ఇక సిఎం మార్పు లేనట్లేనా?
Publish Date:Jul 28, 2012
Advertisement
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని మార్చేస్తారని ఇప్పటి వరకూ వచ్చిన ఊహాగానాలకు తెరపడిరది. ఆయన స్థానంలో తెలంగాణా ప్రాంతానికి చెందిన సీనియర్నేతను సిఎంగా ప్రకటించి ఆ తరువాత సమైక్యాంధ్రగానే రాష్ట్రం కొనసాగిస్తారని కాంగ్రెస్ అధిష్టానంపై పలు ఊహాగానాలు వెలువడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రత్యేక తెలంగాణా ఇవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్లో పలు భౌగోళిక, జల సమస్యలు ఉత్పన్నమవుతాయని, ఆంతర్రాష్ట్ర విబేధాలకు ఇది వేదికవుతుందని కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి నివేదించనుంది. ఈ నివేదిక మార్పులకు అవకాశం లేదని స్పష్టంగా ప్రకటించటంతో సిఎం మార్పు కూడా ఉండకపోవచ్చని రాజకీయపరిశీలకులు స్పష్టంగా చెబుతున్నారు. ఒకవేళ సిఎంను మార్చి ఇంకొకరికి అధికారమిస్తే ఆయన తెలంగాణావాదానికి లొంగరన్న గ్యారెంటీ లేదు కాబట్టి ఆ నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం వెనక్కితీసుకుందంటున్నారు. ఇందిరమ్మబాట, మంత్రి ధర్మానప్రసాదరావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు, తెలంగాణా సమస్య ఎదురైతే దానిపై స్పందించిన తీరు, పర్యటనలకు వెనుకాడని నైజం సిఎం కిరణ్కుమార్రెడ్డికి ప్లస్ అయ్యాయని వివరిస్తున్నారు. ప్రత్యేకించి ప్రజల్లో మమేకమయ్యేందుకు సిఎం చూపిస్తున్న చొరవను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదిక తీసుకుందని భావిస్తున్నారు. అంతేకాకుండా రాహుల్గాంధీ ప్రధాని అభ్యర్థి అయ్యేందుకు తన వంతు సహకారం అందిస్తామన్న సిఎం భరోసా కూడా సీటుమార్పు ఆలోచనను దెబ్బతీసిందని విశదీకరిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/-cm-kirankumar-reddy-24-16016.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





