Publish Date:Dec 28, 2019
సంగారెడ్డి జిల్లాలో మునిసిపల్ ఎన్నికల సందడి మొదలైంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి నేతలు గెలుపుపై ఎవరికివారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. టిడిపి, వామపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నాయి. జిల్లాలో ఈసారి ఎన్నికల్లో యువత పోటీకి ఎక్కువగా ఉత్సాహం చూపుతోంది. అన్ని పార్టీల నేతలు కొత్త ముఖాలను బరిలోకి దించాలని యోచిస్తున్నాయి.
జిల్లాలో గతంలో ఉన్న సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్, జోగిపేట పురపాలక సంఘాలతో పాటు కొత్తగా ఏర్పడిన నారాయణఖేడ్, అమీన్ పూర్, బొల్లారం, తెల్లాపూర్ మునిసిపాలిటీల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. పరిధిల విలీనం వార్డుల విభజన వంటి సమస్యలూ కోర్టు పరిధిలో ఉన్నందున జహీరాబాద్ మునిసిపల్ ఎన్నికలకు బ్రేక్ పడింది. మిగిలిన ఏడు పురపాలకల్లో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. కానీ అందరి దృష్టీ పటాన్ చెరువు నియోజక వర్గం పైనే పడింది ఇక్కడ మేజర్ పంచాయతీలు ఈసారి మునిసిపాలిటీలుగా మారాయి. దీంతో రాజకీయ పార్టీల నేతలతో పాటు చాలా మంది ఔత్సాహికులు సయ్యంటూ సవాలు విసురుతున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన పటాన్ చెరువు నియోజక వర్గం హైదరాబాద్ కు కూతవేటు దూరంలో వుంటుంది. ఈ ప్రాంతమంతా దాదాపుగా హైదరాబాద్ లో కలిసినట్టే ఉంటుంది. చాలా మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు పటాన్ చెరువు నియోజక వర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తుంటారు. భూములు కూడా కోట్లలో ధర పలుకుతాయి. ఈ ప్రాంతమంతా హైదరాబాద్ వాతావరణమే కనిపిస్తుంది. ఇక గతంలో ఉన్న గ్రామ పంచాయతీలు పురపాలక సంఘాలగా మారి హోదా పెరిగింది. దీంతో అమీన్ పూర్, తెల్లాపూర్, బొల్లారం ప్రాంతాల్లో భూముల విలువ అమాంతం పెరిగింది. అదే సమయంలో గ్రామ స్థాయి నేతలంతా పట్టణ స్థాయి నేతలుగా ప్రమోట్ అయ్యారు. హైదరాబాద్ కు దగ్గరగా ఉండటం పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఎన్నికల్లో పోటీకి చాలా మంది ఔత్సాహికులు ముందుకొస్తున్నారు.
ఇక ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య కనిపిస్తుంది. బిజెపి కూడా అన్ని చోట్లా పోటీకి సై అంటున్న ఈ రెండు పార్టీలను ఢీకొని క్యాడర్ మాత్రం కమలనాథులకు లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మునిసిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన మహిపాల్, మూడు మునిసిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తామన్న ధీమాతో ఉన్నారు. అధికార పార్టీ కావడం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కూడా టీఆర్ఎస్ కు కలిసి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ నేతలు కాట శ్రీనివాస్ గౌడ్, గాలి అనిల్ కుమార్ లు పార్టీ అభ్యర్ధుల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధినే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికీ మునిసిపల్ ఎన్నికలు చలికాలంలో వేడి పుట్టిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-focus-on-municipal-elections-25-92666.html
దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు.
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది.
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు.
మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్ల సౌండ్తో మార్మోగిపోయాయి.
సరిగ్గా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్థైర్యం, ధైర్యం జావగారిపోయాయా? స్వయానా చెల్లెలు షర్మిల సూటిగా చేస్తున్న విమర్శలు జగన్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టడంతోనే జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది.