వ్యూహాత్మకంగా వ్యవహారించిన ముఖ్యమంత్రి కేసీఆర్, తుమ్మల

Publish Date:Sep 5, 2014

Advertisement

 

ఊహించినట్లే తెదేపా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు తన అనుచరులతో కలిసి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో నిన్న జేరిపోయారు. బహుశః త్వరలోనే ఆయనకు మంత్రి పదవి కూడా దక్కవచ్చును. రాజకీయ నేతలు పార్టీలు మారడం, ఆ సందర్భంగా నాలుగు ముక్కలు మాట్లాడటం చాలా సహజమే కనుక ఈ సందర్భంగా వారిరువురూ మాటలు కూడా ఆ కోవకే చెందినవని అందరూ అనుకోవచ్చును. కానీ వారిరువురు ఈ సందర్భంగా వ్యవహరించిన, మాట్లాడిన తీరు వారి రాజకీయ పరిణతికి, ఆశలకు అద్దం పట్టేవిగా ఉన్నాయి.

 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ‘నిజానికి ఆయన స్థాయి నేతకు ఈవిధంగా తెలంగాణాలో భవన్ లో కాక నిజాం కాలేజీ మైదానంలో పెద్ద సభను ఏర్పాటు చేసి స్వాగతం పలకాల్సి ఉందని’ అనడం, అదేవిధంగా తుమ్మలతో తన అనుబంధం జ్ఞప్తికి తెచ్చుకొని ఆయన తన చిరకాల మిత్రుడు, ఆప్తుడని అందరి ముందు చెప్పడం గమనిస్తే కేసీఆర్ తను ఆయనకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నానని, తుమ్మలకే కాక తన పార్టీ నేతలకు, కార్యకర్తలకు, చివరికి తెదేపా నేతలకు కూడా కేసీఆర్ ఒక సందేశం ఇచ్చినట్లు అర్ధమవుతోంది. తద్వారా మున్ముందు మరింతమంది తెదేపా నేతలు తెరాసలోకి ఆకర్షింపబడే అవకాశం కూడా ఉంది.

 

తుమ్మలకు జిల్లా సమస్యలు, వనరులు, రాజకీయాలపై మంచి అవగాహన ఉందని, జిల్లాలో తెదేపా, తెరాస నేతలు, కార్యకర్తలతో మంచి సంబంధాలు ఉన్నందున, ఆయనకే ఖమ్మం జిల్లా బాధ్యతలు అప్పగించాలని తను భావిస్తున్నట్లు ప్రకటించడం కూడా వ్యూహాత్మకమే. ఎందువలన అంటే మొదటి నుండి ఖమ్మం జిల్లా తెదేపాకు కంచుకోటలా నిలబడి ఉంది. దానిలోకి ప్రవేశించాలని తెరాస చేసిన ప్రయత్నాలేవీ ఇంతవరకు ఫలించలేదు. కానీ ఇప్పుడు జిల్లాలో మంచి బలమయిన నాయకుడిగా పేరున్న తుమ్మల తెరసలోకి చేరడంతో ఇప్పుడు ఆ కంచుకోటను బ్రద్దలు కొట్టేందుకు కేసీఆర్ కు అవకాశం దొరికినట్లయింది. అందుకే ఆ కోటపై పట్టున్న తుమ్మలకే ‘ఆ పని’ అప్పగిస్తున్నట్లు అర్ధమవుతోంది. అందుకే ఆయనకు తను చాలా ప్రాధాన్యం ఇస్తున్నట్లు విస్పష్టంగా తెలియజేసారు.

 

ఈ సందర్భంగా ఆయన త్వరలోనే ఖమ్మం జిల్లాను రెండుగా విడదీయాలనుకొంటున్నట్లు ప్రకటించడం కూడా గమనార్హమయిన విషయమే. తమ పార్టీ అధికారం చేప్పట్టిన తరువాత ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలను పరిపాలనా సౌలభ్యం కోసం 20 జిల్లాలుగా మార్చుతామని కేసీఆర్ ఇదివరకే చాలాసార్లు చెప్పారు. చెప్పడమే కాకుండా అప్పుడే ఆ దిశలో ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. కానీ ఈ సందర్భంగా ఆయన ఖమ్మం జిల్లాను రెండుగా విడదీయలనుకొంటున్నట్లు చెప్పడం మాత్రం కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే కాక, ఆ జిల్లాపై మంచి పట్టున్న తెదేపా, నామ నాగేశ్వరరావు తదితర నేతల పరిధిని, వారి ప్రభావాన్ని కుచింపజేసి, అక్కడ తుమ్మల సారధ్యంలో తెరాసను బలోపేతం చేయడం కూడా ఒక లక్ష్యంమని భావించవచ్చును. ఇకపై తాను తరచూ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తానని కేసీఆర్ ప్రకటించడం గమనిస్తే ఆ సంగతి అర్ధమవుతుంది.

 

ఇక తుమ్మల నాగేశ్వరావు ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసుకొనేందుకు, తెలంగాణా అభివృద్ధికి కృషి చేస్తున్న కేసీఆర్ కు అండగా నిలబడేందుకే తాను తెరాసలో చేరుతున్నానని ప్రకటించినప్పటికీ అసలు కారణాలు వేరని అందరికీ తెలుసు. ఆయనకు జిల్లాలో నామా నాగేశ్వరరావుతో అభిప్రాయబేధాలు తత్సంబంధిత కారణాల వల్లనే ఆయన తెదేపాను వీడి తెరాసలో చేరారని అందరికీ తెలుసు. ఆయన పరిస్థితిని గమనించిన తెరాస అధ్యక్షుడు కేసీఆర్, ఇదే అదునుగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించడం, మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నట్లు వార్తలు వగైరాల పరిణామాలన్నీ తుమ్మలను తెరసవైపు నడిపించాయని చెప్పవచ్చును. తెదేపాలో తనకు ప్రాధాన్యత తగ్గిపోయిందని భావిస్తున్న సమయంలో కేసీఆర్ నుండి ఆహ్వానం రావడంతో తుమ్మల పార్టీ మారారు తప్ప, పార్టీ మారేందుకు ఆయన చెపుతున్న ఇతర కారణాలు నిజం కాదని అర్ధమవుతోంది.

 

ఏమయినప్పటికీ తుమ్మల తెరాసలో చేరడం వలన ఖమ్మం జిల్లాలో తెరాస బలపడే అవకాశం ఉంటే, అధికార తెరాస పార్టీలో చేరడం వలన తుమ్మల కేవలం మంత్రి పదవి పొందడమే కాకుండా, జిల్లాలో మళ్ళీ చక్రం తిప్పగలుగుతారు. కనుక ఇది ఉభయతారకమని చెప్పవచ్చును. అయితే ఈ గడ్డు పరిస్థితిని తెదేపా ఏవిధంగా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సి ఉంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.