జగన్ అరాచకపాలన నుంచి విముక్తి పొందిన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సమయానికి రాష్ట్రం అన్ని రంగాలలో అధమ స్థానంలో ఉంది. వ్యవస్థలు నిర్వీర్యమై ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ప్రక్షాళన చేసి మళ్లీ అభివృద్ధి బాట పట్టించాల్సిన పరిస్థితి. అందుకే అధికార పగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ చంద్రబాబు అదే పనిలో ఉన్నారు. అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తిరుమల దేవుడిని దర్శించుకున్న చంద్రబాబు అక్కడే రాష్ట్రంలో ప్రక్షాళన తిరుమల నుంచే ఆరంభిస్తానని ప్రకటించారు. అదే చేశారు. చేస్తున్నారు. తిరుమల ప్రక్షాళన మొదలైంది. జరగాల్సింది ఇంకా చాలా ఉంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆ పనికి నడుంబిగించింది.
తిరుమలపై ఈ నెల 11 చంద్రబాబు సమీక్ష చేయనున్న నేపథ్యంలో కీలక చర్యలు, సంచలన నిర్ణయాలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న 18 మందిపై బదిలీ వేటు వేసింది. తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారంటూ వారిపై బదిలీ వేటు వేసింది. వీరు కాకుండా మరో 300 మంది అన్యమతస్తులు టీటీడీలో వివిధ విభాగాల్లో కొలువులు చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. వారిని కూడా దశల వారీగా బదలీ చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం టీటీడీ బదిలీవేటు వేసిన వారిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్, ఎస్వీయూ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఉన్నారు.
తిరుమలలో అన్యమతస్తులు ఉండడానికి వీలులేదని టీటీడీ చెబుతోంది. హిందువులు వినా మరో మతానికి చెందిన వారికి టీటీడీలో కొలువులు సరికాదన్న భావనతో ముందుగా టీటీడీలోని వివిధ విభాగాలలో పని చేస్తున్న 18 మందిపై బదిలీ వేటు వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వాస్తవానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులకు ఉద్యోగ అవకాశాలు ఉండవు. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడంతో కొందరు టీటీడీలో కొలువులో చేరారు.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత టీటీడీ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు టీటీడీలో హిందూయేతరులు ఉండడానికి వీల్లేదని స్పష్టంగా పేర్కొన్నారు. టీటీడీలో ఉద్యోగం చేస్తున్న అన్యమతస్తులను రాష్ట్ర ప్రభుత్వ శాఖలలోకి మార్చడం లేదంటూ వీఆర్ఎస్ ఇవ్వడం చేస్తామని విస్పష్టంగా ప్రకటించారు. ఆ మేరకు ఆరా తీయగా టీటీడీలో 300 మందికి పైగా అన్యమతస్తులు పని చేస్తున్నట్లు తేలింది. ఇప్పుడు వారిని టీటీడీ నుంచి పంపేయడానికి చర్యలు తీసుకుంటోంది.
తొలి దశలో 18 మందిపై బదిలీ వేటు వేసింది. ముందు ముందు మిగిలిన వారిని కూడా టీటీడీ నుంచి వేరే రాష్ట్రప్రభుత్వ శాఖలకు బదిలీ చేయడమో, వీఆర్ఎస్ ఇవ్వడమో చేస్తామని టీటీడీ చెబుతోంది. ఇక తిరుమల కొండపై పారిశుదధ్య పరిస్థితిని మెరుగుపరచడానికి టీటీడీ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. తిరుమలలో పారిశుద్ధ్య పరిస్థితి బాగా మెరుగుపడిందని భక్తులు చెబుతున్నారు. అలాగే తిరుమలలో భక్తుల సౌకర్యాలు, అన్న, జల ప్రసాదాల వితరణ భేషుగ్గా ఉందంటున్నారు. అలాగే తిరుమల కొండపై హోటళ్లలో తినుబండారాల నాణ్యత కూడా మెరుగుపడిందనీ, అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతా భేషుగ్గా ఉందని భక్తులు చెబుతున్నారు. తాజాగా మంగళవారం తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాన్ని టీటీడీ బ్రహ్మాండంగా నిర్వహించిందని భక్తులు ప్రశంసిస్తున్నారు. స్వామి వారి వాహన సేవలను తిలకించి తరించడానికి వచ్చిన లక్షలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసిన ఏర్పాట్ల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ttd-transfer-18-non-hindu-employees-39-192412.html
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు.
తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.