టీటీడీ ఏప్రిల్ నెల దర్శనం కోటా విడుదల

Publish Date:Jan 17, 2026

Advertisement

 

2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కోటా విడుదల షెడ్యూల్‌ను ప్రకటించింది.

🔹 ఆర్జిత సేవా టికెట్లు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలు):
ఏప్రిల్ నెల కోటాను జనవరి 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఈ టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్‌కు జనవరి 21 ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.
డిప్‌లో ఎంపికైనవారు జనవరి 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటలలోపు ఫీజు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి.

🔹 ఇతర ఆర్జిత సేవలు:
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీ‌వారి సాలకట్ల వసంతోత్సవాల టికెట్లను జనవరి 22న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

🔹 వర్చువల్ సేవలు & దర్శన స్లాట్లు:
జనవరి 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.

🔹 అంగప్రదక్షిణ టోకెన్లు:
జనవరి 23న ఉదయం 10 గంటలకు విడుదల.

🔹 శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు:
జనవరి 23న ఉదయం 11 గంటలకు విడుదల.

🔹 వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచిత ప్రత్యేక దర్శనం:
టోకెన్ల కోటాను జనవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

🔹 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు (₹300):
జనవరి 24న ఉదయం 10 గంటలకు విడుదల.

🔹 తిరుమల, తిరుపతిలో గదుల కోటా:
జనవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల.

🔹 శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటా (మార్చి నెలకు):
జనవరి 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.

 🔹 భక్తులు https://ttdevasthanams.ap.gov.in
 వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.

By
en-us Political News

  
తెలంగాణలో 20మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశానికి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు, విద్యకే తొలి ప్రాధాన్యత ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు
కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు
సికింద్రాబాద్ మున్సిపల్ సాధన కోసం బీఆర్‌ఎస్ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది.
నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌నకు గ్ర‌హీత కొరినా మ‌చాడో అందజేసింది
దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు.
రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఏఐడీఎంకే పార్టీ తొలి విడత మేనిఫెస్టో ప్రకటించింది.
మేడారం మహాజాతర కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) విస్తృత స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. లక్షల మంది భక్తులు వన దేవత లైన సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు తరలి రానున్న నేపథ్యంలో.. వారికి ఎటువంటి ప్రయాణ ఇబ్బందులూ తలెత్తకుండా టీఎస్ఆర్టీసీ రవాణా ప్రణాళికను సిద్ధం చేసింది.
డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ , స్పెషల్ టాస్క్ ఫోర్స్, మరియు కోబ్రా ఫోర్స్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కూబింగ్ లో తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత పాపారావు అక్కడికక్కడే మరణించాడు.
అమెరికా జాతీయ భద్రత విషయంలో గ్రీన్ లాండ్ అత్యంత కీలకమన్న ట్రంప్ ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని తీరుతామని, ఈ విషయంలో తమను వ్యతిరేకించేవారెవరైనా సరే సహించేది లేదని ప్రపంచ దేశాలకు ట్రంప్ అల్టిమేటమ్ ఇచ్చారు.
స్థానిక ఐదు రోడ్ల కూడలి నుంచి ప్రారంభమైన స్వామివారి రథోత్సవం కృష్ణ బజార్ , వేంకటేశ్వర స్వామి ఆలయం మీదుగా సాగింది. ఈ సందర్భంగా వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుపై గోరంట్ల మాధవ్ పై పోక్సో కేసు నమోదైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.