గులాబీ గూటిలో ఉపఎన్నికల గుబులు

Publish Date:Sep 15, 2015

Advertisement


 


తెలంగాణలో తమకు ఎదురే లేదన్నట్లుగా ఏకఛత్రాధిపత్యంగా దూసుకుపోతున్న గులాబీ పార్టీకి అడ్డుకట్టపడేటట్లే కనిపిస్తోంది. కేసీఆర్ పైనా, టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా ప్రజలు పెట్టుకున్న నమ్మకం మెల్లగా కరిగిపోతుందని, త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీకి దిమ్మదిరిగే షాక్ ఖాయమని అంటున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పదేపదే ఉపఎన్నికల అస్త్రాన్ని ప్రయోగించి, ప్రత్యర్ధి పార్టీలను ముప్పుతిప్పలు పెట్టిన టీఆర్ఎస్ కు ఇప్పుడవే ఉపఎన్నికలు తలనొప్పిగానూ, సవాలుగానూ మారాయంటున్నారు.

ప్రస్తుత పరిస్థితులు టీఆర్ఎస్ కు ఏమాత్రం అనుకూలంగా లేవని గులాబీ శ్రేణులు కూడా అంగీకరిస్తున్నాయి. రైతు ఆత్మహత్యలతో ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిందని, మరోవైపు రుణమాఫీపై రైతుల్లో అసంతృప్తి, బ్యాంకు రుణాలు అందకపోవడం, పెన్షన్ లబ్దిదారుల ఎంపికలో కిరికిరి, చీప్ లిక్కర్ తేవాలన్న ప్రయత్నాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చాయని అంగీకరిస్తున్నారు. పైగా అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినా, కొన్ని హామీల విషయంలో ఇంకా అడుగు ముందుకు పడలేదని, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇందిరమ్మ బిల్లులు చెల్లించకపోవడం వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావితం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఒకవేళ ఉపఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే, ప్రభుత్వ ప్రతిష్ట మరింత దిగజారడం ఖాయమని టీఆర్ఎస్ నేతలు భయపడిపోతున్నారట. అందుకే అభ్యర్ధులెవరనే దాని కంటే, ప్రతికూల అంశాలు ఏంటనే దానిపైనే టీఆర్ఎస్ లో చర్చ నడుస్తోందట. అసలు విపక్షాలు ఏఏ అంశాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై కసరత్తు చేస్తున్నారట. వరంగల్ పార్లమెంట్ స్థానంతోపాటు నారాయణఖేడ్ ఉపఎన్నిక విషయంలోనూ టీఆర్ఎస్ లో ఆందోళన చెందుతోందని, అయితే కిష్ణారెడ్డి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఏకగ్రీవమయ్యేటట్లు అన్ని పార్టీలూ నిర్ణయం తీసుకుంటాయా? లేక పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉందని అంటున్నారు.

అయితే టీఆర్ఎస్ నేతల దురుసు ప్రవర్తన, పార్టీ ఫిరాయింపుల వ్యవహారం, కేసీఆర్ ఒంటెద్దు పోకడలు, విద్యార్ధుల్లో, యువతలో ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత...తమకు కలిసొస్తాయని విపక్షాలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్ సర్కార్ పై భ్రమలు తొలగిపోతున్నాయని, ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు షాకివ్వడం ఖాయమంటున్నారు. అయితే ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నట్లు జరుగుతుందా? లేక ఉప ఎన్నికల గండం గట్టెక్కి...మరోసారి అందరికీ టీఆర్ఎస్ షాకిస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాలి.

By
en-us Political News

  
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.