రాయలసీమ అభివృద్దికి రాజధాని అవసరమా?

Publish Date:Sep 4, 2014

Advertisement

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని విజయవాడ వద్ద ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న శాసనసభలో ప్రకటించడంతో ఆ అంశంపై గత మూడు నెలలుగా సాగుతున్న సస్పెన్స్ డ్రామాకు తెర పడింది. కానీ రాయలసీమ ప్రజలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేఖంగా ఉద్యమబాట పట్టడం చాలా ఆందోళన కలిగిస్తోంది.

 

మొదటి నుండి పాలకుల నిర్లక్ష్యానికి గురయిన రాయలసీమ అభివృద్ధికి నోచుకోలేదు. కనుక కనీసం ఇప్పుడయినా రాజధానిని తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే వారి కోరికకు విరుద్దంగా అన్ని విధాల అభివృద్ధి చెందిన విజయవాడలో రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించడంతో అక్కడి ప్రజలకు తీవ్ర ఆగ్రహం, ఆవేదన కలగడం సహజమే. అందుకే వారు ఉద్యమబాట పట్టారు. అదే ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి వారి కష్టాలు, సమస్యలు, అవసరాలు అన్నీ క్షుణ్ణంగా తెలుసు. అందుకే ఆయన కేవలం రాజధాని ప్రకటనతో సరిపెట్టేయకుండా దానితో బాటు రాయలసీమ సత్వర అభివృద్ధికి తన కార్యప్రణాళికను కూడా ప్రకటించారు.

 

అయితే ఇంతవరకు రాష్ట్రాన్ని ఏలిన రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రులు అందరూ తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఉండి ఉంటే నేడు ప్రజలలో ఈ ఆందోళన ఉండేది కాదు. కానీ రాష్ట్ర విభజనను కలలో కూడా ఊహించని కారణంగా చంద్రబాబుతో సహా ముఖ్యమంత్రులు అందరూ కూడా కేవలం హైదరాబాదునే అభివృద్ధి చేసుకొంటూ పోయారు. తత్ఫలితంగా రాయలసీమ వెనుకబడిపోయింది. అంతేకాదు రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల అభివృద్ధిని పణంగా పెట్టి మరీ కష్టపడి అభివృద్ధి చేసుకొన్న హైదరబాదును పోగొట్టుకోవలసి వచ్చింది.

 

రాష్ట్రవిభజన నేర్పిన ఈ గుణపాటంతో ఇకపై రాష్ట్ర ప్రభుత్వం అటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతుందనే విషయంలో ఎటువంటి అనుమానం అవసరం లేదు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో 13జిల్లాలు సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. కానీ అభివృద్ధి మళ్ళీ కేవలం కాగితాలకే పరిమితమయితే వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజలు ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీయవలసిందే.

 

అందువలన ప్రభుత్వం ప్రకటించిన తన అభివృద్ధి ప్రణాళికను అమలుచేసేందుకు రాయలసీమ ప్రజలు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వడం మంచిది. రాష్ట్ర విభజన సందర్భంగా కొందరు రాజకీయ నాయకులు, పార్టీలు ఆడిన నాటకాలు ప్రజలందరూ స్వయంగా చూసారు. వారిని ప్రజలు కటినంగా శిక్షించారు కూడా. కనుక మళ్ళీ అటువంటి స్వార్ధ రాజకీయ నాయకులను నమ్మి ఉద్యమాలు మొదలుపెట్టడం వలన కేవలం వారు మాత్రమే రాజకీయంగా లబ్ది పొందుతారు తప్ప రాయలసీమకు మేలు జరుగదు. కనుక రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాయలసీమ ప్రజలు ఇప్పుడు రాజధాని కోసం పట్టుబట్టడం కంటే తమ ప్రాంతం అభివృద్ధి చెందేవరకు కూడా తమ ప్రజాప్రతినిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం మంచి పద్దతని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం కూడా అంగీకరించింది గనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు వీలయినంత త్వరగా పనులు మొదలుపెడితే ఆ రెండు ప్రాంతాల ప్రజలలో ప్రభుత్వం పట్ల నమ్మకం ఏర్పడే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.