Publish Date:Aug 28, 2022
ఒకాయన తన స్నేహితుడి ఇంటికి వెళ్లి మార్కెట్కి రావడం లేదే అని అడిగాడు. ఎందు కు డబ్బు దండగన్నా డు ఆ స్నేహితుడు. అన్నీ రాజకీయపార్టీ వారే ఇస్తామన్నపుడు మళ్లీ కొనడం దేనికన్నా డు. మొన్ననే గోడ గడి యారం ఒకటి కొనాల నుకునాను.మరుక్షణం ఒకాయనొచ్చి ఏ బ్రాండ్ కావాలో అడిగి మరీ కొనిచ్చి వెళ్లాడు. నిన్న భారీ వర్షంపడింది. ఇంట్లో గొడుగుల్లేవు ఎలా బయటకి వెళ్లాలా అనుకున్నాననా, పొద్దున్నే ఒకాయన సీఎం బొమ్మతో ఉన్న గొడుగులు రెండిచ్చి సమస్యతీర్చి వెళ్లాడు. రేపె వరన్నా వచ్చి ఫ్లాస్కో, ఫ్రిజ్జో ఇచ్చేస్తే బావుణ్ను అనుకున్నాడు. ఫ్రిజ్ సంగతి ఎలా ఉన్నా రాజకీయ పార్టీల తీరుతెన్నులు ఇలా మారిపోయాయన్నది ఆ పెద్దాయన చూచాయిగా చెప్పాడు. ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమం గా అమలుచేసి వారి మేలు కోరితే అంతకంటే మరేమీ అక్కర్లేదనుకునే ఓటర్లకు ఇలాంటి కానుకలతో బద్ధకాన్ని పెంచి పోషిస్తు న్నారన్న ఆరోపణలు బాగానే ఉన్నాయి.
అసలే ఉచితాలతో ప్రజల్ని బాగా ఆకట్టుకోవడం అలవాటుగా చేసుకున్న పార్టీలు ఇపుడు ఈ చిరు కానుకలతోనూ కట్టిపడే స్తున్నారు. చిత్రమేమంటే, ఎన్నికల సమయంలోనే పాపం బీద ఓటర్లంతా ఒక్కసారిగా రాజకీయనాయకుల కలల్లో కనపడ తారు. వీరికి ఎవరూ ఏమీ ఇవ్వలేకపోతే ఎలా? అనే చింతనా వ్యధతో తెల్లారగానే గడియారాలు, గొడుగులు, ఇస్త్రీపెట్టెలు వంటి వాటితో వీధుల్లో, చిన్నగల్లీలోనూ సమావేశాలు పెట్టి మరీ గొప్ప సత్కారం చేసినట్టు ఇవ్వడం పరిపాటి అయింది. ఎన్నికల రోజు ప్రత్యేక బళ్లు ఏర్పాటు చేయడం, ఇళ్లకి వెళ్లి ఓటర్లను చక్కగా పలకరించడం, వీలైతే కుంకుమ భరిణతో సహా సతీ సమేతంగా వెళ్లి పలకరించడం ఆనవాయితీగా చేసుకున్నారు. ఇదో గొప్ప ఆకర్ష్ కళ. ఇదింకా పాపం బీజేపీవారికి తెలియలేదు.
మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడన్నది ఇంకా తెలియకపోయినప్పటికీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాలపర్వం మాత్రం జోరుగా కొనసాగుతోంది. నిన్నటి దాకా గోడ గడియారాలు పంచిన టీఆర్ఎస్ నేతలు తాజాగా గొడుగుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఒకటి రెండు చోట్ల ఓటర్లు గోడ గడియారాలను తిరస్కరించినా ప్రలోభాలను మాత్రం ఆపడం లేదు.
తాజాగా సీఎం కేసీఆర్ నవ్వుతున్న ఫొటో, పార్టీ కారు గుర్తు ముద్రించిన గొడుగులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మునిసిపాలిటీతో పాటు మండలవ్యాప్తంగా శనివారం రాత్రి పంచారు. ప్రధానంగా టీఆర్ఎస్ ఓటర్లు అనుకున్న వారితోపాటు తటస్థులకు కూడా గొడుగు లు పంపిణీ చేశారు. అధికార పార్టీ తన గుర్తును విస్తృతంగా మునుగోడు ఓటర్లకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే రోజువారీగా ఉపయోగించే వస్తువులను ప్రలోభాలకు అస్త్రంగా వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ గొడుగు టెక్నిక్ మరి ఓట్లను ఏ మేరకు వేయిస్తుందనేది చూడాలి. వర్షాలు, ఎండల రాకపోకలు తెలియని ఈ రోజుల్లో గొడుగులు ఇచ్చి తమ ప్రత్యేకతనీ టీఆర్ ఎస్ చాటుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs--umbrella-25-142806.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.